breaking news
Toguta
-
విద్యార్థినులతో టాయిలెట్స్ క్లీనింగ్
సాక్షి, దుబ్బాక(సిద్దిపేట): చీపుర్లు పట్టి టాయ్లెట్స్ శుభ్రం చేస్తున్న వీరంతా సిద్దిపేట జిల్లా తొగుట మండలం రాంపురం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు. ఈ పాఠశాలలో 5 నుంచి ఇంటర్మీడియట్ వరకు 560 మంది విద్యార్థినులున్నారు. హౌస్ కీపింగ్, ఇతర పనులకు విద్యార్థినులను పురమాయించడం రివాజుగా మారింది. ప్రస్తుతం కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్న క్రమంలో ఇటీవల విద్యార్థులతో టాయిలెట్లు శుభ్రం చేయించడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. చదవండి: ఉన్నత చదువు చదివి ఇంత పనిచేశాడా! బూతులు తిడుతూ వివస్త్రను చేసి ఫోటోలు, వీడియోలు.. -
పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట
తోగుట (మెదక్): ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట రక్షణ కోసం శుక్రవారం మెదక్ జిల్లా తోగుట పోలీసులను ఆశ్రయించింది. మండల పరిధిలోని పెద్దమాసాన్పల్లికి చెందిన దోసపల్లి అనిల్ కుమార్(25), సిద్దిపేట పట్టణానికి చెందిన పెర్క జ్యోతి (21) నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు అంగీకరించరని భావించిన ప్రేమికులు మార్చి 30న హైదరాబాద్ సుల్తాన్బజారులో ఉన్న ఆర్య సమాజ్ మందిరంలో వివాహం చేసుకున్నారు. రక్షణ కోసం శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. తొగుట సీఐ వెంకటయ్య ఇరువువురి తల్లిదండ్రులను పిలిపించి రాజీ కుదిర్చారు. -
కాంగ్రెస్, బీజేపీ డిపాజిట్లు గల్లంతు చేయాలి
తొగుట: దశాబ్ధ కాలంగా తెలంగాణ ప్రజలను అష్టకష్టాలు పెట్టిన కాంగ్రెస్, బీజేపీలకు ఉప ఎన్నికలో డిపాజిట్లు గల్లంతు చేయాలని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, ఉప ఎన్నిక దుబ్బాక నియోజక వర్గ ఇన్చార్జి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. తొగుట మండలం రాంపూర్ శివారులోని కోటిలింగాల దేవాలయ ఆవరణలోని కల్యాణ మండపంలో గురువారం స్థానిక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అధ్యక్షతన టీఆర్ఎస్ మండల కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన కేటీఆర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డికి సీఎం కేసీఆర్కు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ రావాలన్నారు. తెలంగాణలో సుమారు నాలుగేళ్లుగా వరుస కరువుతో రైతాంగం అల్లాడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, తుపాను ప్రభావంతో నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వలేకపోయిందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన సునీతా లక్ష్మారెడ్డి ఎందుకు నోరుమెదపలేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడానికి 480 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేశారన్నారు. అందులో మెదక్ జిల్లాకు 54 కోట్లు మంజూరయ్యాయన్నారు. తెలంగాణ ప్రాంతంలో పుష్కలంగా బొగ్గు నిక్షపాలున్నప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ నేతల అసమర్థత వల్లే సీమాంధ్రులు థర్మల్, జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఆంధ్రలో ఏర్పాటు చేసుకున్నారన్నారు. వారి అసమర్థత వల్లే తెలంగాణ ప్రాంత రైతాంగానికి విద్యుత్ సమస్య తలెత్తిందన్నారు. తెలంగాణ లో బీజేపీకి మంచిపేరుండేదని తెలంగాణ ద్రోహిగా మారిన జగ్గారెడ్డికి టికెట్ ఇచ్చి ఆ పేరు కోల్పోయిందన్నారు. బీజేపీలో జగ్గారెడ్డిని చేర్చుకోవడంతో బారతీయ జనతా పార్టీ బాబు జగ్గారెడ్డిపార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే (షాద్నగర్) అంజయ్య యాదవ్, జెడ్పీటీసీ కొక్కొండ రూప, ఎంపీపీ గంటా రేణుక తదితరులు పాల్గొన్నారు.