breaking news
ysr achievement awards 2023
-
ఆంధ్రప్రదేశ్లో ఘనంగా వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుల ప్రదానోత్సవం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
అసామాన్యులకు సత్కారం
వైఎస్సార్ తన సంక్షేమ పథకాల ద్వారా తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. అనేక పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేదలకు 78 లక్షల ఇళ్లు, 108 అంబులెన్స్, కోటి ఎకరాలకు సాగు నీరు, వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి కాపాడటం, ప్రధానంగా జలయజ్ఞం ద్వారా వైఎస్సార్ అందరి హృదయాల్లో నిలిచి పోయారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ కూడా అదే బాటలో కొనసాగుతున్నారు. – అబ్దుల్ నజీర్, రాష్ట్ర గవర్నర్ ఈ అవార్డులు అందుకుంటున్నవారంతా తమ తమ రంగాల్లో వారి జీవితాన్ని అర్పించారు. మన వారసత్వాన్ని తమ భుజాల మీద మోస్తున్నారు. వీరంతా మన జాతి సంపద. ఈ రోజు సమాజం ఇచ్చిన గుర్తింపు ఆధారంగా ప్రదానం చేస్తున్న ఈ అత్యున్నత అవార్డుల్లో చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా ఈ మూడేళ్లలో సామాజిక న్యాయం సంపూర్ణంగా వర్ధిల్లింది. ఈ అవార్డులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: దివంగత సీఎం వైఎస్సార్ దేశ చరిత్రలో చెరగని ముద్ర వేశారని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కొనియాడారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఆయన వేసిన బాటను ఎన్నో రాష్ట్రాలు అనుసరించాయన్నారు. ఇంత గొప్ప దార్శని కుడి పేరిట అవార్డులు ప్రదానం చేయడం ఆనందంగా ఉందన్నారు. తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన తొలుత రాష్ట్ర ప్రజలకు అంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు–వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డులు–2023 ప్రదానోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విజయవాడలో వేడుకగా నిర్వహించింది. ముఖ్య అతిథిగా గవర్నర్, విశిష్ట అతిథిగా వైఎస్ విజయమ్మ, సీఎం జగన్ పాల్గొన్నారు. వ్యవసాయం, కళలు–సంస్కృతి, సాహిత్యం, క్రీడలు, వైద్యం, మీడియా, సామాజిక సేవ రంగాలలో విశిష్ట సేవలు అందించిన 27 మంది ప్రముఖులకు అవార్డులను ప్రదానం చేశారు. వీరిలో 23 మందిని లైఫ్ టైం అచీవ్మెంట్, నలుగురిని అచీవ్మెంట్ పురస్కారాలతో సత్కరించారు. గవర్నర్ మాట్లాడుతూ.. వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్– వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డ్స్ను తన చేతుల మీదుగా అందించడం ఆనందాన్నిస్తోందన్నారు. దివంగత వైఎస్సార్ తన సంక్షేమ పథకాల ద్వారా తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్నారని, ఆయన ప్రవేశపెట్టిన అనేక పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఉమ్మడి ఏపీలో పేదలకు 78 లక్షల ఇళ్లను కట్టించారని, ఆయన ప్రారంభించిన 108 అంబులెన్సు సేవలను దేశంలో 15 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు అమలు చేయడం గొప్ప విషయమన్నారు. రైతాంగాన్ని వ్యవసాయ సంక్షోభం నుంచి కాపాడేందుకు 30 భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, 18 మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణం కోసం జలయజ్ఞం ప్రారంభించిన ఘనత ఆయనదేనన్నారు. అదే బాటలో సీఎం జగన్ సాగుతున్నారన్నారని చెప్పారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నుంచి వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారం అందుకుంటున్న కరణం మల్లీశ్వరి ఆర్థిక, రాజకీయ రంగాల్లోనూ ఏపీ అభివృద్ధి ఏపీ మూడు ప్రధాన రంగాలలో గణనీయమైన వృద్ధిని సాధించిందని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సేవల రంగాల్లో అద్భుతమైన పని తీరుతో 2022–23 సంవత్సరానికి 16.22% వృద్ధి రేటుతో ఏపీ గొప్ప పురోగతి సాధించిందన్నారు. 