
అండర్–23 క్రికెట్ జట్టు ఎంపికలు ప్రారంభం
విశాఖ స్పోర్ట్స్: వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ నెట్స్లో శుక్రవారం అండర్–23 పురుషుల జట్టు ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. మూడేళ్లుగా వీడీసీఏ జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లతో పాటు కొత్తగా మరికొందరు ఓపెన్ కేటగిరీలో అవకాశం దక్కడంతో.. వీరంతా ట్రయల్స్లో పాల్గొన్నారు. ఇప్పటికే వీడీసీఏ బ్యాటింగ్ విభాగంలో 27 మందిని, వికెట్ కీపర్లుగా ఐదుగురిని, ఫాస్ట్ బౌలర్లుగా 14 మందిని, స్పిన్నర్లుగా మరో 13 మందిని ప్రాబబుల్స్గా ఎంపిక చేసింది. అయితే ఔత్సాహిక క్రీడాకారులు తమకు అవకాశం ఇవ్వాలని కోరడంతో విశాఖ క్రికెట్ సంఘం స్పందించింది. ఓపెన్ కేటగిరీలో అవకాశం కల్పించడంతో ప్రాబబుల్స్తో పాటు దాదాపు ఇరవై మంది ఔత్సాహికులు ఈ ట్రయల్స్కు హాజరయ్యారు. ఈ ఎంపిక ప్రక్రియ శనివారం కూడా కొనసాగనుంది. సోమవారం విశాఖ జిల్లా అండర్–23 జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. ఈ జట్టు 2025–26 సీజన్లో జరిగే వన్డే, మల్టీ–డే ఫార్మాట్ మ్యాచ్ల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఎంపిక ప్రక్రియలో వయసు ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆటగాళ్లను అనుమతించారు. బ్యాటింగ్, ఫీల్డింగ్తో పాటు బౌలింగ్ నైపుణ్యాల సెలెక్టర్లు నిశితంగా పరిశీలించారు.
ప్రాబబుల్స్తో పాటు ఔత్సాహికులకు అవకాశం