-
అసోంలో ఇక శాంతి పవనాలు
న్యూఢిల్లీ: దశాబ్దాలుగా వేర్పాటువాద ఉద్యమాలతో అట్టుడికిపోతున్న అసోంలో శాంతి సుస్థిరతలు నెలకొనే దిశగా అడుగులు పడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై శాంతి ఒప్పందంపై వేర్పాటువాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం(ఉల్ఫా) సంతకం చేసింది. ఇకపై హింసకు దూరంగా ఉంటామని, ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలుపంచుకుంటామని ప్రకటించింది. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అసోం ముఖ్యమంత్రి హిమంతబిశ్మ శర్మ సమక్షంలో ఉల్ఫా శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. అసోం ప్రజలకు ఇదొక మరుపురాని గొప్ప రోజు అని అమిత్ షా చెప్పారు. హింసాకాండ వల్ల అసోం ప్రజలు ఎంతగానో నష్టపోయారని, 1979 నుంచి 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. హింసను విడనాడేందుకు ఉల్ఫా అంగీకరించిందని తెలిపారు. శాంతి ఒప్పందంలో భాగంగా రాష్ట్రానికి భారీ అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. ఒప్పందంలోని ప్రతి అంశాన్నీ పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్నారు. శాంతి ఒప్పందం చరిత్రాత్మకమని సీఎం హిమంతబిశ్మ వర్మ అభివరి్ణంచారు. ప్రధానమంత్రి నరంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చొరవతో ఈ ఒప్పందం కార్యరూపం దాలి్చందని హర్షం వ్యక్తం చేశారు. ఏమిటీ ఉల్ఫా? ‘సార్వభౌమత్వ అస్సాం’ అనే డిమాండ్తో 1979 ఏప్రిల్ 7న ఉల్ఫా ఏర్పాటయ్యింది. డిమాండ్ను నెరవేర్చుకొనేందుకు ఉల్ఫా హింసాకాండనే నమ్ముకుంది. 1990లో ఈ సంస్థపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఉల్ఫాలోని అరబిందా రాజ్ఖోవా వర్గం 2011 సెపె్టంబర్ 3 నుంచి శాంతి చర్చలు కొనసాగిస్తోంది. ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. అయితే, ఉల్ఫాలో పరేశ్ బారువా నేతృత్వంలోని మరో వర్గం ఈ ఒప్పందంలో భాగస్వామిగా చేరలేదు. పరేశ్ బారువా ప్రస్తుతం చైనా–మయన్మార్ సరిహద్దుల్లోని ఓ గ్రామంలో నివసిస్తున్నట్లు సమాచారం. -
రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఐదుగురి మృతి
గువాహటి : అసోంలో దారుణం చోటుచేసుకుంది. ఖబారీ గ్రామానికి చెందిన ఐదుగురు యువకులను గుర్తు తెలియని దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. గురువారం రాత్రి సదియా పట్టణంలో ఓ షాపు ముందు కూర్చున్న ఈ యువకులను బ్రహ్మపుత్ర నదీ తీరంలోకి తీసుకువెళ్లిన దుండగులు... ఒకరి తర్వాత ఒకరిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆ తర్వాత వారి శవాలను అక్కడే పడేశారు. అసోం వేర్పాటువాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఉగ్రవాదులే ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా భావిస్తున్నారు. కాగా అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకోవాలని డీజీపీని ఆదేశించారు. కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ఇలాంటి ఉన్మాద చర్యలకు పాల్పడుతున్న వారిని ఉపేక్షించేది లేదని, ఈ విషయం గురించి అసోం సీఎంతో మాట్లాడానని పేర్కొన్నారు. ఎన్ఆర్సీ ప్రతిఫలమేనా? ‘ఇది చాలా భయాందోళన కలిగించే అంశం. ఈ పాశవిక హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్ఆర్సీ (భారత పౌరులను గుర్తించే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్) అభివృద్ధి ఫలితం ఇదేనా’ అంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ఈ ఘటనకు నిరసనగా సిలిగురి, కోల్కతా తదితర ప్రాంతాల్లో ర్యాలీలు చేపడతామని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. (చదవండి : అసోంలో ఏం జరుగుతోంది) Terrible news coming out of Assam. We strongly condemn the brutal attack in Tinsukia and the killing of Shyamlal Biswas, Ananta Biswas, Abhinash Biswas, Subodh Das. Is this the outcome of recent NRC development ? 1/2 — Mamata Banerjee (@MamataOfficial) November 1, 2018 -
'కోటి రూపాయల కోసం కిడ్నాప్ చేయలేదు'
గువాహటి: డబ్బు కోసం బీజేపీ నేత కుమారుడిని కిడ్నాప్ చేసినట్టు వచ్చిన వార్తలను ఉల్ఫా తీవ్రవాద సంస్థ తోసిపుచ్చింది. తమ సమాచారం సైన్యానికి అందిస్తున్నందునే అతడిని కిడ్నాప్ చేశామని ఉల్ఫా చీఫ్ పరేశ్ బారువా వెల్లడించారు. టిన్సుకియా జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ రత్నేశ్వర్ మోరన్ కొడుకు, బీజేపీ ఎమ్మెల్యే బొలిన్ చెటియా సమీప బంధువు అయిన కుల్దీప్ మోరన్ను ఈ నెల 1న ఉల్ఫా తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. అతడిని విడిచిపెట్టేందుకు కోటి రూపాయలు డిమాండ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే తాము డబ్బు డిమాండ్ చేయలేదని బారువా తెలిపారు. తమ గురించి సైన్యానికి కుల్దీప్ సమాచారం అందించడంతో తమ సంస్థకు చెందిన చాలా మందిని కోల్పోవలసి వచ్చిందని వెల్లడించారు. 'కుల్దీప్ క్షేమంగా ఉన్నాడు. ఆర్మీని ఇన్ఫార్మర్ అనే కారణంతో అతడిని కిడ్నాప్ చేశాం. మా కోర్టులో అతడిపై విచారణ జరుపుతాం. నిరపరాధి అని తేలితే అతడిని విడిచిపెడతామ'ని బారువా తెలిపారు. -
అసోం బీజేపీ నేత కొడుకు కిడ్నాప్
గువహాటి: అసోంలో ఉల్ఫా తీవ్రవాదులు బీజేపీ నేత కొడుకుని కిడ్నాప్ చేశారు. బందీని ప్రాణాలతో విడిచిపెట్టాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని, లేకుంటే హతమారుస్తామని హెచ్చరించారు. టిన్సుకియా జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ రత్నేశ్వర్ మోరన్ కొడుకు, బీజేపీ ఎమ్మెల్యే బొలిన్ చెటియా సమీప బంధువు అయిన కుల్దీప్ మోరన్ను ఈ నెల 1న ఉల్ఫా తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఎమ్మెల్యే బొలిన్ నుంచి డబ్బులు తీసుకుని తమకు చేర్చాల్సందిగా తీవ్రవాదులు రత్నేశ్వర్ను డిమాండ్ చేశారు. కుల్దీప్ బంధువులు తొలుత ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నా, ఉల్ఫా తీవ్రవాదులు ఇటీవల పంపిన మరో వీడియో చూసి భయపడిపోయారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని తన ప్రాణాలను కాపాడాలని, తీవ్రవాదుల డిమాండ్ మేరకు డబ్బులు ఇచ్చి తనను విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కుల్దీప్ కుటుంబ సభ్యులను, ముఖ్యమంత్రి సోనోవాల్ను కోరాడు. ఈ వీడియాలో ముఖాలకు ముసుగులు ధరించిన ఐదుగురు సాయుధులు కుల్దీప్ చట్టూ నిల్చున్నారు. తీవ్రవాదుల చెర నుంచి కుల్దీప్ను విడిపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని బొలిన్ చెప్పారు. కాగా కుల్దీప్ను విడిపించేందుకు అసోం పోలీసులు సర్చ్ ఆపరేషన్ చేపట్టారు. బొలిన్తో ఎక్కువ సన్నిహితంగా ఉండే కుల్దీప్ ఆయన దగ్గరే పనిచేస్తున్నాడు. ఇటీవల జరిగిన అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బొలిన్ సాదియా నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. గతంలో కాంగ్రెస్లో ఉన్న బొలిన్, రత్నేశ్వర్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. అసోంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. -
’ఉల్పా’నేత అనూప్ చెతియ విదుదల
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement