Swiss Aircraft
-
‘టేకాఫ్’లో దట్టమైన పొగలు: తప్పిన విమాన ప్రమాదం
న్యూఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంలో ఆదివారం వేకువజామున ప్రమాదం చోటుచేసుకుంది. జ్యూరిచ్ బయలుదేరిన స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారిగా ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తి మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పైలట్లు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని రన్వేపైనే నిలిపివేసి, పెను విషాదాన్ని తప్పించారు.ఇంజిన్లో మంటలు.. భయాందోళనలువివరాల్లోకి వెళితే.. స్విస్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం (LX147) 228 మంది ప్రయాణికులు, నలుగురు చిన్నారులతో జ్యూరిచ్ వెళ్లేందుకు సిద్ధమైంది. విమానం రన్వేపై వేగం పుంజుకుంటున్న సమయంలో ఒక ఇంజిన్లో సమస్య ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. అదే సమయంలో విమానం నుంచి దట్టమైన పొగలు రావడంతో, లోపల ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పరిస్థితి తీవ్రతను పసిగట్టిన పైలట్లు వెంటనే టేకాఫ్ ప్రక్రియను నిలిపివేశారు.ఎమర్జెన్సీ ప్రకటన.. ప్రయాణికుల తరలింపుఈ ఘటనతో ఢిల్లీ ఎయిర్పోర్టులో అధికారులు తక్షణమే ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. భద్రతా ప్రోటోకాల్స్ అమలు చేస్తూ, ప్రయాణికులను, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఎవరికీ ఎలాంటి తీవ్రమైన ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.యథావిధిగా విమాన సేవలు.. దర్యాప్తు షురూవిమానాశ్రయం రన్వే 28/10 పై ఈ ప్రమాదం జరిగినప్పటికీ, ఎయిర్పోర్టులో ఇతర విమానాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సాంకేతిక బృందాలు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, ఇంజిన్ వైఫల్యానికి గల కారణాలను విశ్లేషిస్తున్నాయి. మరోవైపు ఈ అసౌకర్యానికి గురైన ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానాలు, బస ఏర్పాట్లను కల్పించేందుకు ఎయిర్లైన్స్ యాజమాన్యం చర్యలు చేపట్టింది.ఇది కూడా చదవండి: ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదు: ప్రధాని మోదీ -
స్విస్ విమానంలో పొగలు.. అత్యవసర ల్యాండింగ్
జ్యూరిచ్:గత వారం తమ సంస్థకు చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ తెలిపింది. ఇంజిన్లో లోపం కారణంగా విమానంలో పొగలు వచ్చాయని ఈ ఘనటనలో ఆస్పత్రి పాలైన విమాన సిబ్బంది ఒకరు మృతి చెందారని వెల్లడించింది. ఈమేరకు ఎయిర్లైన్స్ సీఈవో మీడియాతో మాట్లాడారు.‘బుకారెస్ట్ నుంచి జ్యూరిచ్ వెళుతుండగా మా ఎయిర్బస్ ఎ220 విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. వెంటనే విమానాన్ని గ్రాజ్ నగరంలో అత్యవసర ల్యాండింగ్ చేశాం. విమానంలో పొగలు రావడం వల్ల అస్వస్థతకు గురైన ప్రయాణికులు,సిబ్బందిని ఆస్పత్రిలో చేర్చాం. వీరిలో మా సిబ్బంది ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందడం షాక్కు గురిచేసింది’అని స్విస్ ఎయిర్లైన్స్ సీఈవో ఫెలింగర్ తెలిపారు. సాంకేతిక లోపం ఏర్పడినపుడు విమానంలో 74 మంది ప్రయాణిస్తున్నారు. పొగల కారణంగా సిబ్బంది సహా మొత్తం 12 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇదీ చదవండి: విమానంలో ఏ సీటు భద్రం -
ఆ నేడు 3 సెప్టెంబర్ 1976
గాలిలో లేచిన గంటకే... న్యూయార్క్ నుంచి జెనీవా బయల్దేరిన స్విస్ ఎయిర్క్రాఫ్ట్... గాలిలో లేచిన గంటకు నోవా స్కాటియా సముద్రతీర ప్రాంతంలో కూలిపోయింది. మెక్డొన్నెల్ డగ్లాస్ ఎం.డి-11 అనే ఆ స్కాటిష్ విమానంలో ప్రయాణిస్తున్న 229 మందీ ఆ దుర్ఘటనలో మరణించారు. అయితే విమానం ఎందుకు కూలిపోయిందనే దానిపై స్పష్టత రాలేదు. దీని వెనుక ఉగ్రవాదుల హస్తం ఉండొచ్చని తాము భావించడం లేదని యు.ఎస్. ఇంటెలిజెన్స్ ప్రకటించింది. క్యాబిన్ నుంచి పొగలు వచ్చాయని, ఆ తర్వాత కొద్దిసేపటికే విమానం కూలిపోయిందని రెస్క్యూ టీమ్ నివేదికను అందజేసింది.


