తగ్గని చలి, మంచు తీవ్రత | - | Sakshi
Sakshi News home page

తగ్గని చలి, మంచు తీవ్రత

Dec 29 2025 7:55 AM | Updated on Dec 29 2025 7:55 AM

తగ్గన

తగ్గని చలి, మంచు తీవ్రత

చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగినా మంచు, చలిత్రీవత కొనసాగుతూనే ఉంది. ఆదివారం జి.మాడుగులలో 7.5 డిగ్రీలు, చింతపల్లిలో 8.0 డిగ్రీలు నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌, వాతావరణ విభాగం నోడల్‌ అధికారి డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.

● పాడేరు డివిజన్‌ పరిధి ముంచంగిపుట్టులో 8.1 డిగ్రీలు, పాడేరులో 9.2 డిగ్రీలు, పెదబయలులో 9.6 డిగ్రీలు, హుకుంపేటలో 10.0 డిగ్రీలు, అరకువ్యాలీలో 10.4 డిగ్రీలు, కొయ్యూరులో 13.0 డిగ్రీలు నమోదు అయ్యాయన్నారు.

● రంపచోడవరం డివిజన్‌ మారేడుమిల్లిలో 11.1 డిగ్రీలు, వై.రామవరంలో 11.4 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 13.8 డిగ్రీలు, అడ్డతీగలలో 15.0 డిగ్రీలు, రంపచోడవరంలో 15.7 డిగ్రీలు, చింతూరు డివిజన్‌ ఎటపాకలో 14.8 డిగ్రీలు, చింతూరులో 15.3 డిగ్రీలు నమోదు అయినట్టు ఏడీఆర్‌ పేర్కొన్నారు.

● ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగినా సాయంత్రం అయ్యేసరికి శీతల గాలులు ప్రభావం ఎక్కువగానే ఉంటోంది. దీనివల్ల మన్యం వాసులు ఇళ్లకు పరిమితం అవుతున్నారు. ఉదయం పది గంటల వరకు మంచు, చలి ప్రభావం ఉంటోంది. రహదారులను మంచు తెరలు కమ్మేయడం వల్ల వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు.

కమ్మేసిన మంచు తెరలు

పెదబయలు: మండలంలో చలితో మంచు తీవ్రత ఎక్కువగా ఉంది. ఆదివారం ఉదయం 9.30 వరకు మంచు తెరలు దట్టంగా కమ్మేశాయి. పర్యాటకులు మంచు అందాలను తిలకించారు. స్థానికులు మాత్రం ఇబ్బందులు పడ్డారు.

జి.మాడుగులలో 7.5 డిగ్రీల నమోదు

తగ్గని చలి, మంచు తీవ్రత 1
1/1

తగ్గని చలి, మంచు తీవ్రత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement