70వ సారి యువకుడి రక్తదానం
నెన్నెల: మండల కేంద్రం నెన్నెలకు చెందిన శ్రీరాంభట్ల సుశాంత్శర్మ సోమవారం 70వ సారి రక్తదా నం చేసి ప్రాణదాతగా నిలిచాడు. గోదావరిఖని ఏరి యా ఆస్పత్రిలో అత్యవసర పరిస్థితుల్లో తలసే మియాతో బాధపడుతున్న రవికి ఓ నెగిటివ్ రక్తం అవసరం ఏర్పడింది. మంచిర్యాల బ్లడ్బ్యాంకు వా రు ఫోన్ చేయగా వెళ్లి దానం చేశాడు. ఇప్పటికే 20 సార్లు రక్తకణాలు కూడా దానం చేశాడు. అ త్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం ఉన్న వారు 8555 899987 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు.
రక్తదానం చేస్తున్న సుశాంత్ శర్మ


