ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు | 630 New Corona Positive Cases Reported In AP | Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 630 కరోనా కేసులు

Dec 5 2020 7:36 PM | Updated on Dec 5 2020 7:40 PM

630 New Corona Positive Cases Reported In AP - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 57,132 కరోనా పరీక్షలు నిర్వహించగా, 630 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటివరకు ఏపీలో కరోనా సోకిన వారి సంఖ్య 871305కి చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 882 మంది కరోనా నుంచి క్షేమంగా కోలుకుని డిశ్చార్జ్‌ అవ్వగా ఇప్పటివరకు 8,58,115 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. (చదవండి: అంబటి రాంబాబుకు మళ్లీ కరోనా..)

గడచిన 24 గంటల్లో కరోనా బారినపడి కృష్ణా జిల్లాలో ఇద్దరు.. చిత్తూరు, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం నలుగురు మరణించగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో 7024 మంది మృతిచెందారు. రాష్ట్రంలో 6,166 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. నేటి వరకు ఏపీలో 1,03,50,283 కరోనా  నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. (చదవండి: కరోనా వైరస్‌కు రుణపడి ఉన్నా: వర్మ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement