
టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరు, గుంటూరులో నిర్వహించిన సభల్లో జరిగిన తొక్కిసలాట ఘటనలను ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ బి.శేష శయన రెడ్డి నేతృత్వంలో విచారణ కమిటిని నియమించింది. చంద్రబాబు నిర్వహించిన సభలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా.. ఇందులో కందుకురులో 8 మంది, గుంటూరులో ముగ్గురు మృతి చెందారు. కాగా ఈ ఘటనలపై జస్టిస్ శేషశయన రెడ్డి కమిషన్ విచారించనుంది.