-
ప్రాజెక్టుల వద్ద ఎవరూ గుమికూడరాదు: ఎస్పీ ఫక్కీరప్ప
సాక్షి, కర్నూలు : జిల్లాలోని శ్రీశైలం, పోతిరెడ్డిపాడు,హెడ్ రెగ్యులేటర్, రాజోలు బండ డైవర్షన్ స్కీమ్ ప్రాజెక్టుల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేశామని ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. ప్రాజెక్టుల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని, అక్కడ ఎవరూ గుమికూడరాదని చెప్పారు. అవసరమైతే ప్రాజెక్టుల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తామన్నారు. శాంతి భద్రతలో భాగంగా ప్రాజెక్టుల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు. కాగా, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పోలీసులు మోహరించారు. మహబూబ్నగర్ జూరాల ప్రాజెక్ట్ వంతెనపై తెలంగాణ పోలీసులు రాకపోకలు నిషేధించారు. తెలంగాణ పోలీసుల పర్యవేక్షణలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. అత్యవసరమైతేనే తప్ప అనుమతించటం లేదు. గద్వాల, ఆత్మకూరు, మక్తల్ మధ్య రాకపోకలు బందయ్యాయి. -
ఏఐబీపీ సాయం 60 శాతానికి పెంచాలి
కేంద్రానికి మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి * తెలంగాణ నుంచి మరో నాలుగు ప్రాజెక్టులను ఏఐబీపీలో చేర్చాలి * జల వనరుల సమన్వయ కమిటీ భేటీకి మంత్రి హాజరు సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర జలవనరుల శాఖ పరిధిలోని సత్వర సాగునీటి ప్రాయోజిత (ఏఐబీపీ) పథకం కింద రాష్ట్రాల నీటి పారుదల ప్రాజెక్టులకు ప్రస్తుతం ఇస్తున్న నిధుల వాటాను 25% నుంచి 60 శాతానికి పెంచాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అలాగే తెలంగాణలోని మరో నాలుగు ప్రాజెక్టులను ఈ పథకం కింద చేర్చాలని కోరారు. శనివారం కేంద్ర జలవ నరుల శాఖ కార్యాలయంలో తొలిసారిగా జల వనరుల సమన్వయ కమిటీ భేటీ అయింది. దేశవ్యాప్తంగా పీఎంకేఎస్వై పథకం అమలు తీరుతెన్నుల పరిశీలన, మెరుగైన విధానాలు తెచ్చేందుకు వీలుగా ఇటీవలే కేంద్రం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఛత్తీస్గఢ్ నీటి పారుదల మంత్రి బ్రిజ్మోహన్ చైర్మన్గా ఉన్న ఈ కమిటీలో మహారాష్ట్ర నీటి పారుదల మంత్రి గిరీష్ మహాజన్, మంత్రి హరీశ్రావు సభ్యులుగా ఉన్నారు. ప్రాజెక్టులు వేగంగా పూర్తిచేయడం, కేంద్రం నుంచి అందాల్సిన సాయం వంటి అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి కూడా ఇందులో పాల్గొన్నారు. కాగా ఈనెల 21వ తేదీన మరోసారి భేటీ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో 2016-17, 2017-18లో పూర్తిచేయగలిగే ప్రాజెక్టులను పీఎంకేఎస్వై కింద తీసుకుని వేగంగా నిర్మించాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు ఈ కమిటీ కేంద్రానికి పలు సిఫారసులు చేసింది. సమావేశం అనంతరం కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు శ్రీరాం వెదిరెతో కలసి హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. కరువు రాష్ట్రాలను ఆదుకోవాలి ‘ఏఐబీపీ కింద గతంలో 90% నిధులను కేంద్రం అందించేది. దాన్ని 60 శాతానికి తగ్గించారు. తెలంగాణలోగానీ, మహారాష్ట్రలోగానీ, అలాగే మరికొన్ని రాష్ట్రాల్లో ఏఐబీపీ సాయం 25 శాతమే ఉంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు, కరువులో ఉన్న రాష్ట్రాలకు సాయం పెంచాల్సిన అవసరాన్ని చెప్పాం. 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రాలు భరించేలా చూడాలని కోరాం. ఉదాహరణకు దేవాదుల, మరికొన్ని ప్రాజెక్టులకు 25 శాతం మాత్రమే ఉంది. అందువల్ల అన్నింటికీ 60 శాతానికి పెంచాలి. కేంద్ర సాయం లేకుండా ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తిచేయడం సాధ్యం కాదు. క్లియరెన్స్లు ఆలస్యం చేయకుండా సీడబ్ల్యూసీ ప్రాంతీయ కార్యాలయాలను పటిష్టం చేయాలి. రాష్ట్రాల్లో ఉన్న సీడబ్ల్యూసీ అధికారులు ఇఎన్సీలతో ప్రతి నెలా సమీక్ష నిర్వహించాలి. కేంద్రం నుంచి కూడా ప్రతినెలా రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సిఫారసు చేశాం’ అని మంత్రి హరీశ్రావు తెలిపారు. ‘ 2012లో ఏఐబీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులకు ఈరోజు కేవలం 20 శాతం ఎస్కలేషన్కు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే ఆయా ప్రాజెక్టులకు 50 శాతం వరకు ఎస్కలేషన్ అవసరం ఉంది. అందువల్ల నాబార్డు నుంచి రుణం ఇప్పించాలని సూచించాం. ప్రాజెక్టులు మరింత వేగంగా పూర్తిచేసేలా అన్ని రకాలుగా ఆర్థిక వనరులు సమకూర్చాలి. దేవాదులకు ఈ ఏడాది రూ. 112 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. దేవాదులతో పాటు శ్రీరాంసాగర్ వరద కాలువ పథకాన్ని, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకాన్ని, పెద్దవాగు(జగన్నాథ్పూర్), కొమురం భీం ప్రాజెక్టులను కూడా ఏఐబీపీలో చేర్చాలని కోరాం. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లను ఏడాది చివరలో కాకుండా మొదటి నెలలోనే 50 శాతం విడుదల చేయాలని కూడా సిఫారసు చేశాం’ అని హరీశ్రావు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement