breaking news
water suplay
-
జీవీఎంసీ.. వాటర్ సప్లై ఉద్యోగుల సమ్మె తీవ్రతరం.. 18 గంటలుగా నో వాటర్
విశాఖ : వాటర్ సప్లై ఉద్యోగులు చేస్తున్న సమ్మె విశాఖలో తీవ్రరూపం దాల్చింది. నగరంలోని జీవీఎంసీ(గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పోరేషన్) పరిధిలో 18 గంటలుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో పెద్ద ఎత్తున ఇబ్బందులు తలెత్తాయి. ప్రధానంగా పరిశ్రమలు, ఆసుపత్రులకు నీటి సరఫరా లేకపోవడంతో పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తమ డిమాండ్ను తీర్చే వరకూ సమ్మె నుంచి వెనక్కి తగ్గేది లేదని ఉద్యోగులు హెచ్చరికలు చేస్తుండగా, మరొకవైపు మీ ఉద్యోగాలు పీకేస్తాం అంటూ మేయర్ బెదిరింపులతో సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. తమను ఉద్యోగాల నుంచి తీసేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఉద్యోగులు మరో అడుగు ముందుకేసి తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం కావడంతో ఇప్పటికీ నీటి సరఫరా సమస్యను ఎదుర్కొంటున్నారు విశాఖ వాసులు.తమ జీతాలు పెంచలేదంటూ ఉద్యోగులు సమ్మెకు దిగారు. జీవీఎంసీ పరిధిలో జిల్లా వ్యాప్తంగా సుమారు 1250 మంది వాటర్ సప్లై ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. నిన్నటి నుంచి నీటి సరాఫరాను జీవీఎంసీ నిలిపివేసింది. ఇప్పటికే కేజీహెచ్, ఎయిర్ పోర్ట్కు నీటి సరాఫరా నిలిచిపోయింది. 11వ తేదీ నుంచి సమ్మె చేస్తామని నీటి సరఫరా ఉద్యోగులు హెచ్చరించిన కానీ అధికారులు పట్టించుకోలేదు. దాంతో వారంతా సమ్మె బాట పట్టారు. -
ఇంటింటికీ తాగునీరందిస్తాం
మంత్రి ఈటల రాజేందర్ ఇబ్రహీంపట్నం : మిషన్ భగీరథ ద్వారా 2017 డిసెంబర్ వరకు ఇంటింటికీ నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీరందిస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మండల కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి కల్యాణ మండపంలో మిషన్ భగీరథపై కోరుట్ల నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరువులోనూ స్వచ్ఛమైన తాగునీరందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులు వేగవంతం చేస్తున్నారని పేర్కొన్నారు. డబ్బా వద్ద మిషన్ భగీరథ పనులు చేపట్టేందుకు రూ.1300 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. ఇది చేతల ప్రభుత్వమని, తాము చేసే పనులతో పదేళ్లపాటు కచ్చితంగా అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తంచేశారు. భవిష్యత్తరాల కోసం హరితహారం కార్యక్రమం చేపట్టామని, వనంతోనే వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై మెుక్కలు నాటి సంరక్షించాలని కోరారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలుపెంచి కరువును పారద్రోలాలని కోరారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు మాట్లాడుతూ నియోజకవర్గంలో హరితహారంలో 40 లక్షల మొక్కలు నాటుతామన్నారు. మిషన్ భగీరథతో కలిగే లాభాలు, పనులు తీరును మిషన్ భగీరథ ఎస్ఈ శ్రీనివాస్రావు వివరించారు. అనంతరం మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు ఇబ్రహీంపట్నం నుంచి మెట్పల్లికి Ðð ళ్లే రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. తహసీల్దార్ సురేశ్, ఎంపీడీవో శశికుమార్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.