breaking news
tpc
-
మీరు తెలంగాణ పై దృష్టిపెట్టండి: మాదాసు గంగాధరం
- వీహెచ్ కు ఏపీసీసీ ఉపాధ్యక్షుడి సలహా - పవన్ కళ్యాణ్ ను కాపు ఉద్యమంతో ముడిపెట్టదన్న గంగాధరం హైదరాబాద్ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను కాపు ఉద్యమంలోకి లాగవద్దని తెలంగాణ కాంగ్రెస్ నేత వీ హనుమంత రావుకు ఏపీ సీసీ ఉపాధ్యక్షులు మాదాసు గంగాధర్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఇందిరాభవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపు ఉద్యమం కేవలం ముద్రగడ కుటుంబ సమస్య కాదని అన్నారు. కాగా.. వీహనుమంత రావు సీనియర్ ఎంపీగా పనిచేశారని.. ఆయన తెలంగాణ శ్రేయస్సుపై దృష్టి పెడితే బాగుంటుందని అన్నారు. పిలవని పేరంటానికి వచ్చినట్లు ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చి.. పవన్ కళ్యాణ్ ను కాపు ఉద్యమానికి ముడిపెట్టి మాట్లాడటం సరికాదని అన్నారు. విభజన చట్టంలోని హామీలు నెరవేరలేదని, ఆంధ్ర ప్రదేశ్ ఇబ్బందుల్లో ఉందన్నారు. ముద్రగడ దీక్ష విరమించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
పన్ను విధానాల్లో సమగ్రత లక్ష్యంగా కమిటీలు
న్యూఢిల్లీ: పన్ను విధానాల్లో సమగ్రతను తీసుకురావాలన్న లక్ష్యంతో ఆర్థికశాఖ మంగళవారం రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. ఇందులో ట్యాక్స్ పాలసీ కౌన్సిల్ (టీపీసీ) పేరుతో వేసిన కమిటీ ఆర్థికమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ట్యాక్స్ పాలసీ రిసెర్చ్ యూనిట్ (టీపీఆర్యూ) పేరుతో ఏర్పాటయిన మరొక కమిటీ రెవెన్యూ కార్యదర్శి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ద్రవ్య, పన్ను విధానాలకు సంబంధించి టీపీఆర్యూ అధ్యయనాలు జరిపి... ఆయా అంశాలను టీపీసీకి సమర్పిస్తుంది. ఈ అధ్యయనాల ప్రాతిపదికన టీపీసీ పన్ను అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. 2016 ఏప్రిల్ 1 నుంచీ ఈ రెండు కమిటీలూ పనిచేస్తాయని రెవెన్యూ కార్యదర్శి హాస్ముఖ్ ఆదియా ట్వీట్ చేశారు.