
ఎంపీఆర్లోకి తుంగభద్ర జలాలు
గార్లదిన్నె: మండలంలోని పెనకచెర్ల వద్ద ఉన్న మిడ్ పెన్నార్ రిజర్వాయర్ (ఎంపీఆర్)లోకి తుంగభద్ర జలాలు చేరుతున్నాయి. దీంతో రిజర్వాయర్లో నీటి మట్టం పెరుగుతోంది. ఆదివారం రిజర్వాయర్ ఏఈ సురేంద్ర మాట్లాడుతూ.. కణేకల్లు నుంచి మోపిడి కాలువ ద్వారా రోజూ 500 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్లోకి చేరుతున్నట్లు వివరించారు. ప్రస్తుతం రిజర్వాయర్లో 0.45 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లుగా తెలిపారు.
కుమార్తెలతో కలసి
తండ్రి ఆత్మహత్యాయత్నం
బెళుగుప్ప: కుటుంబ కలహాల నేపథ్యంలో విసుగు చెందిన వ్యక్తి.. తన ఇద్దరు కుమార్తెలతో కలసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలు.. బెళుగుప్ప మండలం నక్కలపల్లికి చెందిన రమేష్రెడ్డి, దివ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న పాటి విషయానికి ఆదివారం దంపతులు గొడవ పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన రమేష్రెడ్డి.. తన ఇద్దరు కుమార్తెలను వెంట బెట్టుకుని వ్యవసాయ తోటలోకి వెళ్లి విషపు గుళికలు తాను తిని, చిన్నారులకూ తినిపించాడు. కాసేపటి తర్వాత పిల్లలను పిలుచుకుని ఇంటికి చేరుకున్నాడు. విషయాన్ని తల్లికి చిన్నారులు తెలపడంతో కుటుంబసభ్యులు వెంటనే కళ్యాణదుర్గంలోని సీహెచ్సీకి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. కాగా, ఆరేళ్ల వయసున్న కుముద్విని, మూడేళ్ల వయసున్న ఛైత్ర పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.