breaking news
uniki book
-
విభేదాలు రెండు రాష్ట్రాల అభివృద్ధికి అవరోధం
హైదరాబాద్ : హైదరాబాద్ వివిధ సంస్కృతుల సమ్మేళనమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్రావు రచించిన 'ఉనికి' పుస్తకం ఆవిష్కరణ రాష్ట్రపతి ప్రణబ్ చేతుల మీదగా జరిగింది. హెచ్ఐసీసీలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రణబ్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరమంటే తెలుగువారికే కాదని, దేశమంతా ఇష్టమేనన్నారు. దేశాభివృద్ధికి రాష్ట్రీయ సంబంధాలు బలపడాల్సిన అవసరం ఉందన్నారు. తగాదాలు రెండు రాష్ట్రాల అభివృద్ధికి అవరోధమని ప్రణబ్ వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. -
విద్యాసాగర్రావు ఉనికి పుస్తకావిష్కరణ
-
విద్యాసాగర్రావు 'ఉనికి' పుస్తకావిష్కరణ
హైదరాబాద్ : మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్రావు రచించిన 'ఉనికి' పుస్తకాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించారు. హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్ నేత జానారెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. కేసీఆర్ చేతుల మీదగా పుస్తకం తొలి ప్రతిని ప్రణబ్ అందుకున్నారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ విద్యాసాగర్రావుతో తనకు 30 ఏళ్ల స్నేహం ఉందని, ఆనాడు ప్రతిపక్షంలో విద్యాసాగర్రావు హుందాగా వ్యవహరించారన్నారు. 'ఉనికి' పుస్తకంలో ఎలాంటి ప్రత్యేకత లేదని, అయితే ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్రపతితో పాటు పలువురు హాజరు కావటమే ఉనికికి ఓ 'ఉనికి' ఏర్పడిందని సీహెచ్. విద్యాసాగర్రావు అన్నారు. పలు పత్రికల్లో తాను రాసిన వ్యాసాలను సంకలనం చేసి ఈ పుస్తకం వేయటం జరిగిందన్నారు.