breaking news
vishwananth reddy
-
సర్పంచు, వార్డు స్థానాలకు 18న ఎన్నికలు
అనంతపురం టౌన్, న్యూస్లైన్ : జిల్లాలో అనివార్య కారణాల వలన ఎన్నికలు జరగని రాయదుర్గం మండలం బాగేనాయకనహళ్లి సర్పంచ్ స్థానంతో పాటు 25 మండలాల్లోని పలు వార్డు స్థానాలకు ఈ నెల 18న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ గురువారం విడుదల చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) టి.రమణ, పరిపాలనాధికారి విశ్వనాథరెడ్డి తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ ఇలా :- 3వ తేదీ నుంచి 6 వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీక రిస్తారు. ఎన్నికలు జరిగే స్థానాల్లో వార్డుల వారీగా ఓటర్ల వివరాలను శుక్రవారం నోటిస్బోర్డులో అతికించాలి. 7వ తేదీన నామినేషన్ల పరిశీలన. 9వ తేదీన ఆర్డీఓలు అప్పీల్లు స్వీకరిస్తారు. 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరణ చేసుకోవచ్చు. మూడు గంటల అనంతరం పోటీచేసే అభ్యర్థుల వివరాలను అధికారులు వెల్లడిస్తారు. మరుసటి రోజు నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుంది. 18వ తేదీ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రా రంభమవుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. 2 గంట ల అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుం ది. సాయంత్రానికి విజేతల పేర్లు వెల్లడిస్తారు. ఎన్నికలు జరిగే వార్డు స్థానాలు : రాయదుర్గం మండలంలో గ్రామదట్ల 9వ వార్డు, నాగిరెడ్డిపల్లిలో 2, 4, 6 వార్డులు, వడ్రహొన్నూరులో 8వ వార్డు, అనంతపురం మండలంలో కురుగుంట 3, 7, 8 వార్డులు, బుక్కరాయసముద్రం మండలంలో బి.కొత్తపల్లి 5వవార్డు, దండువారిపల్లి 3, 8 వార్డులు, దయ్యాలకుంటపల్లిలో 9వ వార్డు, పెద్దపప్పూరు మండలంలో గార్లదిన్నె 3, 4, 8 వార్డులు, వరదాయపల్లిలో 5వ వార్డు, పెద్దవడుగూరు మండలం ముమ్మప్పగుత్తిలో 3, 4, 8 వార్డులు, పామిడి మండలంలో గజరాంపల్లి 7వార్డు, శింగనమల మండలంలో కొరివిపల్లి 3వవార్డు, తాడపత్రి మండలంలో కొండేపల్లి 3వవార్డు, ఉరవకొండ మండలంలో బూదగెవి 1, 10 వార్డులు, మోపిడిలో 3వ వార్డు, వజ్రకరూరు మండలంలో చిన్న హోతూరు 4, 7 వార్డులు, కొనకొండ్లలో 12వ వార్డు, పీసీ ప్యాపిలిలో 3, 5, 8, 11 వార్డులు, పందికుంటలో 2, 3, 4, 5, 8 వార్డులు, తట్రకల్లో 1 నుంచి 10 వార్డులు, విడపనకల్లు మండలంలో ఆర్.కొట్టాల 2, 6 వార్డులు, కొట్టాలపల్లిలో 2, 7, 8 వార్డులు, యల్లనూరు మండలంలో చింతకాయమంద 4వ వార్డు, ముదిగుబ్బ మండలంలో పొడరాళ్లపల్లి 3వ వార్డు, ఎన్పీకుంటలో బలిజపల్లి 1, 3 వార్డులు, ఎదురుదొన 3, 5, 10, 12 వార్డులు, పెడబల్లిలో 8, 9 వార్డులు, వెస్ట్ నడింపల్లిలో 4, 7 వార్డులు, నల్లమాడ మండలంలో చెరుపల్లిలో 8వవార్డు, ఓడిచెరువు మండలంలో ఇనగలూరులో 1వ వార్డు, తనకల్లు మండలంలో మలిరెడ్డిపల్లి 3, 4, 5 వార్డులు, బెలుగుప్ప మండలంలో హనిమిరెడ్డిపల్లి 9వ వార్డు, బొమ్మనహాల్ మండలంలో కల్లుహొల 9వ వార్డు, బ్రహ్మసముద్రం మండలంలో వెస్ట్కోడిపల్లిలో 9వ వార్డు, ధర్మవరం మండలంలో రావులచెరువు 10వ వార్డు, గుమ్మఘట్ట మండలంలో సిరిగేదొడ్డి 10వ వార్డు, గుమ్మఘట్ట 2, 4, 6, 10 వార్డులు, కళ్యాణదుర్గం మండలంలో తిమ్మసముద్రం 3, 4, 10, 12 వార్డులు, కనగానపల్లి మండలంలో ముక్తాపురం 5, 8 వార్డులు, విడపనకల్ మండలంలో కొట్టాలపల్లి 9వ వార్డు, చిలమత్తూరు మండలంకేంద్రంలో 7వ వార్డుకు ఎన్నికలు జరగనున్నాయి. -
రాయల తెలంగాణ.. ఓ మూర్ఖపు ఆలోచన
అనంతపురం రూరల్, న్యూస్లైన్ : జిల్లాలోని కొందరు రాజకీయ నేతలు ‘రాయల తెలంగాణ’ ప్రతిపాదన తీసుకురావడం ఓ మూర్ఖపు ఆలోచన అని సమైక్యాంధ్ర సంయుక్త జేఏసీ జిల్లా కన్వీనర్ కొత్త విశ్వనాథరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన నగర ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. జిల్లా ప్రజలందరూ సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటుంటే ‘రాయల తెలంగాణ’ను ఎందుకు కోరుతున్నారో జేసీ దివాకర్రెడ్డితోపాటు డీసీసీ అధ్యక్షుడు కొట్రికె మధుసూదన్గుప్తా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ, స్పిన్నింగ్ మిల్, ఆల్విన్ వాచ్ కంపెనీ తదితర ఎన్నో ఫ్యాక్టరీలు మూత పడినప్పుడు మీరేం చేస్తున్నారో చెప్పాలన్నారు. శాసనసభకు తెలంగాణ బిల్లుకు వచ్చినప్పుడు ఎటువైపు మొగ్గుచూపుతారో ప్రజలకు తెలియజేయాలన్నారు. న్యాయవాదుల జేఏసీ నాయకులు రాంప్రసాద్ మాట్లాడుతూ జిల్లాకు 32 టీఎంసీలు నికర జలాలు రావాల్సి ఉండగా కనీసం 14 టీఎంసీలను కూడా అందుబాటులోకి తీసుకురాకపోవడంలో పాలకులు పూర్తిగా విఫలమౌతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోతే మరింత నష్టపోతామన్నారు. విద్యుత్ జేఏసీ జిల్లా నాయకులు రామకృష్ణ మాట్లాడుతూ భౌగోళిక పరిస్థితులను పరిశీలిస్తే శ్రీశైలంతో పాటు పీఏబీఆర్, సుంకేసుల ప్రాజెక్ట్లలో విద్యుత్ను ఉత్పత్తి చేస్తే అంది తెలంగాణకు అనుకూలంగా ఉంటుందన్నారు. రాయల తెలంగాణ అంశం కేవలం తెలంగాణవారికే ఎక్కువ లాభం చేకూరుతుందన్నారు. రాయల తెలంగాణ అంశాన్ని రాజకీయ నాయకులు వారి పదవుల కోసం, ఆస్తుల కోసమే అడుగుతున్నారని, ఇందులో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. కార్యక్రమంలో రెవెన్యూ జేఏసీ నాయకులు జయరామప్ప, వాణిజ్యపన్నులశాఖ జేఏసీ నాయకులు సుభాష్, యూత్ జేఏసీ నాయకులు మల్లిరెడ్డి పాల్గొన్నారు.