
25న ఏపీ ప్రజా నాట్యమండలి ప్రథమ మహాసభ
కె.కోటపాడు : ఈ నెల 25న అనకాపల్లిలో ఏపీ ప్రజా నాట్యమండలి ప్రథమ మహాసభను నిర్వహిస్తున్నట్లు సీపీఐ మండల కార్యదర్శి గొర్లె దేముడుబాబు, పొంతపల్లి రామారావు తెలిపారు. కె.కోటపాడులో శనివారం మహాసభకు సంబంధించిన కరపత్రాలను వీరు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేముడుబాబు, రామారావు మాట్లాడుతూ కార్పొరేట్ సంస్కృతికి ప్రత్యామ్నాయంగా ప్రజా కళలను తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని వీరు తెలిపారు. కళాకారులు పెద్ద సంఖ్యలో అనకాపల్లిలో కాపుగంటి గోవిందరావు భవన్లో నిర్వహించే మహసభలలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకుడు రెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు.