తాటిచెట్లపాలెం: పని ప్రదేశాల్లో భద్రత, ఆస్తుల నష్ట నివారణ, రైళ్ల సమయపాలనపై దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ మంగళవారం జీఎం కార్యాలయంలో జోనల్ పరిధిలోని నాలుగు డివిజన్ల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పని ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలు, ఆస్తుల రక్షణ, రైళ్ల సమయపాలనపై అధికారులతో చర్చించారు. భద్రతకు ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఉద్యోగులు అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు.


