
పేకాట శిబిరంపై పోలీసుల దాడి
కశింకోట : తీడ గ్రామ శివారు కచ్చళ్లపాలెంలో పేకాట స్థావరంపై పోలీసులు శనివారం దాడి చేసి భారీగా రూ.1,02,348 నగదు పట్టుకున్నారు. 13 మందిని అరెస్టు చేసి 4 మోటారు వాహనాలు, 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీఐ అల్లు స్వామినాయుడు అందించిన వివరాలు ప్రకారం...ముందుగా అందిన సమాచారం మేరకు గుట్టు చప్పుడు కాకుండా కచ్చళ్లపాలెంలో పేకాట శిబిరంపై సీఐ ఆధ్వర్యంలో ఎస్ఐ కె.లక్ష్మణరావు, పి.మనోజ్కుమార్,పోలీసు సిబ్బంది దాడి చేశారు. నిందితులను పట్టుకోవడంతో పాటు మోటారు వాహనాలు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితిలోను సహించేది లేదని సీఐ స్వామినాయుడు హెచ్చరించారు.