విభేదాలు రెండు రాష్ట్రాల అభివృద్ధికి అవరోధం | hyderabad is a different histories and cultures, says President Pranab mukherjee | Sakshi
Sakshi News home page

విభేదాలు రెండు రాష్ట్రాల అభివృద్ధికి అవరోధం

Jul 3 2015 1:57 PM | Updated on Sep 4 2018 5:16 PM

హైదరాబాద్ వివిధ సంస్కృతుల సమ్మేళనమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు.

హైదరాబాద్ : హైదరాబాద్ వివిధ సంస్కృతుల సమ్మేళనమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్రావు రచించిన 'ఉనికి' పుస్తకం ఆవిష్కరణ రాష్ట్రపతి ప్రణబ్ చేతుల మీదగా జరిగింది. హెచ్ఐసీసీలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రణబ్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరమంటే తెలుగువారికే కాదని, దేశమంతా ఇష్టమేనన్నారు. దేశాభివృద్ధికి రాష్ట్రీయ సంబంధాలు బలపడాల్సిన అవసరం ఉందన్నారు. తగాదాలు రెండు రాష్ట్రాల అభివృద్ధికి అవరోధమని ప్రణబ్ వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement