-
ఉద్యోగుల ఆశలపై నీళ్లు...
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మభ్యపెడుతోంది. గత ఎన్నికల సమయంలో ప్రతి ఏడాది డీఎస్సీ ప్రకటించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అప్పటి నుంచి పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు మరో ఏడాదిలో జరుగుతాయన్న నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేస్తున్నామని 2017 డిసెంబర్ 5న ప్రకటించారు. ఉద్యోగాలు వస్తాయని వేలాది మంది నిరుద్యోగులు ఆశపడ్డారు. డీఎస్సీ కోచింగ్ కోసం రూ.లక్షలు ఖర్చు చేశారు. అప్పటి నుంచి రకరకాలుగా ప్రకటనలిస్తూ డీఎస్సీని కాలయాపన చేస్తూ నిరుద్యోగులను మోసం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. డీఎస్సీని ఎన్నికల వరకు సాగదీసేందుకు టెట్ను రెండుసార్లు నిర్వహించింది. చివరకు ఎన్నికలు ముంచుకువస్తున్న నేపథ్యంలో హడావుడిగా గతేడాది అక్టోబర్ 26న డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. గతేడాది డిసెంబర్ 24 నుంచి ఈ ఏడాది జనవరి 2వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. ఫిబ్రవరి 15న ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలు విడుదలై 45 రోజులు దాటినా డీఎస్సీ నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకువేయలేదని పలువురు విమర్శిస్తున్నారు. ఎన్నికల కోసమే డీఎస్సీ ప్రకటనంటూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నెల్లూరు(టౌన్): గత ఐదేళ్లుగా డీఎస్సీ కోసం నిరుద్యోగులు ఎదురుచూశారు. డీఎస్సీ పడితే ఉద్యోగాలు వస్తాయన్న ఉద్దేశంతో వేలాది మంది టీటీసీ, బీఈడీ కోర్సులు చదివారు. పోస్టులు భారీగా ఉంటాయని, కొంచెం కష్టపడితే ఉద్యోగం పొందవచ్చని ఆశపడ్డారు. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందంటూ 2017 డిసెంబర్ 5న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. అప్పటి నుంచి డీఎస్సీ ప్రకటనను కాలయాపన చేశారు. పోస్టుల ఖాళీల వివరాలను గతేడాది డిసెంబర్ వరకు తీసుకోవాలని ఒకసారి, జూన్ వరకు చూడాలని మరొకసారి ప్రకటనలు ఇచ్చారు. చివరకు మార్చి వరకు మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ఆయా జిల్లా విద్యాశాఖాధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. డీఎస్సీని కాలయాపన చేసేందుకు టెట్ను గతేడాది జనవరిలో ఒకసారి, జూన్లో మరోసారి ప్రభుత్వం నిర్వహించింది. అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికలు ముంచుకువస్తున్న క్రమంలో హడావుడిగా గతేడాది అక్టోబర్ 26న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. భారీ సంఖ్యలో పోటీ డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందేందుకు నిరుద్యోగులు భారీ సంఖ్యలో పోటీ పడ్డారు. గత ఐదేళ్లుగా పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఎక్కువ సంఖ్యలో పోస్టులు ఉంటాయని భావించారు. జిల్లాలో టీటీసీ, డీఎస్సీ పూర్తి చేసిన అభ్యర్థులు 50 వేల మందికిపైగా ఉంటారు. డీఎస్సీ ప్రకటస్తామని చెప్పిన నాటి నుంచి పరీక్షల వరకు కోచింగ్ కోసం ఒక్కో విద్యార్థి రూ.లక్షకుపైగా ఖర్చు చేశారు. అయితే వీరి ఆశలపై రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. కేవలం జిల్లాలో 207 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని ప్రకటించింది. జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రభుత్వ పాఠశాలల్లో 172, మున్సిపల్ స్కూల్స్లో 29, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో 6 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్కలు చూపింది. పోస్టుల కోసం 22244 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రధానంగా ఎస్జీటీ పోస్టులు 35 ఉంటే 13480 మంది పోటీ పడ్డారు. వీరికి గతేడాది డిసెంబర్ 24 నుంచి ఈ ఏడాది జనవరి 2వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. ఫిబ్రవరి 15న ఫలితాలు విడుదల చేశారు. నియామకాలు ఎప్పుడో.. డీఎస్సీ ఫలితాలు విడుదలై 45 రోజులు దాటింది. మెరిట్ లిస్ట్ జాబితాను కూడా విడుదల చేశారు. ఎన్నికల కోడ్ ఈ నెల 10న అమలులోకి వచ్చింది. ఫలితాలు విడుదల నుంచి ఎన్నికల కోడ్ వచ్చిన నాటికి మధ్య 23 రోజులు ఉంది. పోస్టుల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే రోస్టర్ పాయింట్ వైజ్ అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఎన్నికల కోడ్ను చాకుగా చూపి నిరుద్యోగులను గాలికి వదిలివేసిందని పలువురు వాపోతున్నారు. ఎన్నికల సమయంలో ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకోలేదని మండిపడుతున్నారు. ఫలితాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందైనా పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తుందని ఆశగా ఎదురుచూశామని, కనీసం ఆ దిశగా కూడా పాలకులు, అధికారులు ఆలోచించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నిరుద్యోగం పెరుగుతోంది
ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నర్సింహారెడ్డి పరిగి:ఎన్నో హామీలు, కలల ప్రపంచాన్ని చూపి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమవుతోందని.. రోజురోజుకు నిరుద్యోగం పెరుగుతోందని ఏఐవైఎఫ్(అఖిల భారత యువజన సమాఖ్య) జిల్లా కార్యదర్శి నర్సింహారెడ్డి అన్నారు. గురువారం పరిగిలో వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఆ సంఘం నియోజకవర్గ ప్రథమ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు చెందిన భూములు అమ్ముకొని ఖజానా నింపుకుంటున్న ప్రభుత్వం జిల్లా ప్రజలకు మాత్రం మొండి చేయి చూపిస్తుందన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశా రు. సొంత లాభాల కోసం ప్రభుత్వం ప్రాజెక్టుల డిజై న్లు మారుస్తుందని విమర్శిం చారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, ఏఐ ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పీర్మహ్మద్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీని వాస్ మాట్లడుతూ విద్యార్థుల భిక్షతో అధికారం చేపట్టిన తెలంగాణ సర్కారు వారిని పూర్తిగా విస్మరిస్తోందన్నారు. ఇలాగే వ్యవహరిస్తే సీఎం క్యాంప్ఆఫీస్ ముట్టడిస్తామ న్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేష్, నర్సింహ, చెన్నయ్య, మల్లేశం, రమేష్, శ్రీను,సైదులు, సత్తయ్య, శివశంకర్, నరేష్, బాల్రాజ్ పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement