breaking news
umpire decision review system
-
ఇది అవుట్ అని మీకూ తెలుసు.. కానీ: నవ్వుతూనే ఇచ్చిపడేసిన బుమ్రా
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jaspreet Bumrah) మైదానంలో ఎంతో కూల్గా ఉంటాడు. బాల్తోనే ప్రత్యర్థి జట్టు బ్యాటర్లతో మాట్లాడతాడు. పదునైన యార్కర్లతో, బౌన్సర్లతో వారిని బోల్తా కొట్టిస్తాడు. అయితే, తాజాగా బుమ్రా కూడా కాస్త సహనం కోల్పోయాడు.అసలేం జరిగిందంటే.. టీమిండియా- వెస్టిండీస్ (IND vs WI 2nd Test) మధ్య శుక్రవారం మొదలైన రెండో టెస్టు.. నాలుగో రోజు ఆటకు చేరుకుంది. 173/2 ఓవర్నైట్ స్కోరుతో సోమవారం నాటి ఆట మొదలుపెట్టిన విండీస్.. భోజన విరామ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది.జాన్ క్యాంప్బెల్ సెంచరీఇక ఆదివారం 87 పరుగులతో క్రీజులో నిలిచిన విండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్బెల్ (John Campbell)... సెంచరీ (115) సాధించాడు. అయితే, క్యాంప్బెల్ 94 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న వేళ బుమ్రా అతడిని వికెట్ల ముందుకు దొరకబుచ్చుకున్నట్లు కనిపించింది.ఎల్బీడబ్ల్యూ కాదుఅయితే, ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ ఇలింగ్వర్త్ మాత్రం తల అడ్డంగా ఉపుతూ ఎల్బీడబ్ల్యూ (Leg Before Wicket) ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో టీమిండియా రివ్యూకి వెళ్లింది. అయితే, రీప్లేలో అల్ట్రాఎడ్జ్ స్పైక్ వచ్చింది. కానీ బంతి ముందుగా ప్యాడ్స్ లేదంటే బ్యాట్ను తాకిందా అనేది స్పష్టంగా తెలియలేదు. బంతి అటు బ్యాట్కు.. ఇటు ప్యాడ్కు అత్యంత సమీపంగా ఉన్నట్లు కనిపించడంతో నిర్ణయం తీసుకోవడం కష్టమైంది.ఈ నేపథ్యంలో థర్డ్ అంపైర్ అలెక్స్ వార్ఫ్ ఇన్సైడ్ ఎడ్జ్ ఉందని.. ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయానికే కట్టుబడి ఉండవచ్చని స్పష్టం చేశాడు. దీంతో టీమిండియా రివ్యూ కోల్పోయింది.ఇది అవుట్ అని మీకూ తెలుసుఈ క్రమంలో బుమ్రా తిరిగి బౌలింగ్కు వెళ్లే సమయంలో.. ‘‘ఇది అవుట్ అని మీకూ తెలుసు. కానీ సాంకేతికత కూడా దానిని నిరూపించలేదు కదా!’’ అంటూ నవ్వుతూనే అంపైర్కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు. ఈ మాటలు స్టంప్ మైకులో రికార్డయ్యాయి. కాగా విండీస్ రెండో ఇన్నింగ్స్ 55వ ఓవర్లో ఈ ఘటన జరిగింది.ఇక ఫాలో ఆన్ ఆడుతున్న వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్లో 93 ఓవర్ల ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. తద్వారా 33 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అంతకుముందు టీమిండియా 518/5 వద్ద తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. విండీస్ 248 పరుగులకు ఆలౌట్ అయింది.pic.twitter.com/fDtB3GBWPV— crictalk (@crictalk7) October 13, 2025చదవండి: జైస్వాల్ అంటే గిల్కి అసూయ!.. అందుకేనా?: మాజీ క్రికెటర్ ఫైర్Trapped! 🕸#RavindraJadeja gets the all-important wicket of centurion #JohnCampbell. 💪Catch the LIVE action 👉 https://t.co/WbUGnskEdz#INDvWI 👉 2nd Test, Day 4 | Live Now on Star Sports & JioHotstar pic.twitter.com/eHUVezgNs2— Star Sports (@StarSportsIndia) October 13, 2025 -
‘డీఆర్ఎస్’ మరో ముందడుగు: సచిన్
భారత్, ఇంగ్లండ్ సిరీస్లో అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్ఎస్) అమలు చేయడాన్ని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్వాగతించారు. బీసీసీఐ పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత తీసుకున్న ఈ నిర్ణయం మరో మంచి ముందడుగుగా ఆయన అభివర్ణించారు. లోపాలు లేని డీఆర్ఎస్కు తన మద్దతు పలికి?న సచిన్... టెక్నాలజీ విషయంలో టెస్టుల్లో ప్రపంచవ్యాప్తంగా ఒకే తరహా నిబంధనలు అమలు చేయాలని సూచించారు. ఒక చోట స్నికో మీటర్, మరో చోట హాట్స్పాట్ వాడటానికి తాను వ్యతిరేకమన్నారు. -
డీఆర్ఎస్ దిశగా భారత్!
టెక్నాలజీపై చర్చించనున్న బీసీసీఐ న్యూఢిల్లీ: ఎనిమిదేళ్లుగా అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్ఎస్)ని వ్యతిరేకిస్తూ వచ్చిన భారత్, ఇప్పుడు కాస్త పట్టువిడుపులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీసీసీఐ ఈ విషయంలో మరికాస్త చొరవ ప్రదర్శిస్తే త్వరలో సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరిగే టెస్టు సిరీస్లో డీఆర్ఎస్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. టెక్నాలజీపై మరింత స్పష్టత ఇచ్చి, దాని పనితీరును వివరించేందుకు ఐసీసీ జీఎం జెఫ్ అలార్డిస్ తదితరులు బీసీసీఐ పెద్దలు, కోచ్ అనిల్ కుంబ్లేతో సమావేశం కానున్నారు. వచ్చే వారమే దీనిపై చర్చిస్తామని ఐసీసీ ప్రకటించింది. బాల్ ట్రాకింగ్, హాక్ ఐ టెక్నాలజీకి సంబంధించి భారత్కు ఉన్న సందేహాలను వారు నివృత్తి చేస్తారు. డీఆర్ఎస్ వంద శాతం కచ్చితత్వంతో ఉంటేనే దానికి అంగీకరిస్తామంటూ బోర్డు మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్, నాటి టెస్టు కెప్టెన్ ధోని గట్టిగా వాదించారు. అరుుతే కోహ్లి కెప్టెన్ అయ్యాక బోర్డు ఆలోచనలోనూ మార్పు కనిపించింది. ఐదు టెస్టుల భారత్, ఇంగ్లండ్ సిరీస్లో చిన్నపాటి అంపైరింగ్ పొరపాట్లు కూడా ఫలితాన్ని మార్చే అవకాశం ఉండటంతో డీఆర్ఎస్ అమలుపై బోర్డు ముందుకు వస్తోంది. 2008లో శ్రీలంకతో టెస్టు సిరీస్లో భారత్ ఒకే ఒకసారి డీఆర్ఎస్ వాడగా... ఎక్కవ భాగం నిర్ణయాలు మన జట్టుకు ప్రతికూలంగా వచ్చారుు. దాంతో ఏ సిరీస్లోనూ దానిని వాడేందుకు బీసీసీఐ అంగీకరించలేదు.