9న కేజీహెచ్‌లో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

9న కేజీహెచ్‌లో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ ప్రారంభం

Jul 3 2026 12:34 AM | Updated on Jul 3 2026 12:34 AM

మహారాణిపేట: కేజీహెచ్‌లో నిర్మించిన క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ యూనిట్‌ను మంజూరు చేసింది. మొత్తం రూ.23 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ అత్యాధునిక కేంద్రాన్ని ఈ నెల 9న ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల్లో 60 శాతం కేంద్ర ప్రభుత్వం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాయి. మొత్తం వ్యయంలో రూ.11 కోట్లతో భవన నిర్మాణ పనులు చేపట్టగా, రూ.9 కోట్లతో అత్యాధునిక వైద్య పరికరాలు కొనుగోలు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement