సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలి
కై లాస్నగర్: సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ రాజర్షిషా విద్యార్థులకు సూచించారు. ఈనెల 8, 9 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించిన ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్లో మహాత్మ జ్యోతి బాపూలే పాఠశాల విద్యార్థులు వైష్ణవి, రానుష రూపొందించిన మల్టీపర్పస్ అగ్రికల్చరల్ మెషిన్ ప్రాజెక్టును ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారిని ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శాలువాలతో సన్మానించారు. జాతీయస్థాయి ఇన్స్పైర్ అవార్డు 2023–24కు మల్టీపర్పస్ అగ్రికల్చరల్ మెషిన్ ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థులను ప్రోత్సహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సంబంధిత శాఖల సహకారం అభినందనీయమని కొనియాడారు. ఇందులో ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, ప్రిన్సిపాల్ కీర్తి, ఉపాధ్యాయులు సుజాత, నీతిఅయోగ్ ప్రోగ్రాం అధికారి రాహుల్ తదితరులున్నారు.


