-
ఇళయదళపతితో డ్యూయెట్లకు సై
ఇళయదళపతి విజయ్తో యువళగీతాలు పాడే అవకాశం నటి రకుల్ప్రీతిసింగ్ను వరించనుందా? దీనికి కోలీవుడ్లో అలాంటి అవకాశం ఉందనే సమాధానం వస్తోంది. విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తన 61వ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి దళపతి, మూండ్రుముగం పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాజల్అగర్వాల్, సమంత, నిత్యామీనన్ ముగ్గురు బ్యూటీస్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. దీంతో విజయ్ తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరగుతోంది. ఇంతకు ముందు తుపాకి, కత్తి చిత్రాలను తెరకెక్కించిన ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి నటించడానికి విజయ్ రెడీ అవుతున్నారు. ఈ చిత్రం ఆగస్ట్లో ప్రారంభం కానున్నట్లు తాజా సమాచారం. ఏఆర్.మురుగదాస్ ప్రస్తుతం మహేశ్బాబు హీరోగా నటిస్తున్న చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. దీనికి సంభవామి అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రం తరువాత విజయ్ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో కథానాయకిగా నటించే అవకాశం నటి రకుల్ప్రీత్సింగ్ను వరించబోతున్నట్లు తాజా సమాచారం. అయితే కోలీవుడ్లో ఈ అమ్మడికి సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగుతోందని చెప్పవచ్చు. తడయారు తాక్కు చిత్రంతో కోలీవుడ్కు దిగుమతి అయిన పంజాబీ భామ రకుల్ప్రీత్సింగ్. ఆ చిత్రంతో పాటు ఆ తరువాత నటించిన ఎన్నమో ఏమో, పుత్తగం చిత్రాలు నిరాశ పరచడంతో అమ్మడిని కోలీవుడ్ ఐరన్ లెగ్ నటిగా ముద్రవేసి పక్కన పెట్టేసింది. అయితే టాలీవుడ్ మాత్రం అందలం ఎక్కించింది. అక్కడ ఇప్పుడీ ముద్దుగుమ్మ టాప్ హీరోయిన్లలో ఒకరు. దీంతో కోలీవుడ్ మళ్లీ ఎర్ర తివాచీ పరుస్తోంది. ఇప్పటికే కార్తీకి జంటగా ధీరన్ అధ్యాయం ఒండ్రు చిత్రంలో నటిస్తున్న రకుల్ప్రీత్సింగ్ విజయ్తో డ్యూయెట్లు పాడే అదృష్టం లభించనున్నట్లు టాక్. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న తెలుగు చిత్రంలో కథానాయకి రకుల్ప్రీత్సింగ్ అన్నది గమనార్హం. అలా విజయ్కు జంటగా నటించే అవకాశాన్ని ఈ దర్శకుడే కల్పించనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
ఆయనతో నటించడం తీయని అనుభవం
ఊహించలేనివి జరిగితే ఎవరైనా ఎగ్జైట్ అవుతారు. నటి నందిత పరిస్థితి ఇంచుమించు అలానే ఉంది. అట్టకత్తి చిత్రంతో హీరోయిన్గా తెరపైకి వచ్చిన ఈ ఆరణాల తమిళమ్మాయి తొలి చిత్రంతోనే విజయంతో పాటు ప్రశంసలు అందుకుంది. అయినా ఇప్పటి వరకు యువ హీరోలతోనే జత కడు తూ వచ్చింది. అలాంటి నందితకు అనూహ్యంగా పులి చిత్ర యూనిట్ నుంచి పిలుపొచ్చింది. అది ఇళయదళపతి విజయ్తో నటించే అవకాశం. కలా! నిజమా! కొంచెం సందిగ్ధం. కొన్ని క్షణాల తరువాత నిజం అన్న విషయాన్ని గ్రహించి పట్టరాని ఆనందంతో మునిగిపోయానంటున్న నందిత చేతిలో ప్రస్తుతం పలు చిత్రాలు ఆ విషయం కంటే ముందు విజయ్తో కలిసి పులి చిత్రంలో నటించిన అనుభవాల్నే చెప్పుకుంటోంది బ్యూటీ. ఎదుర్నీచ్చల్ చిత్రంలో నా నటన చూసి విజయ్ మెచ్చుకున్నారు. అలాంటి ఆయనతో కలసి నటిస్తానని కలలోకూడా ఊహించలేదు. పులి చిత్రంలో విజయ్తో నటించడానికి కాస్త తడబడ్డాను.