breaking news
tatttoo
-
గుండెలపై ఆమె పేరు టాటూ వేయించుకున్న నటుడు
ప్రేమకు నిలువెత్తు రూపం అమ్మ. ఎంత ఎదిగినా, ఎన్ని సాధించినా, ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా అమ్మ ముందు మాత్రం చంటిపిల్లల్లా మారిపోతుంటారు అందరూ. మన జీవితం కోసం తన జీవితాన్ని ధారపోసే అమ్మకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము, కేవలం ఆ మాతృమూర్తిని గుండెల్లో పెట్టుకొని చూసుకోవడం తప్ప. అయితే బాలీవుడ్ నటుడు ప్రతీక్ బాబర్ తన తల్లిని గుండెల మీద శాశ్వతంగా ఉండేలా చూసుకున్నాడు. తన తల్లి, దివంగత నటి స్మిత పాటిల్ పేరును పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఇతడికి తన తల్లి చేత గోరుముద్దలు తినే భాగ్యం కూడా కలగలేదు. 31 ఏళ్ల వయసులో ప్రతీక్కు జన్మనిచ్చిన రెండు వారాలకే ఆమె కన్నుమూసింది. తల్లి ప్రేమకు నోచుకోలేని అతడు ఇప్పటికీ అమ్మ కోసం పరితపిస్తూనే ఉంటాడు. అందుకే ఆమె పేరును శాశ్వతంగా తన ఎదరపై ఉండేలా టాటూ వేయించుకున్నాడు. View this post on Instagram A post shared by prateik babbar (@_prat) స్మిత పేరు కింద ఆమె పుట్టిన సంవత్సరం వేయించుకున్న అతడు మరణ సంవత్సరాన్ని మాత్రం రాయించుకోలేదు. దానికి బదులుగా ఆమె ఇంకా తనతోనే ఉందన్నట్లుగా అనంతం అన్న పదాన్ని సూచించే గుర్తు వేసుకున్నాడు. అతడు చేసిన పనికి అభిమానులు, స్నేహితులు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. కాగా ఇమ్రాన్ హష్మీ, జాన్ అబ్రహాం ప్రధాన పాత్రల్లో నటించిన ముంబై సాగాలోని ఓ పాత్రలో ప్రతీక్ బాబర్ కనిపించాడు. జానే తు యా జానేనా, దమ్ మారో దమ్, ఏక్ దీవానా తా వంటి పలు సినిమాల్లో నటించాడు. చదవండి: సోనూసూద్ ఔదార్యం.. పసిబిడ్డకు ప్రాణం పోశాడు! ఎనిమిదోసారి మిస్.. లైట్ తీస్కో భయ్యా..! -
హీరోయిన్ ఆ టాటూను చెరిపేస్తోంది!
సెలబ్రిటీలు అభిమానుల నిఘాకళ్లను తప్పించుకోవడం కొచెం కష్టమే. ప్రేమలో మునిగితేలుతున్న సమయంలో వారు ఒంటిపై వేసుకునే టాటూలపై అభిమానులు కన్ను సహజంగానే ఉంటుంది. అయితే ఇలాంటి జంటలు విడిపోయాక చెరిపేసుకునే టాటూలను సైతం అభిమానులు గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అభిమానుల కళ్లు హాలీవుడ్ హీరోయిన్ ఏంజెలినా జోలీ టాటూపై పడ్డాయి. భర్త బ్రాడ్ పిట్తో తన అనుబంధానికి గుర్తుగా గతంలో టాటూ వేయించుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు మా ఇద్దరికీ కుదరదు అంటూ కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య ఇప్పుడు దూరం పెరగడంతో అతడికి సంబంధించిన టాటూ సైతం ఒంటిపై ఉండటానికి వీలులేదని ఏంజెలినా భావిస్తోంది. దీంతో.. బ్రాడ్ పిట్ గుర్తుగా ఉన్న టాటూను తొలగించుకోవాలని డిసైడైందని సమాచారం. అయితే.. గతంలో మాజీ భర్త బిల్లీ బాబ్ టాటూను సైతం విడిపోయిన తరువాత ఏంజిలీనా తొలగించింది. బాలీవుడ్ భామ దీపికా పదుకొనే సైతం రణ్బీర్తో అనుబంధానికి గుర్తుగా వేయించుకున్న 'ఆర్కే' టాటూను బ్రేక్అప్ తరువాత తొలగించడానికి నానా తంటాలు పడిన విషయం తెలిసిందే.