
నిరాశకు గురయ్యా
నలుగురు పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. గత ప్రభుత్వంలో అమ్మ ఒడి సాయం పొందా. ప్రస్తుత ప్రభుత్వంలో తల్లికి వందనం పథకం నిబంధనల ప్రకారం నలుగురు పిల్లలకు రూ.52వేలు బ్యాంకు ఖాతాలో జమకావాల్సి ఉంది. ఇందుకు సంబంధించి నా సెల్ఫోన్కు ఎటువంటి సమాచారం రాలేదు. బ్యాంకు ఖాతా పరిశీలించుకోగా, నగదు పడలేనట్టు చూపుతోంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నలుగురు పిల్లలకు నగదు జమ అవుతుందని ఆశపడ్డా. అర్హత ఉన్నా పడకపోవడంతో నిరాశకు గురయ్యా. – మర్రి గీత, సల్దిగెడ్డ మినుములూరు పంచాయతీ