ఉపాధ్యాయులు ఎంఈవో, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలకు సమాచారం ఇవ్వకుండా సెలవు పెట్టొద్దు. జిల్లాలో 168 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఉపాధ్యాయులు సెలవు పెడితే విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పక్క స్కూల్ ఉపాధ్యాయులు, సీఆర్పీ లతో చర్యలు చేపడుతున్నాం. – డి.మాధవి, డీఈవో
కనీసం ఇద్దరు టీచర్లు తప్పనిసరి..
విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి పాఠశాలకు కనీసం ఇద్దరు టీచర్లను కేటా యించాలి. ఒకే టీచర్ ఉంటే బోధన కష్టమవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో సెలవు పెడితే విద్యార్థులుకు ఇబ్బందులే. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి.
– శ్రీకాంత్, టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు


