ఏపీలో కొత్తగా 20,345 కరోనా కేసులు | Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 20,345 కరోనా కేసులు

Published Tue, May 11 2021 4:55 PM

20345 New Corona Positive Cases Reported In AP - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలో గత 24 గంటల్లో 86,878 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 20,345 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

గత 24 గంటల్లో కరోనా వైరస్‌ బారినపడి చిత్తూరు జిల్లాలో 18, విశాఖ జిల్లాలో 12,  తూర్పు గోదావరి, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో 10 మంది చొప్పున.. ప్రకాశం జిల్లాలో 9, నెల్లూరు జిల్లాలో 8, కృష్ణా జిల్లాలో ఏడుగురు, శ్రీకాకుళం జిల్లాలో ఆరుగురు మృతి చెందారు. పశ్చిమగోదావరి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. వైఎస్సార్‌ జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. మొత్తం 108 మంది మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 8,899 మంది మృతి చెందారు.గత 24 గంటల్లో 14,502 మంది డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 11 లక్షల 18 వేల 933 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 1,95,102 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఏపీలో ఇప్పటివరకు 1,75,14,937 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

చదవండి: ఏపీలో కరోనా నిబంధనలు మరింత కఠినతరం
తిరుపతి రుయా ఆస్పత్రిలో అదనపు ఆక్సిజన్‌ ప్లాంట్‌

Advertisement
Advertisement