breaking news
US Open Mixed Doubles
-
టెన్నిస్లో అద్భుతం.. సబలెంకాతో జత కట్టనున్న జకోవిచ్
టెన్నిస్ ఆటలో ఒక అద్భుతం చోటుచేసుకుంది. సెర్బియా దిగ్గజం, 24 సార్లు గ్రాండ్స్లామ్ చాంపియన్, మాజీ నంబర్వన్ నొవాక్ జకోవిచ్.. మహిళల ప్రపంచ నంబర్వన్ అరీనా సబలెంకాతో కలిసి యూఎస్ ఓపెన్ మిక్సడ్ డబుల్స్లో జత కట్టనున్నాడు. వీరితో పాటు టోర్నీలో బరిలోకి దిగనున్న 16 జట్ల జాబితాను ప్రకటించారు. గతేడాది యూఎస్ ఓపెన్కు ముందే టోర్నీని సమూలంగా మార్చారు. పురుషుల, మహిళల విభాగంలో అగ్రశ్రేణి సింగిల్స్ ఆటగాళ్లు మిక్స్డ్ డబుల్స్లో జతకట్టి ఆడితే ఒక మిలియన్ డాలర్ల ప్రైజ్మనీ అదనంగా ఇస్తామని యూఎస్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్ (యూఎస్టీఏ) గతేడాదే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈసారి జకోవిచ్, సబలెంకా కలిసి యూఎస్ ఓపెన్ మిక్సడ్ డబుల్స్లో బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ ఇద్దరితో పాటు 2025లో రన్నరప్గా నిలిచిన ఇగా స్వియాటెక్, కాస్పర్ రూడ్ జంటతో పాటు ఎలెనా రైబాకినా-టేలర్ ఫ్రిట్జ్ , నవోమి ఒసాకా-కీ నిషికోరి, జెస్సికా పెగులా-జాక్ డ్రేపర్ మరోసారి బరిలోకి దిగుతున్నారు . ప్రధాన డ్రా ఆగస్టు 25-26 తేదీల్లో రెండు రోజుల పాటు జరుగుతుంది. ఆర్థర్ ఆషే స్టేడియం, లూయిస్ ఆర్మ్స్ట్రాంగ్ స్టేడియంలో అన్ని మ్యాచ్లు నిర్వహిస్తారు. ఆగస్టు 17 వరకు జట్లు నమోదు చేసుకోవచ్చు. ఆరోజు వరకు అత్యుత్తమ సంయుక్త సింగిల్స్ ర్యాంకింగ్లు కలిగిన ఆరు జంటలు ఆటోమేటిక్గా మెయిన్ డ్రాలోకి ప్రవేశిస్తాయి. ఈ లెక్కన టాప్-10లో ఉన్న జకోవిచ్, సబలెంకా జోడి నేరుగా మెయిన్ డ్రాలో ప్రవేశించనుంది. దీంతో పాటు ఎనిమిది జట్లకు యూఎస్టీఏ వైల్డ్ కార్డ్లను ఇస్తుంది. మరో రెండు జట్లు ఆగస్టు 24న జరిగే క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ ద్వారా ఫైనల్స్కు చేరుకుంటాయి. అయితే గతేడాది మిక్సడ్ డబుల్స్ చాంపియన్లుగా నిలిచిన సారా ఎర్రాని, ఆండ్రీ వవస్సోరిలు సింగిల్స్ ర్యాంకింగ్స్లో టాప్-20లో లేకపోవడంతో ఈ జంట మరోసారి వైల్డ్కార్డ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఎనిమిది జట్లతో కూడిన క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ను కూడా చేర్చారు, ఇందులో ఆరు జట్లకు నేరుగా ప్రవేశం, రెండు జట్లకు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయి. సెమీఫైనల్స్ వరకు, మ్యాచ్ల ఫార్మాట్ బెస్ట్-ఆఫ్-త్రీ-సెట్స్ పద్ధతిలో ఉంటుంది. ఇందులో సెట్లు నాలుగు గేమ్లకు, 4-ఆల్ వద్ద టైబ్రేకర్లు, మూడవ సెట్కు బదులుగా 10-పాయింట్ల మ్యాచ్ టైబ్రేక్ ఉంటాయి. ఫైనల్ స్టాండర్డ్ స్కోరింగ్ పద్ధతిలో ఉంటుంది, ఇందులో సెట్లు ఆరు గేమ్లకు, 6-ఆల్ వద్ద టైబ్రేకర్, అవసరమైతే 10-పాయింట్ల మ్యాచ్ టైబ్రేకర్ ఉంటాయి. Novak Djokovic and Aryna Sabalenka are set to play together in the upcoming US Open mixed doubles 🎾🤝 pic.twitter.com/NVnakqmwGT— BBC Sport (@BBCSport) July 27, 2026Read: సుందర్ స్థానంలో జట్టులోకి.. ఎవరీ సారాన్ష్ జైన్? -
యుకీ బాంబ్రీ దూకుడు.. తొలిసారి గ్రాండ్స్లామ్ సెమీస్కు
భారత టెన్నిస్ డబుల్స్ నంబర్వన్ యూకీ బాంబ్రీ తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీ డబుల్స్ విభాగంలో సెమీఫైనల్కు ఫైనల్ చేరుకున్నాడు. న్యూయార్క్లో జరుగుతున్న యూఎస్ ఓపెన్ టర్నీలో మైకేల్ వీనస్ (న్యూజిలాండ్)తో జతకట్టి పురుషుల డబుల్స్ విభాగంలో ఆడుతున్న యూకీ సెమీస్లోకి ప్రవేశించాడు.బుధవారం ఆర్ధరాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో 14వ సీడ్ యూకీ–వీనస్ ద్వయం 6-3, 7-6, 6-3 తేడాతో 11వ సీడ్ నికోలా మెక్టిక్ - రాజీవ్ రామ్పై విజయం సాధించింది. శుక్రవారం జరగబోయే సెమీస్లో బ్రిట్స్ నీల్ స్కుప్స్కీ - జో శాలిస్బరీ జోడీతో యుకీ - మైకెల్ తలపడనున్నారు.ప్రీకార్టర్స్లో దూకుడు..అంతకుముందు ప్రీక్వార్ట్స్లో కూడా ఈ ఇండో-కివీ ద్వయం అదరగొట్టింది. ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో యూకీ–వీనస్ జోడీ 6–4, 6–4తో నాలుగో సీడ్ కెవిన్ క్రావిట్జ్–టిమ్ పుయెట్జ్ (జర్మనీ) జంటను ఓడించింది. 83 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఇండో–కివీస్ జోడీ నాలుగు ఏస్లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్లు చేసింది. తమ సర్వీస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థుల సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు జూనియర్ విభాగంలో భారత ప్లేయర్ల పోరాటం ముగిసింది. బాలికల సింగిల్స్ రెండో రౌండ్లో మాయ రాజేశ్వరన్ 7–6 (7/1), 4–6, 3–6తో రెండో సీడ్ హనా క్లుగ్మన్ (బ్రిటన్) చేతిలో ఓడిపోయింది. డబుల్స్ తొలి రౌండ్లో మాయ (భారత్)–సినెల్లి (అర్జెంటీనా) జోడీ 2–6, 2–6తో జెలీనా (బెల్జియం)–లైమా (లిథువేనియా) జంట చేతిలో ఓటమి పాలైంది. -
సానియా జంట శుభారంభం
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)-ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) ద్వయం శుభారంభం చేసింది. తొలి రౌండ్లో సానియా-డోడిగ్ జంట 6-4, 6-4తో టేలర్ టౌన్సెండ్-డొనాల్డ్ యంగ్ (అమెరికా) జోడీపై గెలిచింది. మరో తొలి రౌండ్ మ్యాచ్లో రోహన్ బోపన్న (భారత్)-గాబ్రియెలా దబ్రౌస్కీ (కెనడా) జంట 7-5, 6-4తో జేమీ లోబ్-నోవా రూబిన్ (అమెరికా) ద్వయంపై విజయం సాధించింది. మరోవైపు పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో బోపన్న-ఫ్రెడెరిక్ నీల్సన్ (డెన్మార్క్) ద్వయం 2-6, 6-7 (5/7)తో బాకెర్ (అమెరికా)-డానియల్ (న్యూజిలాండ్) జంట చేతిలో ఓటమి పాలైంది. మెరుున్ ‘డ్రా’కు ప్రాంజల బాలికల సింగిల్స్ విభాగంలో తెలుగు అమ్మారుు యడ్లపల్లి ప్రాంజల మెరుున్ ‘డ్రా’కు అర్హత సాధిం చింది. శనివారం జరి గిన క్వాలిఫరుుంగ్ రెండో రౌండ్లో హైదరాబాద్ ప్లేయర్ ప్రాంజల 6-4, 6-4తో కరియన్ పియర్ లూరుుస్ (అమెరికా)పై గెలిచింది. గంటా 41 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ప్రాంజల రెండు ఏస్లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. తన సర్వీస్ను నాలుగుసార్లు కోల్పోయింది. -
త్వరలో సానియాకు సన్మానం
సాక్షి, హైదరాబాద్: యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్లో టైటిల్ సాధించిన తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జాను త్వరలో తెలంగాణ ప్రభుత్వం సన్మానించనుంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును మంగళవారం సానియా మీర్జా కలిసింది. భవిష్యత్లో సానియాకు ప్రభుత్వం తరఫున కావలసిన సహాయం అందిస్తామని కేసీఆర్ చెప్పారు. విజయాన్ని తెలంగాణ ప్రజలకు అంకితమివ్వడాన్ని కేసీఆర్ ప్రశంసించారు.


