‘ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించాలి’
ఖమ్మం: ట్రెజరీ(010) ద్వారా జీతాలు చెల్లించాలని కోరుతూ అర్చకులు హోమం నిర్వహించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని అర్చకుల సమాఖ్య ఆధ్వర్యంలో వైరా రోడ్డులో పాత ఆంజనేయ స్వామి దేవాలయంలో అర్చకులంతా కలిసి శుక్రవారం ప్రత్యేక హోమం నిర్వహించారు. దేవాదయ శాఖ కలగజేసుకొని అర్చకుల డిమాండ్లను తీర్చాలని వారు కోరారు.