కూటమి హయాంలో రైతులకు భరోసా లేకుండా పోయింది. సీజన్లో యూరియా, విత్తనాల పంపిణీ సకాలంలో జరగడం లేదు. రైతు సేవా కేంద్రాల ద్వారా సేవలు అందడం లేదు.గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమయ్యే పలు రకాల సేవలు సకాలంలో అందేవి. నేడు అటువంటి పరిస్థితులు లేవు. దీనికి తోడు రైతుల సంక్షేమం కోసం ఎటువంటి పథకాలు పూర్తి స్థాయిలో అందడం లేదు. మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి హయాంలో రైతుకు భరోసా ఉండేది. నేడు కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పని చేస్తుంది.
–బొడ్డేడ చెల్లయ్యనాయుడు, రైతు, మూలపేట


