breaking news
Swraj Paul
-
'పెంట్హౌజ్ మీద నుంచి పడ్డ పారిశ్రామికవేత్త'
లండన్: ఎన్నారై పారిశ్రామిక వేత్త స్వరాజ్ పాల్కు పుత్ర శోకం కలిగింది. ఆయన కుమారుడు కపారో గ్రూప్ సీఈవో అంగద్ పాల్ ఎనిమిదంతస్తుల భవనం మీద ఉన్న పెంట్ హౌజ్ నుంచి పడి తీవ్రగాయాలపాలై ప్రాణాలుకోల్పోయారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం సాధారణ మరణంగా భావించలేమని అందుకే అనుమానిత మృతిగా కేసు నమోదుచేసుకున్నామని లండన్ పోలీసులు తెలిపారు. ఇటీవల ఉక్కు ధరలు అమాంతం పడిపోవడంతో వారి కంపెనీ కపారో తీవ్ర ఒడిదుడుకుల్లోకి వెళ్లిపోయింది. దాదాపు ఈ కంపెనీకి చెందిన 16 కార్యాలయాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. పదేళ్ల కిందట ఓ మీడియా సంస్థకు న్యాయవాదిగా పనిచేస్తున్న మెషెల్లీ బోన్ అనే మహిళను అంగద్ పాల్ వివాహం చేసుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థకు 40 కంపెనీలు, పది వేలమంది ఉద్యోగులు ఉన్నారు. ఈ కంపెనీల్లో కార్లకు సంబంధించిన పనిముట్లు, స్టీలు పైపులు, డిజైనింగ్ వస్తువులు, ఫిల్మ్ లు తయారవుతుంటాయి. కంపెనీ ఆర్థిక సమస్యలు మధ్య ఉండగా ఆయన ఎనిమిదో అంతస్తు మీద నుంచి పడి ప్రాణాలుకోల్పోవడం ప్రస్తుతం అనుమానం కలిగిస్తోంది. -
మోదీకి స్వరాజ్ పాల్ ప్రశంస
న్యూఢిల్లీ: వ్యాపారాలకు అనువైన దేశాల్లో భారత్ను మెరుగైన స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారని ప్రవాస భారతీయ పారిశ్రామిక దిగ్గజం లార్డ్ స్వరాజ్ పాల్ ప్రశంసించారు. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఇందుకు నిదర్శనమన్నారు. యూనివర్సిటీ ఆఫ్ వోల్వర్హాంప్టన్లో జరిగిన కార్యక్రమంలో చాన్సలర్ హోదాలో పాల్గొన్న సందర్భంగా పాల్ ఈ విషయాలు తెలిపారు. భారత మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో తాము కూడా తోడ్పాటు అందిస్తామన్నారు. ఇందుకు సంబంధించి వర్సిటీ పోషించతగిన పాత్రపై ఇటీవలే కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీతో చర్చించినట్లు ఆయన వివరించారు.