breaking news
Tamaulipas
-
రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి
మెక్సికో: మెక్సికో ఈశాన్య రాష్ట్రమైన తములిపాస్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు - ట్రాక్టర్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారని ఆ రాష్ట్ర అటార్నీ జనరల్ కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారని చెప్పింది. అలాగే మృతుల్లో ఐదుగురిని గుర్తించినట్లు పేర్కొంది. ఈ ప్రమాదంలో గాయపడని వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అటార్నీ జనరల్ కార్యాలయం చెప్పింది. -
కిడ్నాపర్లు చెర నుంచి 44 మంది బందీలు విడుదల
రేనోసా బస్సు టెర్మినల్లో ఇటీవల కిడ్నాప్నకు గురైన 44 మందిని కిడ్నాపర్ల చెర నుంచి సురక్షితంగా రక్షించినట్లు రేనోసా ఉన్నతాధికారులు ఆదివారం ఇక్కడ వెల్లడించారు.రేనోసా ఈశాన్య ప్రాంతంలోని ఓ ఇంట్లో వారంతా బందీలుగా ఉన్నారని తెలిపారు.అయితే వారిలో ఓ మహిళ తమను రక్షించండంటూ గట్టిగా అరుస్తున్న అరుపులు అటువైపుగా గస్తీ తిరుగుతున్న పోలీసులకు వినిపించాయి.దాంతో గస్తీ పోలీసులు ఆ నివాసానికి చేరుకుని బందీలుగా ఉన్న 44 మందిని రక్షించినట్లు చెప్పారు. బందీలలో 24 మంది మెక్సికన్లు, 14 మంది హుండరస్ వాసుల్లో ఐదుగురు మైనర్లుతోపాటు సెల్వడార్కు చెందిన వ్యక్తి, గ్వాటిమాల,బెలిజియన్ దేశాలకు చెందిన ఇద్దరు మహిళలు ఉన్నారని తెలిపారు. ఇటీవల రేనోసా నగరంలోని బస్ టెర్మినల్ వద్ద వారందరిని కిడ్నాప్ చేశారు. తమ వద్ద బందీలుగా ఉన్న వారిని విడుదల చేయాలంటే అధిక మొత్తంలో నగదు చెల్లించాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. తాములిపాస్ రాష్ట్ర సరిహద్దుల్లో రేనోసా పట్టణం ఉంది.ఆ పట్టణంలో సరైన నివాస ప్రతాలు లేని వలసదారులపై స్థానికులు తరచుగా దాడులు, అత్యాచారాలు,కిడ్పాప్లు చేస్తున్న విషయం విదితమే.