2021–22లో తలసరి ఆదాయం 14.02%తో ఆకట్టుకునే వృద్ధి రేటు నమోదు చేసిందని, సంవత్సరానికి జీఎస్డీపీ వృద్ధి రేటు 11.43%గా ఉందన్నారు. ఇది అన్ని రాష్ట్రాలతో పోలిస్తే అత్యధికం అని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఏపీలో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు సమర్థవంతంగా పనిచేస్తూ, పరిపాలనను అట్టడుగు స్థాయికి తీసుకెళ్లడంలో విజయం సాధించాయని కితాబిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆర్థిక, సామాజిక శ్రేయస్సు, ప్రగతి కోసం రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పథకాల కింద వివిధ ప్రధాన సంక్షేమ కార్యక్రమాలకు రూ.2.38 లక్షల కోట్లు వెచ్చించడం గమనార్హం అన్నారు. నవరత్నాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సామాజిక న్యాయం జరిగిందని, 56% రాజకీయ పోస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందించడం గొప్ప విషయమన్నారు. నామినేటెట్ పోస్టుల్లోనూ సగానికి పైగా ఈ సామాజిక వర్గాల వారికి కేటాయించడం ఏపీలోనే చూస్తున్నామన్నారు. 2022లో స్వచ్ఛ సర్వేక్షణ్లో రాష్ట్రం 7వ స్థానంలో నిలిచి జాతీయ స్థాయిలో మంచి ప్రగతి సాధించిందని చెప్పారు. మార్చిలో విశాఖలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో ఏపీ రూ.13.42 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలను సాధించిందని, తద్వారా ఈ ఏడాది 16 కీలక అభివృద్ధి రంగాలలో 6 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించే అవకాశం ఉందన్నారు. దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో ఏపీ స్థిరంగా ఒకటో స్థానంలో కొనసాగుతోందని చెప్పారు. 26 జిల్లాలు, 76 రెవెన్యూ డివిజన్లు, 108 పోలీసు డివిజన్లు ఏర్పాటు చేయడం ద్వారా జిల్లా పరిపాలనను వికేంద్రీకరించారన్నారు. పురస్కార గ్రహీతలు మన సంపద: సీఎం జగన్ సీఎం జగన్ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఏపీ అవతరించి నేటికి 67 సంవత్సరాలైందని, వరుసగా మూడో ఏడాది ఈ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించుకోవడం అనందంగా ఉందన్నారు. పలు రంగాల్లో రాణిస్తున్న మహనీయులను గౌరవిస్తూ వైఎస్సార్ అవార్డులతో మూడేళ్లుగా సత్కరించుకునే సంప్రదాయం పాటిస్తున్నామని తెలిపారు. మన సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ వివిధ రంగాల్లో ఆకాశమంత ఎదిగినా సామాన్యులుగానే ఒదిగి ఉన్న అసామాన్యులకు ఇస్తున్న అవార్డులని తెలిపారు. ఈ ఏడాది 27 మందిని వైఎస్సార్ అవార్డులతో సత్కరిస్తున్నామని, 23 మందికి లైఫ్ టైం అచీవ్మెంట్, నలుగురికి అచీవ్మెంట్ అవార్డులు ప్రదానం చేస్తున్నామన్నారు. ‘తెలుగుదనానికి, తెలుగు మాటకు, తెలుగువాడి గుండె ధైర్యానికి మన పల్లెలు, మన పేదలు, మన రైతుల మీద మమకారానికి, మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపం డాక్టర్ వైఎస్సార్. ఆ మహనీయుని పేరిట ఏటా ప్రభుత్వం అత్యున్నత అవార్డులు ప్రదానం చేస్తోంది. వైఎస్సార్ హయాంలో వ్యవసాయం, విద్య, వైద్యం, గృహ నిర్మాణం.. ఇలా ఏ రంగం తీసుకున్నా అంతకు ముందున్న చరిత్రగతిని మారుస్తూ ఎన్నో ముందడుగులు పడిన విషయం చూశాం. మన వ్యవసాయం, చేనేత, తప్పెటగుళ్లు, జానపదం, రంగస్థలంలో రాణిస్తున్న వారికి, అభ్యుదయ.. హేతువాదం, సాటి మనుషులకు విశిష్ట సేవలందిస్తున్న గొప్ప వ్యక్తులకు ఈ ఏడాది అవార్డుల్లో చోటు దక్కింది’ అని చెప్పారు. వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కింద రూ.10 లక్షలు, మెమెంటో, ప్రశంసా పత్రం.. వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు కింద రూ.5 లక్షలు, మెమెంటో, ప్రశంసా పత్రమిచ్చారు. పుల్లెల గోపీచంద్ తరఫున ఆయన సతీమణి లక్ష్మి..రావు బాలసరస్వతి తరఫున ఆమె కుమారుడు అవార్డులు అందుకున్నారు. మంత్రులు, సీఎస్ జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి, అవార్డు కమిటీ సభ్యులు సజ్జల, జీవీడీ కృష్ణమోహన్, దేవులపల్లి అమర్, ముత్యాలరాజు, అరుణ్కుమార్, విజయ్కుమార్రెడ్డి, బాలసుబ్రమణ్యంరెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ అవార్డు గ్రహీతల నేపథ్యం 1. పాంగి వినీత, మహిళా రైతు, అల్లూరి సీతారామరాజు జిల్లా (వైఎస్సార్ అచీవ్మెంట్) సేంద్రీయ విధానాలను పాటిస్తూ వ్యవసాయం చేస్తున్నారు. రైతు సాధికార సంస్థ సహాయంతో కషాయాల తయారీ.. రైతులకు పంపిణీ చేయడంతో పాటు పంట మార్పిడి విధానాన్ని కచ్చితంగా పాటిస్తూ ఏడాది పొడవునా వ్యవసాయ ఉత్పత్తులు సాగు చేస్తున్నారు. రైతులకు సేంద్రీయ వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు. 2. డాక్టర్ వై.వి.మల్లారెడ్డి, అనంతపురం (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) ప్రముఖ సామాజిక కార్యకర్త ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ స్థాపించిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)లో 42 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు. 15 ఏళ్లుగా అసియన్ ఫ్రాటెర్నా ఎకాలజీ సెంటర్ డైరెక్టర్గా సేవలు అందిస్తున్నారు. అనంతపురం జిల్లాలో 235 గ్రామాల పరిధిలో 60 వేల మందికి పైగా రైతులు, భూమి లేని వారు, ఇతర వర్గాలతో కలిసి వ్యవసాయం చేస్తున్నారు. జీవావరణం, పర్యావరణం వంటి రంగాల్లో సేవలు అందిస్తున్నారు. 3. యడ్ల గోపాలరావు, రంగస్థల కళాకారుడు, శ్రీకాకుళం (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) చిన్ననాటి నుంచే కళలపై మక్కువ ఉన్న ఈయన నక్షత్రక, శ్రీకృష్ణ, శ్రీరాముడి పాత్రలకు జీవం పోశారు. 14 ఏళ్ల వయసులో సాంఘిక నాటకాల ద్వారా అరంగేట్రం చేసి 5 దశాబ్దాలుగా సాంఘిక, పౌరాణిక పాత్రల ద్వారా వేలాది ప్రదర్శనలిచ్చారు. 4. తలిశెట్టి మోహన్, కలంకారీ కళాకారుడు, తిరుపతి (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) 1974 నుంచి కలంకారీ కళకు విశేష సేవలు అందిస్తున్నారు. సహజ రంగులతో అద్దకం, ఫ్యాబ్రిక్ తయారీలో నేటి కళాకారులకు శిక్షణ ఇస్తున్నారు. 1990లో కేంద్ర టెక్స్ టైల్స్ మంత్రిత్వ శాఖ ద్వారా నేషనల్ మెరిట్ అవార్డు అందుకున్నారు. 5. కోట సచ్చిదానంద శాస్త్రి, హరికథ, బాపట్ల (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) ప్రసిద్ధ హరికథా విద్వాంసుడు. ఆదిభట్ల నారాయణ దాసు ప్రియశిష్యుడు. ఈయన హరికథ వింటుంటే.. సినిమా చూస్తున్నట్లు కళ్లకు కట్టినట్లు ఉంటుందని పేరుగడించారు. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో 1500కు పైగా హరికథా ప్రదర్శనలిచ్చారు. భారత ప్రభుత్వం 2023 సంవత్సరానికి పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. 6. కోన సన్యాసి, తప్పెటగుళ్లు, శ్రీకాకుళం (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) ఉత్తరాంధ్రలో తప్పెటగుళ్లు సన్యాసిగా పేరుపొందారు. తెలుగు జానపదాలకు తప్పెటగుళ్లు పాట, ఆటతో దేశవ్యాప్తంగా కీర్తి తెచ్చారు. ఈ కళకు జీవం పోస్తున్నారు. తన ఇద్దరు కుమారులకు తప్పెటగుళ్లు కళను నేర్పించారు. 7. ఉప్పాడ హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ, కాకినాడ (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) 1938లో తన కార్యకలాపాలను ప్రారంభించిన ఉప్పాడ హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీలో 515 మంది సభ్యులున్నారు. 1986లో ఈ సొసైటీ రాష్ట్రపతి అవార్డు అందుకుంది. ఉప్పాడ జమ్దానీ పట్టు చీర 1999లో భౌగోళిక గుర్తింపు పొందింది. 8. ఎస్వీ రామారావు, అంతర్జాతీయ చిత్రకారుడు, కృష్ణా (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) ప్రముఖ కళాకారుడు, కవి, విద్యావేత్త, రచయిత. సమకాలీన ప్రపంచ కళాత్మక సంప్రదాయానికి మరింత వన్నె తెచ్చారు. తూర్పు– పశ్చిమ కళలకు వారధిగా వ్యవహరించి ప్రశంసలు అందుకున్నారు. 9. రావు బాలసరస్వతి, తొలితరం నేపథ్య గాయని, నెల్లూరు (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) ఈమె తొలితరం తెలుగు సినీ నటి, నేపథ్యగాయని. ఆరో ఏటనే గాత్ర కచేరి ప్రారంభించిన బాల సరస్వతి లలిత సంగీత సామ్రాజ్ఞిగా ప్రసిదిగాంచారు. ఆకాశవాణి సంగీత కార్యక్రమాలలో ఈమె కంఠం తెలుగు వారికి సుపరిచితం. 10. తల్లావఝుల శివాజీ, చిత్రకారుడు, రచయిత, పాత్రికేయుడు, ప్రకాశం (వైఎస్సార్ లైఫ్టైం అచీవ్మెంట్) తండ్రి శివశంకర శాస్త్రి నుంచి కళాసాహిత్యం అలవడింది. బొమ్మలు గీయడం చిన్నప్పటి నుంచే స్వయం కృషితో నేర్చుకున్నారు. పాత్రికేయుడిగా ఉద్యోగ విరమణ అనంతరం ఆదివాసీల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. ప్రకృతి, ఆ జీవన విధానపు స్వచ్ఛత, సరళత, నిరాడంబరత, ఇతిహాసాలు ఈయన చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. 11. డాక్టర్ చిగిచెర్ల కృష్ణారెడ్డి, జానపద కళలు, అనంతపురం (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో రికార్డు స్థాయిలో 35 పీహెచ్డీ డిగ్రీలు, 66 ఎంఫిల్ డిగ్రీలను ప్రదానం చేశారు. జానపద కళలను పర్యవేక్షించి మార్గదర్శకత్వం వహించిన ఏకైక ప్రొఫెసర్గా దేశంలోనే ఘనత సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో జానపద ప్రదర్శన కళలలో తొలిసారిగా పీహెచ్డీ అందించడంలో ప్రత్యేకతను సాధించారు. జానపద కళలు, జానపద సంస్కృతిపై పుస్తకాలను రచించారు. 12. కలీషాబీ మహబూబ్– షేక్ మహబూబ్ సుభానీ దంపతులు, నాదస్వరం, ప్రకాశం (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) ప్రకాశం జిల్లా పెద కొత్తపల్లికి చెందిన షేక్ మహబూబ్ సుభానీ సంగీత విద్వాంసుల కుటుంబానికి చెందినవారు. కలీసాహెబీ మహబూబ్ పూర్వీకులూ నాదస్వరం విద్వాంసులు కావడం విశేషం. ఈ దంపతులు భారత్తో పాటు అబుదాబి, జపాన్, మలేషియా, తదితర దేశాల్లో నాదస్వర కచేరీలు ఇచ్చారు. 13. ప్రొఫెసర్ బేతవోలు రామబ్రహ్మం, పశ్చిమ గోదావరి (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) సంస్కృతాంధ్ర పండితుడు, పద్య కవి, అవధాని, కథకుడు, అనువాదకుడు, అధ్యాపకులు. కొవ్వూరు సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ చేసి, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు పూర్తి చేశారు. ‘దేవీ భాగవతం’ వచన రచన ద్వారా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. 14. ఎండీ ఖదీర్బాబు, రచయిత, నెల్లూరు (వైఎస్సార్ అచీవ్మెంట్) మహమ్మద్ ఖదీర్బాబు ప్రసిద్ధ తెలుగు కథా రచయిత, నూతన తరం తెలుగు కథకులలో ప్రత్యేకౖమెన స్థానం. ప్రపంచంలోని పలు భాషల సాహిత్యాన్ని ఇంగ్లిష్లో అనువదించేందుకు ఏటా బ్రిటీష్ కౌన్సిల్ అందించే ‘చార్లెస్ వాల్లెస్ ఫెలోషిప్’కు మహమ్మద్ కథలు ఎంపికయ్యాయి. తెలుగు కథలకు ఈ ఫెలోషిప్ లభించడం ఇదే తొలిసారి. 15. మహజబీన్, నెల్లూరు (వైఎస్సార్ అచీవ్మెంట్) మహజబీన్ న్యాయవాద విద్యను అభ్యసించారు. తన కవితా సంకలనం ‘ఆకు రాలు కాలం’ 1997లో ప్రచురితమైంది. ఈమె తన కవిత్వంలో లింగ న్యాయం, శాంతి, పర్యావరణం, మహిళలు, పిల్లల హక్కులపై దృష్టి పెట్టడం విశేషం. 16. నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, చిత్తూరు (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) నామిని సుబ్రమణ్యం నాయుడు చిత్తూరు జిల్లాకు చెందిన ఒక సుప్రసిద్ధ రచయిత. 1980, 1990ల్లో ఈయన కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. సాధారణ రాయలసీమ వాడుక భాషలో పిల్లలు తేలికగా అర్థం చేసుకునేలా పుస్తకాలు రచించారు. ఆయన జీవితానుభవాలనే కథలుగా రచించి పాఠకుల మన్ననలు పొందారు. 17. అట్టాడ అప్పలనాయుడు, శ్రీకాకుళం (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) అట్టాడ అప్పలనాయుడు ఉత్తరాంధ్రకు చెందిన ప్రసిద్ధ కథ, నవలా రచయిత. శ్రీకాకుళ సాయుధ పోరాటం వైపు ఆకర్షితులై జననాట్య మండలిలో పని చేశారు. పార్వతీపురంలో ఇంటర్ చదివి జంఝావతి రిజర్వాయర్ నిర్మాణంలో కూలీగా పని చేశారు. తన మిత్రులతో కలిసి శ్రీకాకుళ సాహితి అనే సంస్థను స్థాపించారు. 18. పుల్లెల గోపీచంద్, బ్యాడ్మింటన్, గుంటూరు (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) గోపీచంద్ ప్రస్తుతం భారత జాతీయ బ్యాడ్మింటన్ జట్టుకు చీఫ్ నేషనల్ కోచ్గా ఉన్నారు. ఈయన 2001లో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్నారు. 19. కరణం మల్లీశ్వరి, వెయిట్ లిఫ్టింగ్, శ్రీకాకుళం (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) శ్రీకాకుళానికి చెందిన కరణం మల్లేశ్వరి 2000లో జరిగిన సిడ్నీ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించారు. 2022లో ఈమెకు బీబీసీ లై‹ఫ్టైం అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేశారు. 20. డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, మానసిక వైద్య నిపుణులు, (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరుకి చెందిన ఈయన 40 ఏళ్లుగా విజయవాడలో కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. 50 పడకల మానసిక వ్యాధుల ఆసుపత్రి ‘ఇండ్లాస్’ డైరెక్టర్గా గుర్తింపు పొందారు. 21. డాక్టర్ ఈసీ వినయ్ కుమార్, స్వచ్ఛంద సేవా సంస్థ, డాక్టర్, వైఎస్సార్ జిల్లా (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ, బీఏహెచ్ఏ సర్వే, గురకకు శస్త్రచికిత్స, మైక్రో ఇయర్ సర్జరీలలో ప్రసిద్ధుడైన ఈఎన్టీ స్పెషలిస్ట్. హైదరాబాద్ అపోలో హెల్త్ సిటీతో అనుబంధం ఉన్న వినయ్ కుమార్ ట్రస్ట్తో పాటు వినికిడి లోపం ఉన్న వారికి సహాయం చేసేందుకు ‘సహీ’ సొసైటీని ప్రారంభించారు. 22. గోవిందరాజు చక్రధర్, సీనియర్ జర్నలిస్ట్, కృష్ణా జిల్లా (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) జర్నలిస్టుగా, రచయితగా, ప్రచురణకర్తగా గోవిందరాజు చక్రధర్ది సుదీర్ఘ ప్రస్థానం. మీడియా వ్యాఖ్యాత, అనువాదకుడు, సోషల్ మీడియా ప్లాట్ఫాంలో కంటెంట్ సృష్టికర్త. 23. హెచ్ఆర్కే), ఆధునిక, సంస్కరణవాద కవిత్వం (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) ఆధునిక, సంస్కరణవాద కవిత్వంలో హనుమంతరెడ్డి దిట్ట. హెచ్ఆర్కే అనేది ఈయన పేరుకు సంక్షిప్త రూపం. కర్నూలు జిల్లాలోని ‘గని’లో 1951లో పేద రైతు కుటుంబంలో జన్మించారు. 24. బెజవాడ విల్సన్, ఎన్టీఆర్ జిల్లా (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) సామాజిక నాయకుడు. భారతీయ మానవ హక్కుల సంస్థ సఫాయి కర్మచారి ఆందోళన్ వ్యవస్థాపకులలో ఒకరు. 2016లో ఈయన రామన్ మెగసెసే అవార్డు అందుకున్నారు. 25. కుసుమ శ్యాంమోహన్ రావు, డా.బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా (వైఎస్సార్ అచీవ్మెంట్) దక్షిణాది రాష్ట్రాల్లో గిరిజన, దళిత గ్రామాల్లోని సమస్యలను, వారి విజయాలను తెలియజేసేలా యూట్యూబ్ ఛానెల్ స్థాపించారు. తన ఛానెల్ ద్వారా అవగాహన కార్యక్రమాలు, ప్రసంగాలు ప్రసారం చేస్తున్నారు. 26. నిర్మల హృదయ భవన్, ఎన్టీఆర్ జిల్లా (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) మదర్ థెరిసా సోదరీమణులు నిర్వహిస్తున్న మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నిర్మల హృదయ్ భవన్ను 1973లో మదర్ థెరిసా ప్రారంభించారు. కులం, మతంతో సంబంధం లేకుండా పేదలను ఆదుకునే లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థ. వీధుల్లో ఒంటరిగా ఉన్న, అనారోగ్యంతో ఉన్న, ఎవరూ పట్టించుకోని వారిని, పిల్లల ఆదరణకు నోచుకోని వారిని ఆదుకుని రక్షణ కల్పిస్తోంది. 27. డాక్టర్ జి.సమరం, ఎన్టీఆర్ జిల్లా (వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్) ప్రముఖ వైద్యుడు, సంఘ సేవకుడు, రచయిత. 1970లో విజయవాడలో వైద్యునిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1996–97లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. -
YSR అవార్డ్స్ 2023 విజువల్స్
-
YSR Achievement Awards 2023: విజయవాడ: వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)
-
సిక్కోల్ సింగం..కరణం మల్లేశ్వరి గారికి వైఎస్ఆర్ సాఫల్య పురస్కారం
-
రచయిత నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారికి వైఎస్ఆర్ సాఫల్య పురస్కారం
-
రావు బాల సరస్వతిగారికి వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం
-
శ్రీ గోవిందరాజు చక్రధర్ గారికి వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం
-
శ్రీ పుల్లెల గోపీచంద్ గారికి వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం
-
వైఎస్ఆర్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉంది
-
ఉప్పాడ హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీకి వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం
-
శ్రీ షేక్ మెహబూన్ సుభాని, శ్రీమతి కలీషా బీ గారికి వైఎస్ఆర్ సాఫల్య పురస్కారం
-
శ్రీ కోట సచిదానందా శాస్త్రి గారికి వైఎస్ఆర్ సాఫల్య పురస్కారం
-
కలంకారీ కళాకారుడు తలిశెట్టి మోహన్ గారికి వైఎస్ఆర్ సాఫల్య పురస్కారం
-
పద్మశ్రీ యడ్ల గోపాలరావు గారికి వైఎస్ఆర్ సాఫల్య పురస్కారం
-
రైతన్న DR YV మల్లారెడ్డి గారికి వైఎస్ఆర్ సాఫల్య పురస్కారం
-
శ్రీమతి పొంగి వినీత (వ్యవసాయం) వైఎస్ఆర్ సాఫల్య పురస్కారం
-
రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం జగన్
-
పొట్టి శ్రీరాములు, వైఎస్ఆర్ కు నివాళులు చేస్తున్న సీఎం జగన్
-
ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న గిరిజన మహిళకు పురస్కారం
-
సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ
-
వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవం ..అవార్డులు ఇవ్వడం చాలా గొప్ప విషయం
-
విజయవాడ: YSR అవార్డుల ప్రదానోత్సవం
Updates: ► వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ► గవర్నర్, సీఎం జగన్ చేతుల మీదుగా వివిధ రంగాలకు 27 మంది ఒక్కొక్కరిగా అవార్డులు స్వీకరించారు. ► దేశంలోనే మొదటిసారిగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు అభినందనీయం: గవర్నర్ అబ్దుల్ నజీర్ ► నవరత్నాల ద్వారా బడుగు బలహీన వర్గాలకు సాయం అందుతోంది. ► అయిదు డిప్యూటీ సీఎం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చారు ► ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదువులు ఇచ్చి న్యాయం చేశారు. ►ప్రస్తుత ప్రభుత్వం సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తోంది. ►నామినేటెడ్ పదవులు, పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు ► స్వచ్ఛ సర్వేక్షన్లో ఏపీ 7వ స్థానంలో నిలిచింది. ►వికేంద్రీకరణతో ప్రజలకు పరిపానను మరింత చేరువ చేసింది. ►అన్ని ప్రధాన రంగాల్లో రాష్ట్రం అభివృద్ధిలో మందుకు సాగుతోంది. ► రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం జగన్ ►మూడేళ్లుగా అవార్డులు అందించే సాంప్రదాయం కొనసాగుతోంది. ►ఈ ఏడాది 27 మందికి వైఎస్సార్ అవార్డులు అందజేస్తున్నాం ►వైఎస్సార్ హమాంలో వ్యవసాయం, విద్యా, వైద్య రంగాల్లో విశేష అభివృద్ధి జరిగింది. ►7 రంగాల్లో విశిష్ట సేవలందించిన 27 మంది వ్యక్తులు, సంస్థలకు పురస్కారాలు ►23 వైఎస్సార్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డులు ►4 వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డులు ప్రదానం ►అవార్డులు అందజేయనున్న గవర్నర్ అబ్దుల్నజీర్, సీఎం జగన్ సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది ‘వైఎస్సార్’ అవార్డులు అందజేయనుంది. నేడు(నవంబర్1) ఏపీ అవతరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో జరిగే అవార్డుల ప్రదానోత్సవానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు ఏ- కన్వెన్షన్ హాల్లో వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. వైఎస్సార్ అవార్డుల్లో 23 లైఫ్టైం ఎచీవ్మెంట్, 4 ఎచీవ్మెంట్ అవార్డులు అందజేయనున్నారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 27 మంది వ్యక్తులు, సంస్థలకు ఈ పురస్కారాలు లభించనున్నాయి. ఆయా రంగాల్లో ఎంపికైన వారికి ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవార్డుల ప్రదానోత్సవం చేయనున్నారు. 2023లో వైఎస్సార్ లైఫ్టైం ఎచీవ్మెంట్, ఎచీవ్మెంట్ అవార్డులకు ఎంపికయిన వారి జాబితా: వ్యవసాయం: 1)పంగి వినీత– (ఎచీవ్మెంట్ అవార్డు) 2వై.వి.మల్లారెడ్డి– అనంతపురం ఆర్ట్ అండ్ కల్చర్: 1) యడ్ల గోపాలరావు-రంగస్థల కళాకారుడు-శ్రీకాకుళం 2) తలిసెట్టి మోహన్– కలంకారీ– తిరుపతి 3) కోట సచ్చిదానంద శాస్త్రి– హరికథ– బాపట్ల 4) కోన సన్యాసి– తప్పెటగుళ్ళు– శ్రీకాకుళం జిల్లా 5) ఉప్పాడ హ్యాండ్ లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ– కాకినాడ 6) ఎస్.వి.రామారావు– చిత్రకారుడు– కృష్ణా 7)బాల సరస్వతి– నేపథ్య గాయని– నెల్లూరు 8)తల్లావఝుల శివాజీ– చిత్రకారుడు, రచయిత, పాత్రికేయుడు– ప్రకాశం 9)చింగిచెర్ల కృష్ణారెడ్డి– జానపద కళలు– అనంతపురం 10)కలీసాహెబీ మహబూబ్– షేక్ మహబూబ్ సుబానీ దంపతులకు– నాదస్వరం– ప్రకాశం తెలుగు భాష– సాహిత్యం: 1) ప్రొఫెసర్ బేతవోలు రామబ్రహ్మం– పశ్చిమ గోదావరి 2) ఖదీర్ బాబు– నెల్లూరు– (ఎచీవ్మెంట్ అవార్డు) 3) మహెజబీన్– నెల్లూరు (ఎచీవ్మెంట్ అవార్డు) 4) నామిని సుబ్రహ్మణ్యం నాయుడు– చిత్తూరు 5) అట్టాడ అప్పలనాయుడు– శ్రీకాకుళం క్రీడలు: 1) పుల్లెల గోపీచంద్– గుంటూరు 2) కరణం మల్లీశ్వరి– శ్రీకాకుళం వైద్యం: 1) ఇండ్ల రామ సుబ్బారెడ్డి–మానసిక వైద్యం– ఎన్టీఆర్ 2) ఈసీ వినయ్కుమార్రెడ్డి–ఈఎన్టీ– కాక్లియర్ ఇంప్లాంట్స్– వైయస్సార్ మీడియా: 1) గోవిందరాజు చక్రధర్– కృష్ణా 2) హెచ్చార్కే– కర్నూలు సమాజ సేవ: 1)బెజవాడ విల్సన్– ఎన్టీఆర్ 2) శ్యాం మోహన్– అంబేద్కర్ కోనసీమ– (ఎచీవ్మెంట్) 3) నిర్మల హృదయ్ భవన్– ఎన్టీఆర్ 4)జి. సమరం– ఎన్టీఆర్ 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఉవ్వెత్తున ఎగిసిన ఉప్పాడ కీర్తి పతాక
సాక్షి, అమరావతి: ఉప్పాడ జాంధానీ పట్టు నేత కళ మరోసారి కీర్తి పతాక ఎగరేసింది. ఉప్పాడ హ్యాండ్లూమ్స్ వీవర్స్ కో–ఆపరేటివ్ సొసైటీ(కాకినాడ)కు వైఎస్సార్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు వరించడంతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో బుధవారం నిర్వహిస్తున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా అవార్డును అందించనున్నారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని.. ఏళ్లు గడిచినా తరగని విలువ.. ఎటు చూసినా కళాత్మకత ఉట్టిపడే ఉప్పాడ జమ్దానీ(జాంధానీ) పట్టు చీరల ప్రత్యేకత గురించి తెలుసుకోవాల్సిందే. వందేళ్ల క్రితమే ఢాకాయ్ జమ్ధానీ నేత నైపుణ్యం ఈ ప్రాంతానికి వచ్చింది. ఢాకాయ్ జమ్ధానీ అనేది పర్షియన్ పదం. దీనికి పూలకుండీ అని అర్థం. రానురాను ఇక్కడి చేనేత కళాకారులు ప్రత్యేక ముద్రలు తయారు చేసుకుని జమ్ధానీ పట్టులో మరింత కళాత్మక నేత నేస్తున్నారు. సాధారణంగా చేనేతలో చీరకు ఒకవైపు మాత్రమే స్పష్టంగా కన్పిస్తుంది. అదే జమ్ధానీ పట్టు చీర నేత(ఎక్స్ట్రా వెస్ట్ టెక్నిక్)తో రెండు వైపులా ఒకే తరహాలో డిజైన్ కన్పించడం ప్రత్యేకం. అందుకే ఇక్కడి నేత చీరలకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ ప్రాంతానికి వెళితే.. పట్టు చీరల ప్రత్యేక అమ్మకాలకు సంబంధించిన షైన్ బోర్డులు, బ్యానర్లు స్వాగతం పలుకుతాయి. ఊళ్లోకి వెళితే.. రిటైల్ షాపులు, హోల్సేల్ ఔట్లెట్లు కొనుగోలుదారులతో కళకళలాడుతూ కనివిందు చేస్తాయి. ఇళ్లలో గమనిస్తే.. చేనేత మగ్గాల చప్పుడు.. అత్యంత నైపుణ్యంతో వెండి జరీతో చీరల నేత అబ్బుర పరుస్తాయి’. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఉప్పాడ చేనేతకు ఊతం రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో చేనేతకు మరింత ఊతం వచ్చిందని తెల్సిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర చేనేత జౌళి శాఖ కార్యదర్శి కె.సునీత, కమిషనర్ ఎంఎం నాయక్ తదితర అధికార యంత్రాంగం రాష్ట్రంలోని చేనేత రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఉప్పాడ జమ్ధానీ పట్టు చీరలకు ప్రచారం, మార్కెటింగ్ కల్పించడంలో ప్రత్యేక కృషి జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కేంద్ర ప్రభుత్వం ఒక జిల్లా–ఒక ఉత్పత్తి(ఒడిఒపి) పథకంలో ఎంపిక చేశారు. ఈ ఏడాది ఒడిఒపి పథకంలో జాతీయ అవార్డుకు సైతం దరఖాస్తు చేయడంతో కొద్ది రోజుల క్రితం కేంద్ర బృందం ఉప్పాడకు వచ్చి పరిశీలించి వెళ్లింది. ఉప్పాడ పట్టు చీరల నేతకు ప్రాముఖ్యత ఇస్తూ పోస్టల్ కవర్ కూడా రిలీజ్ చేయడం విశేషం. వస్తువుల భౌగోళిక సూచికల (రిజిస్ట్రేషన్ మరియు రక్షణ) చట్టం–1999 ద్వారా జియో ట్యాగింగ్(గుర్తింపు) ఇచ్చారు. ప్లిప్కార్ట్, అమెజాన్ తదితర ఆన్లైన్ మార్కెటింగ్ను ప్రోత్సహించడం, వాట్సాప్ ద్వారా కూడా పలు డిజైన్లను విక్రయించడం వంటి వాటి ద్వారా వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. ఉప్పాడ పట్టు చీరలకు యమా క్రేజ్.. ఉప్పాడ చీరలు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. తొలినాళ్లలో పిఠాపురం, వెంకటగిరి, బొబ్బిలి రాజవంశీయుల కోసం ప్రత్యేకమైన డిజైన్లతో చీరలు నేసేవారు. తర్వాతికాలంలో రాజకీయ నేతల నుంచి ధనవంతులు సైతం వీటిపై మొగ్గు చూపారు. తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత నుంచి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వరకు చాలా మంది మహిళా నేతలు ఈ చీరలు ధరించారు. రానురాను అనేక ప్రాంతాలకు చెందిన వారు తమ కుటుంబాల్లో వివాహాల కోసం ఉప్పాడకు వచ్చి చీరలు కొనుగోలు చేస్తుంటారు. పట్టు జరీని బట్టి రూ.4,500 నుంచి రూ.3 లక్షల విలువైన చీరలు నేయడం ఇక్కడి నేతన్న ప్రత్యేకం. ఇక్కడ 150 వరకు రిటైల్, హోల్సేల్ దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తుండటంతో చేనేతపై ప్రత్యక్షంగా ఆధారపడిన దాదాపు ఐదు వేల మంది, పరోక్షంగా మరింత మందికి ఉపాధి లభిస్తోంది. ఏటా రూ.50కోట్ల ఉత్పత్తులు ఉప్పాడ కేంద్రంగా ఏటా రూ.40 కోట్ల నుంచి 50 కోట్ల నేత ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నాయి. దాదాపు 70 శాతం ఉత్పత్తులు స్థానిక మార్కెట్లోనే విక్రయాలు జరుగుతున్నాయి. ఇక్కడ చేనేతపై ఆధారపడిన కళాకారులను అన్ని వి«ధాలుగా ప్రభుత్వం ఆదుకుంటోంది. ఏడాదికి ఒక్కొక్కరికి రూ.24 వేల చొప్పున ఉప్పాడలో 601 మందికి నేతన్న నేస్తం అందించింది. 420 మందికి రూ.2,750 చొప్పున పెన్షన్ ఇస్తోంది. గొల్లప్రోలు, ప్రత్తిపాడులో ప్రత్యేకంగా రూ.కోట్లతో క్ల్లస్టర్లు ఏర్పాటు చేసింది. గత నెల 20న రూ.96 లక్షలతో 320 మందికి యంత్ర పరికరాలు పంపిణీ జరిగింది. –కె.పెద్దిరాజు, కాకినాడ జిల్లా హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ ఆఫీసర్ అవార్డు దక్కడం ఉప్పాడకు గర్వకారణం ఉప్పాడ హ్యాండ్లూమ్ వీవర్స్ కో–ఆపరేటివ్ సొసైటీకి వైఎస్సార్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కడం గర్వకారణం. 1938లో ప్రారంభమైన ఈ సొసైటీ ప్రస్తుతం 515 మంది సభ్యులతో సేవలు అందిస్తోంది. ఉప్పాడ∙చీరల నేతలో తమదైన సేవలు అందిస్తున్న వడిగే వీరరాఘవులు అనే నేత కళాకారుడు రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. లొల్ల సత్యనారాయణ మార్కెటింగ్లో జాతీయ అవార్డు అందుకున్నారు. తాతోలు దేవి, దైవం త్రిమూర్తులు నేషనల్ మెరిట్ సర్టిఫికెట్ అందుకున్నారు. తాజాగా వైఎస్సార్ అవార్డు దక్కడంతో మరింత గుర్తింపు దక్కింది. –కె.చేతన్, పర్సన్ ఇన్చార్జి, ఉప్పాడ హ్యాండ్లూమ్స్ వీవర్స్ కో–ఆపరేటివ్ సొసైటీ -
రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు
సాక్షి, అమరావతి: రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు జరగనున్నాయి. ఉదయం 10:15 గంటలకు క్యాంప్ ఆఫీస్లో జరిగే అవతరణ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. పోలీసుల గౌరవ వందనం అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. తెలుగుతల్లి, అమరజీవి పొట్టి శ్రీరాములకు నివాళులర్పించనున్నారు. రేపు (బుధవారం) వైఎస్ఆర్ ఎచీవ్మెంట్ అవార్డుల ప్రదానం జరగనుంది. అవార్డల ప్రదాన కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్ పాల్గొననున్నారు. ఏ కన్వెన్షన్ సెంటర్లో వైఎస్ఆర్ ఎచీమ్మెంట్ లైఫ్టైం ఎచీవ్మెంట్ అవార్డులను గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రదానం చేయనున్నారు. ఇదీ చదవండి: చికిత్స తర్వాత చంద్రబాబు జైలుకెళ్లాల్సిందే: సజ్జల -
కొత్త వెలుగులు..ఉత్తరాంధ్ర ప్రాంత ప్రత్యేకం..తప్పెటగుళ్లు..
-
పద్మశ్రీ యడ్ల గోపాలరావుకు వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు