
తప్పుడు సమాచారంతో నిలిపివేత
ప్రతీ ఇంట్లో చదువుకుంటున్న పిల్లలందరికీ తల్లికి వందనం ఇస్తామని చంద్రబాబు చెప్పడంతో ఎంతో సంతోషించాం. మా ఇద్దరి పిల్లలు సాయి, ఉదయ్లకు రూ.30 వేలు వస్తుందని ఆశపడ్డా. నగదు జమచేశామని ప్రభుత్వం చెప్పడంతో ఖాతా చూసుకున్నా. నిధులు జమకాకపోవడంతో ఆరాతీయగా 300 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగిస్తున్నందున జమకాలేదన్నారు. పేద కుటుంబం కావడంతో నిజానికి ఎప్పుడూ అన్ని యూనిట్ల విద్యుత్ వినియోగించలేదు. తప్పుడు సమాచారంతో నిలిపివేయడం సరికాదు. – చింతల దేవి, టేకులబోరు, కూనవరం మండలం