ఎయిడ్స్ కథలో...
జాతీయ అవార్డులు సాధించిన తమిళ చిత్రం ‘కాంజీవరమ్’ దర్శకుడు ప్రియదర్శన్, హీరో ప్రకాశ్రాజ్ మరోసారి కలసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ‘కాంజీవరమ్’లో ప్రకాశ్ రాజ్ సరసన నటించిన శ్రీయారెడ్డే ఈ కొత్త చిత్రంలోనూ నాయిక. గతంలో ‘అప్పుడప్పుడు’, ‘పొగరు’ చిత్రాలతో వైవిధ్యమైన నటిగా పేరు తెచ్చుకున్న ఆమె పెళ్లయ్యాక సినిమాలకు దూరంగా ఉంటున్నారు. సెకండ్ ఇన్నింగ్స్లో ఆమె చేసిన తొలి చిత్రం ‘కాంజీవరమ్’. ఈ కొత్త చిత్రం ఎయిడ్స్ వ్యాధి నేపథ్యంలో సాగుతుంది.
శ్రీయారెడ్డి మలి చిత్రం కూడా ప్రియదర్శన్ దర్శకత్వంలో కావడం, కమర్షియల్ ఫార్మెట్లో సాగే ప్రయోజనాత్మక చిత్రం కావడం, తన పాత్ర కూడా బాగుండడం వల్ల ఈ చిత్రాన్ని పచ్చజెండా ఊపారామె. ‘‘ముగ్గురి జీవితాల చుట్టూ తిరిగే కథ ఇది. అందరి జీవితాలకు కనెక్ట్ అయ్యేలా, మానవీయ కోణాలను స్పృశించే కథ. ‘కాంజీవరమ్’కి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో బాగా పేరు వచ్చింది గానీ సామాన్య ప్రేక్షకులకు చేరువ కాలేదు. కానీ ఈ సినిమా ‘కాంజీవరమ్’ స్థాయిలో ఉంటూనే, అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని శ్రీయారెడ్డి పేర్కొన్నారు.