ఆయన ఎంతో సౌమ్యంగా, సన్నిహితంగా మెలిగి నా భయాన్ని పోగొట్టారు. విజయ్తో కలసి నటించడం తీయని అనుభవం. పులి చిత్రంలో చిన్న పాత్ర అయినా నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం అంటున్న నందిత నటిస్తున్న నాలుగు చిత్రాల్లో రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరో రెండు హారర్ చిత్రాలను అంగీకరించారు. -
విజయ్, విజయకాంత్లకు బీజేపీ గాలం
‘ఇన్నాళ్లు సూపర్ స్టార్ రజనీకాంత్ నినాదాన్ని పఠించిన కమలనాథులు ఇక, ఇళయదళపతి విజయ్, డీఎండీకే అధినేత విజయకాంత్ పేర్లను జపించేందుకు సిద్ధమయ్యారు.’ విజయ్కు గాలం వేయడంతో పాటుగా విజయకాంత్కు అండగా నిలబడేందుకు బీజేపీ అధిష్టాన ం కసరత్తుల్లో మునిగింది. సాక్షి, చెన్నై: డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలన్న లక్ష్యంతో బీజేపీ ప్రయత్నాల్లో మునిగింది. పీఎం మోదీచరిష్మాను, రాష్ట్రంలోని ఇన్నాళ్లు సాగిన ద్రవిడ పార్టీల అవినీతిని అస్త్రంగా చేసుకుని ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న బలమైన శక్తుల మద్దతును కూడగట్టుకునే పనిలో ఆ పార్టీ నేతలు నిమగ్నమయ్యూరు. సూపర్ స్టార్ రజనీ కాంత్ను రాజకీయాల్లోకి దించడం లక్ష్యంగా తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు. ఇన్నాళ్లు రజనీ నినాద మంత్రాన్ని పఠించిన కమలనాథులు, ఇక విజయకాంత్, విజయ్ పల్లవి అందుకునేందుకు సిద్ధం అయ్యారు. ఇళయ దళపతిగా పేరున్న విజయ్కు రాష్ట్రంలో అశేష అభిమాన లోకం ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు విజయ్ తన మద్దతును ప్రకటించారు. ఆ తర్వాత నెలకొన్న పరిణామాలతో అన్నాడీఎంకే సర్కారు రూపంలో విజయ్కు చిక్కులు తప్పలేదు. దీంతో లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూరు వేదికగా నరేంద్ర మోదీతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. విజయ్ను మోదీ ప్రశంసలతో ముంచెత్తడం ఆయన అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. విజయ్ ఎలాంటి సంకేతం ఇవ్వకున్నా, ఆ ఎన్నికల్లో బీజేపీ కూటమికి మద్దతుగా ఆయన అభిమానులు వ్యవహరించారు. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో విజయ్ మద్దతను పూర్తి స్థాయిలో దక్కించుకోవడం లక్ష్యంగా కమలనాథులు ప్రయత్నాల్లో పడ్డారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాలతో విజయ్కు గాలం వేసే పనిలో కొందరు నాయకులు పడ్డారు. సేవా కార్యక్రమాలకు వేదికగా విజయ్ నేతృత్వంలో ఉన్న మక్కల్ ఇయక్కం మద్దతును కూడగట్టుకోవడం లక్ష్యంగా ఉరకలు తీస్తున్నారు. తమకు మద్దతుగా నిలిచిన పక్షంలో విజయ్కు లేదా, ఆయన సూచించే వ్యక్తికి రాజ్య సభ సీటును ఎరగా వేయడానికి కమలనాథులు రెడీ అవుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. డీఎండీకేకు అండ: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న డీఎండీకే అధినేత విజయకాంత్ మనసు మారకుండా, తమతో కలసి ఉండే విధంగా కొత్త వ్యూహాన్ని రచించారు. విజయకాంత్కు రాష్ట్రంలో ఉన్న ఓటు బ్యాంకును పరిగణనలోకి తీసుకున్న బీజేపీ అధిష్టానం, ఆ పార్టీకి, ఆ పార్టీ నేతృత్వంలోని కెప్టెన్ టీవీకి అండగా నిలిచేందుకు సిద్ధమవుతోంది. పదేళ్లుగా పార్టీని ఒంటరిగా విజయకాంత్ ముందుకు తీసుకె ళుతున్నారు. అన్నీ తానై ముందుకు సాగుతున్న విజయకాంత్కు కెప్టెన్ టీవీ, న్యూస్ చానెళ్లు ఉన్నాయి. ఈ చానెళ్లు ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. పార్టీని ముందుకు తీసుకెళ్లడం విజయకాంత్కు భారంగా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న బీజేపీ అధిష్టానం, ఆయనకు అండగా నిలబడేందుకు సిద్ధమైనట్టు సమాచారం. తమతో మిత్రత్వం కొనసాగిస్తే, ఈ సారి విజయకాంత్ సతీమణి ప్రేమలత, బావ మరిది సుదీష్లలో ఒకరికి రాజ్యసభ సీటు ఇవ్వడంతో పాటుగా, టీవీ చానెళ్ల అభివృద్ధికి ఆర్థిక సహకారాన్ని ఇచ్చి, పూర్తి స్థాయిలో కూటమి పార్టీ, మద్దతు నేతల కార్యక్రమాల ప్రచారం లక్ష్యంగా ఉపయోగించుకునేందుకు కమలనాథులు వ్యూహ రచన చేశారు. విజయకాంత్ సీఎం సీటు లక్ష్యంగా రాజకీయ పయనం సాగిస్తున్న దృష్ట్యా, ఎన్నికల నాటి పరిస్థితుల మేరకు ‘సీఎం’ సీటు నిర్ణయం తెరపైకి తెచ్చే విధంగా కమలనాథులు కసరత్తుల్లో దిగారు. రంగంలోకి అమిత్ షా: మహారాష్ట్ర ఎన్నికలు ముగియడంతో ఇక తమిళనాడులో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు అమిత్ షా సిద్ధమవుతున్నారు. త్వరలో తన వ్యూహాల అమలు లక్ష్యంగా ఆయన రంగంలోకి దిగనున్నట్టు కమలాలయంలో ప్రచారం ఊపందుకుంటోంది. అమిత్ షా రంగంలోకి దిగబోతున్నందునే ఈనెల 26న పార్టీ సర్వ సభ్య సమావేశానికి రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ పిలుపు నిచ్చారని చెబుతున్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గం ప్రకటనతో అమిత్ షా వ్యూహాల అమలు లక్ష్యంగా నేతలు పరుగులు తీయనున్నారు. దీంతో కొద్ది రోజుల నుంచి కమలనాథుల నోట ‘వీ’ నినాద జపం మార్మోగనుంది. ఇక, రజనీకి సీఎం సీటు ఆఫర్, విజయ్ గాలం, విజయకాంత్కు ఆర్థిక అండ ఇచ్చే రీతిలో అమిత్ రచించిన వ్యూహాలు ఏ మేరకు ఫలితాల్ని ఇస్తాయోనన్నది వేచి చూడక తప్పదు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 World Cup 2024: చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ
మరికొన్ని గంటల్లో యాపిల్ ‘లెట్ లూస్ ఈవెంట్’
ముస్లిం సమాజం మారాలి: ప్రధాని మోదీ విజ్ఞప్తి
వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి
కేజ్రీవాల్కు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రేమ లేఖ!
ధోని గురించి నిజాలు ఇవే! మాజీ క్రికెటర్లకు కౌంటర్
వ్యవస్థలను మేనేజ్ చేసేది చంద్రబాబే: ఎమ్మెల్సీ లేళ్ల
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement