ఆక్రమణల తొలగింపులో ప్రేక్షకపాత్ర | - | Sakshi
Sakshi News home page

ఆక్రమణల తొలగింపులో ప్రేక్షకపాత్ర

Jun 15 2025 7:59 AM | Updated on Jun 15 2025 7:59 AM

ఆక్రమ

ఆక్రమణల తొలగింపులో ప్రేక్షకపాత్ర

పాడేరు : జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంతో పాటు ఏజెన్సీలోని ప్రధాన కేంద్రాల్లో 1/70 చట్టానికి తూట్లు పొడుస్తూ అక్రమ కట్టడాలు, ఆక్రమణలు పెచ్చుమీరుతున్నాయని, వీటిని అరికట్టాల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు ధ్వజమెత్తారు. ఆక్రమణల తొలగింపులో కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌ తీరుకు నిరసనగా శనివారం పాడేరు పట్టణంలోని పాత బస్టాండ్‌ సమీపంలోని ఆర్‌ఆండ్‌బీ క్వార్టర్ల ఎదురుగా ప్రధాన రహదారిపై వైఎస్సార్‌సీపీ నేతలు, స్థానికులతో కలిసి ఆయన బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాడేరు పట్టణంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో పలుచోట్ల ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలను కాపాడుతామని, రహదారికి ఇరు వైపులా వంద అడుగుల మేర రహదారి విస్తరణ చేపడుతామని ప్రకటించిన కలెక్టర్‌ దినే

ష్‌కుమార్‌ మొదటి వారంలో కొన్ని ఆక్రమణల తొలగింపు చేపట్టారన్నారు. దీంతో స్థానికులతో పాటు గిరిజన సమాజం కలెక్టర్‌ చర్యలను ఎంతో హర్షించాయన్నారు. కానీ ఉన్నట్టుండి రెండో వారం నుంచి సీన్‌ రివర్స్‌ అయిందన్నారు. కఆక్రమణల తొలగింపులో కొంతమంది కూటమి నేతలు జోక్యం చేసుకుని నిలుపుదల చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇదేమిటని అడిగితే సెలవు దినాలు కావడంతో తొలగింపు సాధ్యం కాలేదని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. కలెక్టర్‌ హైకోర్టు ఆదేశాలు పాటించకుండా రోజుకో మాట మాట్లాడి ప్రజలను ఆయోమయానికి గురి చేస్తున్నారన్నారు. రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా యని కలెక్టర్‌ చెప్పడం సరికాదన్నారు. ఏ రాజకీయ పార్టీ నాయకులు ఒత్తిళ్లు తెస్తున్నారో కలెక్టర్‌ బహి ర్గతం చేయాలన్నారు. జిల్లా కలెక్టర్‌ ద్వంద్వ వైఖరి విడనాడాలన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు తక్షణమే ఆక్రమణలను తొలగించి 100 అడుగుల మేర రహదారి విస్తరణ చేపట్టాలని లేకుంటే ప్రజలతో కలిసి వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు, మహిళ విభాగం జిల్లా అద్యక్షురాలు కురుసా పార్వతమ్మ, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు వనుగు బసవన్న దొర, సర్పంచ్‌లు వంతాల రాంబాబు, ఎంపీటీసీ సభ్యుడు లకే రామకృష్ణపాత్రుడు, వైఎస్సార్‌సీపీ నేతలు కూడా సుబ్రమణ్యం, శరభ సూర్యనారాయణ, మినుముల కన్నాపాత్రుడు, ముదిలి సత్యనారాయణ, సుదర్శన్‌ పాల్గొన్నారు.

పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు ధ్వజం

కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌ తీరుకు నిరసనగా ప్రధాన రహదారిపై బైఠాయింపు

ఇప్పటికై నా స్పందించకుంటే

ఆందోళన చేస్తామని హెచ్చరిక

ఆక్రమణల తొలగింపులో ప్రేక్షకపాత్ర 1
1/2

ఆక్రమణల తొలగింపులో ప్రేక్షకపాత్ర

ఆక్రమణల తొలగింపులో ప్రేక్షకపాత్ర 2
2/2

ఆక్రమణల తొలగింపులో ప్రేక్షకపాత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement