ప్రజల్లోకి బాబు మోసాలు | - | Sakshi
Sakshi News home page

ప్రజల్లోకి బాబు మోసాలు

Aug 3 2025 3:14 AM | Updated on Aug 3 2025 3:14 AM

ప్రజల

ప్రజల్లోకి బాబు మోసాలు

‘బాబు ష్యూరిటీ..మోసం గ్యారెంటీ’ పేరుతో వైఎస్సార్‌సీపీ నాయకులు కూటమి ప్రభుత్వం కుటిల పాలనను ఎండగడుతున్నారు. గ్రామగ్రామాన రచ్చబండ నిర్వహించి చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరిస్తున్నారు. యలమంచిలి మండలం ఏటికొప్పాక, పద్మనాభరాజుపేట, బయ్యవరం, ములకలాపల్లి గ్రామాల్లో నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజుతో కలిసి పర్యటించారు. గత 14 నెలల కాలంలో ప్రజలు ఎంత నష్టపోయిందీ వివరించారు. దీంతో పలువురు గ్రామస్థులు స్పందిస్తూ వైఎస్‌ జగన్‌ పాలనతో ప్రస్తుత కూటమి పాలనను బేరీజు వేసుకుని జగన్‌ పాలన ప్రయోజనాలను గుర్తు తెచ్చుకున్నారు. ఆయా గ్రామాల్లో పార్టీ శ్రేణులు క్యూఆర్‌ కోడ్‌తో ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని సూచించారు. అనకాపల్లి పట్టణంలోని పాత బర్మాకాలనీలో వార్డు కార్పొరేటర్‌ మందపాటి సునీత, పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజులతో కలిసి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌ కుమార్‌ పర్యటించారు. ఒక మోసగాడు.. వేషగాడు కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. –యలమంచిలి/అనకాపల్లి

ప్రజల్లోకి బాబు మోసాలు 1
1/1

ప్రజల్లోకి బాబు మోసాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement