-
ద్వారకాతిరుమలలో చినవెంకన్న బ్రహ్మోత్సవాలు
ద్వారకాతిరుమల: ఆపదమొక్కులవాడు.. అనాథ రక్షకుడు.. ద్వారకాధీశుడి ఆశ్వీయుజ మాస బ్రహ్మోత్సవాలు ద్వారకాతిరుమలలో బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను వైఖానస ఆగమోక్తంగా రెండు సార్లు జరపడం సంప్రదాయంగా వస్తోంది. ఆలయంలో నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలతో పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈనెల 5వ తేదీ నుంచి 12 వరకు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో స్వామివారు ఉదయం, రాత్రి వేళల్లో వివిధ వాహనాలపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగుతారు. అలాగే ఆలయ ముఖ మండపంలో రోజుకో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. క్షేత్ర చరిత్ర ద్వారకామహర్షి తపోఫలితంగా ఉద్భవించిన క్షేత్రం ద్వారకాతిరుమల. ఇక్కడ స్వయంభూ చినవెంకన్న పుట్టలో వెలిశారు. పాదపూజ కోసం పెద్దతిరుపతి నుంచి స్వామిని తెచ్చి స్వయం వ్యక్తుని వెనుక ప్రతిష్ఠించారు. దీంతో ఒకే అంతరాలయంలో స్వామివారు ద్విమూర్తులుగా కొలువై ఉండటంతో ఏటా వైశాఖ, ఆశ్వయుజ మాసాల్లో ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. తిరుమల తిరుపతి శ్రీవారు ఇక్కడ ఉండటం వల్ల, అక్కడి మొక్కులు ఇక్కడ తీర్చుకునే సంప్రదాయం ఉంది. అభివృద్ధి ఘనం భక్తుల సౌకర్యార్థం కొండపై రూ.75 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిన అధికారులు, మరికొన్ని నిర్మాణాలకు ఇటీవల శంకుస్థాపనలు చేశారు. కాటేజీల నిర్మాణం, డోనర్ స్కీమ్, నిత్యాన్నదాన ట్రస్టు, నిత్యకల్యాణం, గోసంరక్షణ, విమానగోపుర స్వర్ణమయ పథకం, ప్రాణదాన ట్రస్టులకు విరాళాలను సేక రిస్తూ క్షేత్రాభివృద్ధిలో భక్తులను సైతం భాగస్వాములను చేస్తున్నారు. కొండపైన సన్డైల్, గార్డెన్లు, క్షేత్రంలో 40 అడుగుల గరుత్మంతుడు, అభయాంజనేయుడు, అన్నమాచార్యుని విగ్రహాలు, శ్రీవారి ధర్మప్రచార రథం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. బ్రహ్మోత్సవాలు ఇలా.. ► ఈనెల 5న ఉదయం స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలుగా ముస్తాబు చేస్తారు. రాత్రి 7 గంటల నుంచి గజవాహనంపై శ్రీవారి గ్రామోత్సవం. ► 6న రాత్రి 7 గంటల నుంచి అంకురార్పణ, రుత్విగ్వరణ అనంతరం ధ్వజారోహణ. రాత్రి 9 గంటల నుంచి హంసవాహనంపై గ్రామోత్సవం ► 7న ఉదయం 7 గంటల నుంచి సూర్యప్రభ, రాత్రి 7 గంటల నుంచి చంద్రప్రభ వాహనాలపై గ్రామోత్సవం. ► 8న ఉదయం 7 గంటల నుంచి హనుమద్వాహనంపై గ్రామోత్సవం, రాత్రి 7 గంటల నుంచి ఎదుర్కోలు ఉత్సవం, రాత్రి 8.30 గంటల నుంచి వెండి శేషవాహనంపై గ్రామోత్సవం. ► 9న రాత్రి 8 గంటల నుంచి స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం. అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం, అదే రోజు ఉదయం 7 గంటల నుంచి సింహ వాహనంపై గ్రామోత్సవం. ► 10న రాత్రి 7 గంటల నుంచి రథోత్సవం. ► 11న ఉదయం 9 గంటల నుంచి చక్రవారి–అపభృధోత్సవం, రాత్రి 7 గంటల నుంచి పూర్ణాహుతి, మౌనబలి, ధ్వజావరోహణ, రాత్రి 8 గంటల నుంచి అశ్వవాహనంపై గ్రామోత్సవం. ► 12న ఉదయం 9 గంటల నుంచి చూర్ణోత్సవం, వసంతోత్సవం, రాత్రి 7 గంటల నుంచి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగం–పవళింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయి . సేవలు రద్దు బ్రహోత్సవాలు జరిగే రోజుల్లో ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యం శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. శ్రీహరి కళాతోరణ వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యమిస్తాం. పెద్ద సంఖ్యలో భక్తులు బ్రహ్మోత్సవ వేడుకల్లో పాల్గొనాలని కోరుతున్నాం. – వేండ్ర త్రినాథరావు, శ్రీవారి దేవస్థానం ఈఓ -
కమనీయం.. లక్ష్మీనరసింహుడి కల్యాణం
సాక్షి, యాదాద్రి/యాదగిరిగుట్ట: యాదగిరీంద్రుని తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం తులా లగ్న పుష్కరాంశ సుముహూర్తమున బాలాలయంలో లక్ష్మీదేవితో యాదగిరీంద్రునికి తిరుకల్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. స్వామివారిని శ్రీరామ అలంకారం చేసి హనుమంత వాహన సేవ నిర్వహించారు. హనుమద్వాహనరూఢుడైన శ్రీస్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. అనంతరం పంచరాత్రా ఆగమ శాస్త్రం ప్రకారం స్వామి, అమ్మవార్లను అలంకరించి తిరుకల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం 11.05 గంటలకు ప్రారంభమైన కల్యాణంలో ప్రధాన ఘట్టమైన జీలకర్రబెల్లం పెట్టే కార్యక్రమం 12.50కి పూర్తికాగా.. మాంగళ్య«ధారణ మహోత్సవం 12.57 గంటలకు జరిగింది. కన్యాదానం, మాంగళ్యధారణ, తలంబ్రాలు మొదలైన కల్యాణ ఘట్టాలను ఆలయ అర్చకులు వేద మంత్రాల మధ్య నిర్వహించారు. మధ్యాహ్నం 1.15 గంటలకు కల్యాణోత్సవం పూర్తయ్యింది. స్వామి వారిని మల్లె, మందార, పున్నాగ, జాజి, వకుళ, కేతకి, చంపక, మల్లిక వంటి పుష్పాలతో.. చంద్రహారం, పగడాలు, ఇతర హారాల వంటి బంగారు కంఠాభరణాలతో అలంకరించి గజవాహనసేవ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, టీటీడీ తరఫున టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి వైవీ స్వర్ణలతారెడ్డి స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. యాదాద్రీశుడి ప్రధానాలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం మంత్రి దంపతులు, కుటుంబ సభ్యులు, తన నియోజకవర్గ ప్రజల తరఫున రూ.99,08,454 ఈవో గీతారెడ్డికి అందజేశారు.శ్రీస్వామి వారి కల్యాణోత్సవం సందర్భంగా మహామండపంలోని కల్యాణమూర్తు ల ముందు మంత్రి రూ.36,01,454 చెక్కులు, రూ.63,07,000 నగదు రూపంలో ఈవోకు ఇచ్చారు. టీటీడీ తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు అందజేస్తున్న స్వర్ణలతారెడ్డి సీఎం పర్యటన రద్దు యాదాద్రీశుడి సన్నిధికి ఉదయం రావాల్సిన సీఎం కేసీఆర్ పర్యటన రద్దయింది. స్వామివారి తిరు కల్యాణంలో సతీసమేతంగా పాల్గొని, ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారని ముందుగా అధికారులు ప్రకటించారు. అయితే, అనారోగ్య సమస్యతో సీఎం పర్యటన 10 గంటలకు రద్దయినట్లు ప్రకటించారు. -
ఏప్రిల్ 8 నుంచి భద్రాద్రి ‘తిరుకల్యాణం’
ఏప్రిల్ 15న శ్రీరామనవమి.. 16న శ్రీరామ మహాపట్టాభిషేకం భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 8 నుంచి 21 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు దేవస్థానం అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ఏప్రిల్ 8న దుర్ముఖి నామ సంవత్సరాది సందర్భంగా రామాలయంలో ఉగాది వేడుకలను నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈఓ కూరాకుల జ్యోతి, ఆలయ ప్రధానార్చకుడు పొడిచేటి జగన్నాథాచార్యులు తెలిపారు. ఆ రోజు ఆలయంలో నూతన పంచాగ శ్రవణం ఉంటుందని, శ్రీసీతారామచంద్రస్వామి వారికి తిరువీధి సేవ నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్ 11న బ్రహ్మోత్సవ అంకురార్పణ, 21న చక్రతీర్థం, ధ్వజావరోహణం వేడుకలుంటాయని తెలిపారు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పోలింగ్ ప్రారంభం.. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు..
నాలుగో దశ ఎలక్షన్స్.. ఆసక్తికర విషయాలు
మన లక్ష్యం ఏమిటి? అందుకు చేయవలసిన పనేమిటి?
అందరూ తప్పకుండా ఓటు వేయండి..సీఎం జగన్ ట్వీట్
చేతిలోని బ్రహ్మాస్త్రాన్ని వినియోగించుకోవాలి..
ఉత్తరప్రదేశ్లో పోలింగ్ ప్రారంభం.. బారులు తీరిన ఓటర్లు!
మేం ఓటేశాం.. మరి మీరో?(ఫొటోలు)
గూగుల్కు ఓటింగ్ శోభ!
క్యూలో నిలబడిన విజయ సాయి రెడ్డి
Lok sabha elections 2024: సామాన్యుడిలా క్యూలో నిలబడి ఓటేసిన ఎన్టీఆర్, అల్లు అర్జున్
తప్పక చదవండి
- నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ వస్తే.. ఏమవుతుందో తెలుసా?
- నయవంచనకు చెక్ పెడదాం
- ఈసీ ద్వంద్వ వైఖరి
- జనస్వామ్యమా! జయీభవ!!
- మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
- వైఎస్ విజయమ్మ పేరుతో టీడీపీ తప్పుడు లేఖ
- ఐరాస కాంక్షించే అభివృద్ధికి ఏపీయే వేదిక
- పేదింటి పిల్లలకు వర్సిటీ చదువులు ఉచితం
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- జగన్ ఒక నిజం... ఒక భావోద్వేగం
Advertisement