breaking news
University analysis
-
వాటర్ బాటిల్ వెనుక అంత కథా..!!
ఒకప్పుడు ఎక్కడికైనా ప్రయాణమవుతున్నామంటే వెంట నీళ్లు తప్పనిసరిగా తీసుకెళ్లడం మర్చిపోయేవారు కాదు. మరి ఇప్పుడు.. ఎక్కడపడితే అక్కడ వాటర్ బాటిళ్లు దొరుకుతున్నాయి. కొనేస్తున్నారు.. తాగేస్తున్నారు! తాగునీరు చాలాచోట్ల అందుబాటులో ఉన్నా కూడా వాటర్ బాటిళ్లనే కొంటున్నారు. ఎందుకు? దీనిపై కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయానికి చెందిన స్టీఫెన్ కోట్ అనే గ్రాడ్యుయేట్ విద్యార్థి పరిశోధన చేసి, వెల్లడించిన వివరాలు ఇవిగో.. ఓసారి చదివేయండి! ఎప్పుడైనా టీవీల్లో వాటర్ బాటిల్ యాడ్ చూశారా? చూసినా.. మీరు బహుశా పెద్దగా గమనించి ఉండరు. ఎందుకంటే, ఆ యాడ్ మీలో లేనిపోని భయాన్ని సృష్టిస్తోంది. బ్రాండెడ్ కంపెనీల వాటర్ బాటిళ్లలోని నీళ్లు కాకుండా మరేవి తాగినా కోరి కోరి కష్టాన్ని తెచ్చుకున్నట్టే..అనేంతగా మనల్ని ట్యూన్ చేస్తాయి. వీటిని చూసిన సాధారణ జనం.. రిస్కెందుకు, కొనేదేదో బ్రాండెడ్ కంపెనీల నీళ్ల సీసాలనే కొని, తాగేస్తే పోలా? అని వాటినే కొంటున్నారు. మరికొందరికి స్టేటస్ సింబల్.. తమ ఆహార్యం ద్వారా స్టేటస్ను చాటుకోవాలని అనుకునేవారు కూడా వాటర్ బాటిల్ ద్వారా ఆ పని చేస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీల వాటర్ బాటిల్ను కొని, చేతిలో పట్టుకొని తమ డాంబికాన్ని ప్రదర్శిస్తున్నారు. నీళ్ల సీసా ద్వారా తమ ఫిట్నెస్ను, విలువను, ఫిజికల్ అప్పియరెన్స్ను, ఆర్థిక స్థితిని చాటుకోవాలనుకుంటున్నారు. ఇంకొంతమంది ఇదే వాటర్ బాటిల్తో దేశభక్తిని కూడా చాటుకోవాలనుకుంటున్నారు. ‘మనదేశపు నీళ్లు’ అనే అభిప్రాయంతో కొంటున్నవారు కూడా ఉన్నారు. చెవికెక్కడంలేదు... బాటిళ్లలోని నీళ్ల కంటే మున్సిపల్ నల్లా నీళ్లే మంచివనే విషయాన్ని అనేక స్వ చ్ఛంద సంస్థలు, నిపుణులు చెబుతున్నా ప్రజల చెవికి ఎక్కడంలేదు. నీళ్ల సీసా ల్లోని నీరు అంత సురక్షితమైనది కాదని చెప్పేందుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రభు త్వ ఏజెన్సీలు కొత్తగా ఆలోచిం చాల్సిన అవసరముంది. ఆర్థిక, నైతిక, పర్యావరణ అంశాలను జోడిస్తూ ప్రచా రం చేస్తే కొంతమేరకైనా ఫలితముంటుంది. -
వచ్చే పదేళ్లూ టాప్ స్పీడ్..
► భారత్ ఆర్థిక వ్యవస్థపై హార్వర్డ్ వర్సిటీ విశ్లేషణ ► వార్షిక వృద్ధి రేటు 7%గా అంచనా న్యూయార్క్: భారత్ వచ్చే పదేళ్లూ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతుందని హార్వర్డ్ యూనివర్సిటీ ఆర్థిక విశ్లేషకులు అంచనా వేశారు. వార్షిక వృద్ధి రేటు సగటున 7 శాతంగా ఉంటుందన్నది వీరి అంచనా. యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (సీఐడీ)లో వీరు సమర్పించిన ఆర్థిక పరిశోధనా నివేదిక ప్రకారం... చైనా వృద్ధి తగ్గుతోంది. భారత్ మాత్రం దాన్ని పక్కకునెట్టి, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం హోదాను కొనసాగించనుంది. 2024 నాటికి చైనా వార్షిక వృద్ధి రేటు 4.3 శాతానికి పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణ ఆసియా, తూర్పు ఆఫ్రికా దేశాలు వేగవంతమైన వృద్ధిని సాధించే అవకాశం ఉంది. అయితే చమురు, ఇతర కమోడిటీ ఆధారిత దేశాలు మాత్రం వృద్ధి మందగమనం సమస్యలను ఎదుర్కొంటాయి. భారత్కు విభిన్న రంగాల ఉత్పత్తుల్ని ఎగుమతి చేసే సామర్థ్యం పెరగనుంది. ఫార్మా, వాహనాలు, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలు వీటిలో కీలకం. చైనా ఇప్పటికే ఈ తరహా ప్రయోజనాన్ని పొందింది. కేవలం పదేళ్లలోనే తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేసుకోగలిగింది. 2024 నాటికి అమెరికా సగటు వార్షిక వృద్ధి రేటు 2.8%గా ఉంటుంది. బ్రిటన్ విషయంలో ఇది 3.2%. స్పెయిన్ 3.4%, ఇటలీ 1.8%, జర్మనీ 0.35% వృద్ధిని నమోదుచేసుకునే వీలుంది.