వాగులో ఇద్దరు యువకుల గల్లంతు | - | Sakshi
Sakshi News home page

వాగులో ఇద్దరు యువకుల గల్లంతు

Jun 15 2025 7:59 AM | Updated on Jun 15 2025 7:59 AM

వాగుల

వాగులో ఇద్దరు యువకుల గల్లంతు

రంపచోడవరం: మారేడుమిల్లి ప్రాంతంలోని వాలమూరు వాగులో (పాములేరు వాగు) ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. విజయవాడకు చెందిన ఆరుగురు యువకులు విహారయాత్రకు మారేడుమిల్లి ప్రాంతానికి వచ్చారు. దీనిలో భాగంగా వారు ఇక్కడికి సుమారు పది కిలోమీటర్ల దూరంలోని పర్యాటక ప్రాంతమైన వాలమూరు వాగులో శనివారం స్నానాలకు దిగారు. వీరిలో సాధిష్‌ (23), కటకం రవితేజ (30) ప్రమాదానికి గురయ్యారు. వాగు ప్రవాహానికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు. దీంతో స్నేహితులు గాలింపు చేపట్టినా ఎటువంటి ఆచూకీ లభ్యం కాలేదు. వాగులో దిగవద్దని హెచ్చరించినా వారు పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు. వాగు వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసినా లక్ష్యపెట్టకుండా ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారని వారు వాపోయారు. ఇలావుండగా గల్లంతైన సాధిష్‌ ఫొటోగ్రాఫర్‌గా, రవితేజ విజయవాడలో ట్రావెల్స్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్నారని వారి స్నేహితులు వెల్లడించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న మారేడుమిల్లి సీఐ గోపాలకృష్ణ, గుర్తేడు ఎస్‌ఐ పార్థ సారధి సంఘ టన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు ము మ్మరం చేశారు. ఈ సంఘట నపై కేసు నమోదు చేసి చేసినట్లు తెలిపారు.

డుడుమ జలపాతంలో ఒకరు..

ముంచంగిపుట్టు: ఆంధ్రా ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో ఉన్న డుడుమ జలపాతం వద్ద పర్యాటకుడు గల్లంతయ్యాడు. కోల్‌కతాకు చెందిన అనిమేస్‌దాసు (27), భువనేశ్వర్‌లో ఉంటున్న వరుసకు అన్నయ్య, వదిన కుటుంబంతో కలిసి పర్యాటక ప్రాంతాల సందర్శనకు వచ్చారు. దీనిలో భాగంగా వారు శుక్రవారం ఒడిశాలోని కొర్రాపుట్టు జిల్లాలోని దేవ్‌మాలి, గాలిగబ్ధర్‌, కొలబ్‌ డామ్‌లను సందర్శించారు. అక్కడి నుంచి శనివారం డుడుమ జలపాతం వద్దకు వచ్చారు. వ్యూపాయింట్‌ వద్ద ఫ్యామిలీతో ఫొటోలు తీసుకున్నారు. అక్కడి నుంచి జలపాతం దిగువ భాగం చూసేందుకు 550 అడుగుల లోయలోకి మెట్ల మార్గం ద్వారా చేరుకున్నారు. అక్కడి నుంచి వారు చెరోవైపు వెళ్లారు. కాసపటికే కేకలు వినిపించాయి. చూసేసరికి అనిమేస్‌దాసు చెప్పులు మాత్రమే కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. స్థానికులు వెంటనే గాలింపు చేపట్టినా అతని ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో లంతాపుట్టు అగ్నిమాపక సిబ్బంది, మాచ్‌ఖండ్‌ ఎస్‌ఐ శుక్రమాడి, పోలీసు సిబ్బంది, ఒడిశా పంచాయతీ అధికారులు గల్లంతైన ప్రాంతానికి చేరుకున్నారు. సాయంత్రం వరకు గాలించినా ప్రయోజనం లేకపోయింది. ఆదివారం ఉదయం మళ్లీ గాలింపు చేపడతామని మాచ్‌ఖండ్‌ ఎస్‌ఐ వివరించారు.

స్నానం చేస్తుండగా ప్రమాదం

విహారయాత్రలో అపశ్రుతి

గాలింపు చేపట్టినా లభ్యం కాని ఆచూకీ

ఆందోళన చెందుతున్న స్నేహితులు

వాగులో ఇద్దరు యువకుల గల్లంతు1
1/2

వాగులో ఇద్దరు యువకుల గల్లంతు

వాగులో ఇద్దరు యువకుల గల్లంతు2
2/2

వాగులో ఇద్దరు యువకుల గల్లంతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement