breaking news
Young director Karthik subbaraj
-
కార్తీక్ సుబ్బరాజ్పై నిర్మాతల గుర్రు
యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్పై తమిళ నిర్మాతలు గుర్రుగా ఉన్నారు. ఆయనపై రెడ్కార్డ్ వేయాలనే డిమాండ్ పెరుగుతోంది. పిజ్జా, జిగరతండా వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కార్తీక్సుబ్బరాజ్. ఈయ న ఆది నుంచి వివాదాలను ఎదుర్కొంటున్నారు. జిగర్తండా చిత్రం నిర్మాణ సమయంలో ఆ చిత్ర నిర్మాతతో భేదాభిప్రాయాలు సంచలనం కలిగించాయి. తాజాగా ఇరైవి చిత్రంతో మరో సారి విమర్శలను ఎదుర్కొంటున్నారు. విజయ్సేతుపతి, ఎస్జే.సూర్య, బాబీ సింహ, అంజలి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ఇరై వి. కార్తీక్సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా, సీవీ.కుమార్ నిర్మిం చారు. ఇటీవల తెరపైకి వచ్చిన ఇరైవి చిత్ర రిజల్ట్ ఎలా ఉందన్నది పక్కన పెడితే ఇందులోని కొన్ని సన్నివేశాలు తమిళ నిర్మాతలను అవమాన పరచేవిగా ఉన్నాయంటూ పలు నిర్మాతలు ధ్వజమెత్తుతున్నారు. నిర్మాత సురేశ్కామాక్షి, పిఎల్.తేనప్పన్ వంటి నిర్మాతలు కార్తీక్సుబ్బరాజ్కు వ్యతిరేకంగా తమిళ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. నిర్మాత ఈగో కారణంగా చిత్ర నిర్మాణం నిలిచిపోయిందనే సన్నివేశాలతో సినీ నిర్మాతలను అవమాన పరిచేవిధంగా ఇరైవి చిత్రంలో సన్నివేశాలు చోటు చేసుకున్నాయని,ఈ చిత్ర నిర్మాతలు జ్ఞానవేల్రాజా, సీవీ.కుమార్ కథ తెలియకుండా ఇరైవి చిత్రాన్ని నిర్మించి ఉండరని, అందువల్ల ఈ విషయంలో వారిని కూడా ప్రశ్నించాలని తమిళ నిర్మాతల మండలిపై ఒత్తిడి పెరుగుతోంది. సోమవారం తమిళ నిర్మాతల సంఘం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఇరైవి చిత్ర వివాదం గురించి చర్చించారు. సమావేశంలో పలువురు నిర్మాతలు కార్తీక్సుబ్బరాజ్పై రెడ్కార్డ్ వేయాలని డిమాండ్ చేశారు.అ యితే ఒక దర్శకుడిపై నిర్మాతల మండలి రెడ్ కార్డ్ వేయలేదని,ఈ అంశాన్ని దర్శకుల సంఘానికి వదిలిపెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీంతో కార్తీక్సుబ్బరాజ్ వివా దం దర్శకుల సంఘం కోర్డుకు చేరినట్లు తెలిసింది. ఆ సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. -
షార్ట్ ఫిలింలో సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ షార్ట్ ఫిలింలో నటించనున్నారు. యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కోలీవుడ్లో నూతన ఒరవడికి నాంది పలుకుతున్నారు. షార్ట్ ఫిలింస్ నిర్మాణం కోసం అంటూ సొంతంగా స్టోన్ బెంచ్ క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ కార్యక్రమం సోమవారం స్థానిక అన్నాశాలైలోని సత్యం సినీ కాంప్లెక్స్లో జరిగింది. సీనియర్ దర్శకుడు భారతీరాజా సంస్థ బ్యానర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాతగా అవతారమెత్తిన కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ సినీ రంగంలో రాణించాలని తపిస్తున్న ప్రతిభావంతులు చాలామంది ఉన్నారన్నారు. అలాంటి వారందరికీ ఈ స్టోన్ బెంచ్ క్రియేషన్స్ మంచి ప్లాట్ఫామ్ అవుతుందని భావిస్తున్నారన్నారు. తాను సిద్ధార్థ్తో తెరకెక్కించనున్న ఈ షార్ట్ ఫిలింను థియేటర్లలోను విడుదల చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఈ చిత్రాన్ని సబ్ టైటిల్స్తో ఏ భాషలోనైనా విడుదల చేయవచ్చని కార్తీక్ సుబ్బరాజ్ వివరించారు. తన ఈ సంస్థలో టాలెంట్ ఉన్న ఇతరులకు అవకాశం కల్పిస్తానని చెప్పారు. సిద్ధార్థ్ జగర్తండ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన ఈ యువ దర్శకుడు అదే హీరోతో షార్ట్ ఫిలిం రూపొందించడం విశేషం. ఈ కార్యక్రమంలో దర్శకుడు ఎస్.జె.సూర్య, నిర్మాత కె ఇ జ్ఞానావేల్ రాజా, బాలాజీ మోహన్ తదితర చిత్ర ప్రముఖులు పాల్గొన్నారు.