-
పటేల్ నియామకం వెనక మతలబేమిటీ?
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా అహ్మద్ పటేల్ను నియమించడం వెనక పెద్ద మతలబే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆర్థికంగా నిధుల కొరతను ఎదుర్కొంటోంది. ఏడాదిలోగా పార్లమెంట్ ఎన్నికలు జరుగనుండడమే కాకుండా ఈ ఏడాది చివరలో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెల్సినవే. ఈ ఎన్నికలను ఎదుర్కోవడానికి భారీ ఎత్తున పార్టీకి నిధులు సమీకరించాల్సి ఉంది. 20 ఏళ్ల క్రితం పార్టీక కోశాధికారిగా పనిచేసిన అహ్మద్ పటేల్ సోనియా గాంధీకి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడికి రాజకీయ కార్యదర్శిగా పనిచేసిన విషయం తెల్సిందే. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం అహ్మద్ పటేల్, ప్రభుత్వానికీ, పార్టీకి వారధిగా పనిచేశారు. ఆయనకు పార్టీ దిగువస్థాయి కార్యకర్త నుంచి అధిష్టానం నాయకులందరితో సత్సంబంధాలు ఉన్నాయి. మరోపక్క కార్పొరెట్ ప్రపంచంతో పరిచయం ఉండడమే కాకుండా కార్పొరెట్ దిగ్గజాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అపార పార్టీ నిధులు కలిగిన భారతీయ జనతా పార్టీని వచ్చే ఎన్నికల్లో అంతంత మాత్రం నిధులతో ఎదుర్కోవడం కష్టమని భావించే పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ కోశాధికారి పదవికి పటేల్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు పార్టీ కోశాధికారిగా పనిచేస్తున్న మోతీలాల్ వోరాకు గత కొన్నేళ్లుగా నిధుల సమీకరణలో సహకరిస్తూ పరోక్ష కోశాధికారిగా పనిచేశారని, ఇప్పుడు అధికారికంగా కోశాధికారి అయ్యారని పార్టీ ఆఫీస్ బేరర్ ఒకరు వ్యాఖ్యానించారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల నుంచే కాంగ్రెస్ పార్టీకి నిధుల కొరత ప్రారంభమైంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని తెల్సి అప్పటి వరకు ఆ పార్టీ వెంట ఉండి విరాళాలు ఇచ్చిన కార్పొరేట్ ప్రముఖులు బీజేపీ వైపు మళ్లారు. లోక్సభ ఎన్నికల్లో ఎదురైన పరాజయం ఆ తర్వాత జరిగిన మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పునరావృతం అవడంతో పార్టీ నిధుల పరిస్థితి బాగా దిగజారింది. ఆ పార్టీ ప్రస్తుతం పంజాబ్, మిజోరమ్, పుదుచ్ఛేరిలో మాత్రమే అధికారంలో ఉండగా, కర్ణాటకలో సంకీర్ణ భాగస్వామి అధికారంలో కొనసాగుతోంది. ఈ కారణంగా ఆర్థిక వనరుల సమీకరిణకు అవకాశాలు పరిమితంగానే ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ నిధుల సమీకరణకు పార్టీ నాయకులపైనే ఆధారపడుతోంది. నిధులను సామర్థ్యం ఉన్న కారణంగానే మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్గా కమల్నాథ్ను పార్టీ నియమించింది. ఇదే కారణంగా ఒడిశా పీసీసీ చీఫ్గా మళ్లీ నిరంజన్ పట్నాయక్ను పార్టీ మళ్లీ నియమించింది. పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరుల నుంచి నిధుల సమీకరణకు గత మూడేళ్లుగా మోతీలాల్ వోరా చేసిన ప్రయత్నించలేదు. మోదీ ప్రభుత్వాన్ని ‘సూటు బూటు’ ప్రభుత్వం అంటూ రాహుల్ గాంధీ విమర్శించడం, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో అంబానీకి మోదీ ప్రభుత్వం మేలు చేసిందంటూ కార్పొరెట్ దిగ్గజాల లక్ష్యంగా రాహుల్ విమర్శలు చేయడం వల్ల కార్పొరేట్ సంస్థలు కాంగ్రెస్కు దూరమవుతున్నాయి. -
పార్టీ డబ్బులపై పెత్తనం నాదే: పన్నీర్
-
పార్టీ డబ్బులపై పెత్తనం నాదే: పన్నీర్
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మరోసారి తిరుగుబాటు చేశారు. పార్టీ కోశాధికారి పదవి నుంచి తనను తప్పించినా, దాన్ని ఒప్పుకోవడం లేదు. తనను తప్పించడం పార్టీ నిబంధనల ప్రకారం అక్రమమని, అందువల్ల తన అనుమతి లేకుండా ఎవరూ అన్నాడీఎంకే ఖాతాలలో ఉన్న డబ్బులు తీసుకోడానికి అనుమతించొద్దని బ్యాంకులకు లేఖలు రాశారు. ''అన్నాడీఎంకే రాజ్యాంగంలోని బై-లా 20 సబ్ క్లాజ్ 5 ప్రకారం పురచ్చితలైవి అమ్మ (జయలలిత) నన్ను అన్నాడీఎంకే కోశాధికారిగా నియమించారు. అందువల్ల పార్టీ కరెంటు ఖాతాను నా లిఖితపూర్వక అనుమతి, సూచనలు లేకుండా ఎవరూ ఆపరేట్ చేయడానికి అనుమతించొద్దని నేను మిమ్మల్ని కోరుతున్నాను'' అని కరూర్ వైశ్యాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్లకు ఆయన లేఖలు రాశారు. అన్నాడీఎంకే కార్యవర్గసభ్యులు అంటే.. కేంద్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, ఉప ప్రధాన కార్యదర్శి, కోశాధికారి.. వీళ్లందరినీ పార్టీ ప్రధాన కార్యదర్శి నియమిస్తారని, సంబంధిత నియమ నిబంధనల ప్రకారం పార్టీ కొత్త అధినేతను ఎన్నుకునేవరకు వీళ్లంతా తమ పదవుల్లో కొనసాగుతారని పన్నీర్ సెల్వం అంటున్నారు. జయలలిత మరణం తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉందని, దాన్ని ఇంకా పార్టీ రాజ్యాంగంలోని రూల్ 20 సబ్ క్లాజ్ 2 ప్రకారం భర్తీ చేయాల్సి ఉందని చెప్పారు. మొత్తం పార్టీ రాజ్యాంగాన్ని, అందులో ఉన్న నియమ నిబంధనలను కోట్ చేస్తూ ఆయన కోశాధికారిగా తన అధికారాన్ని చాటి చెబుతుండటంతో ఇప్పుడు మళ్లీ ఎలాంటి పరిణామాలు జరుగుతాయోనని అంతా ఎదురు చూస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ
డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.
కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు
జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది
నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!
శోభిత పోస్ట్.. సమంత స్టైలిష్ట్ రిప్లై
ముంబై ఎయిర్పోర్టులో 12 కోట్ల విలువైన బంగారం, ఐఫోన్లు సీజ్
ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ మంత్రిని చంపేస్తామని బెదిరింపులు!
సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement