breaking news
Suzuki Motorcycle India Company
-
సుజుకి మోటార్సైకిల్ కంపెనీపై సైబర్ అటాక్ - నిలిచిపోయిన ఉత్పత్తి
Cyber Attack: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ 'సుజుకి మోటార్సైకిల్ ఇండియా' గత కొంత కాలంగా ఫ్యాక్టరీలలో ఉత్పత్తిని నిలిపివేసింది. సైబర్ దాడుల కారణంగానే ఉత్పత్తి నిలిచిపోయినట్లు కంపెనీ ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిలిచిపోయిన ఉత్పత్తి.. నివేదికల ప్రకారం, 2023 మే 10 నుంచి సుజుకి మోటార్సైకిల్ ఉత్పత్తిని నిలిపివేసింది. ఫ్యాక్టరీలో ఉత్పత్తి నిలిచిపోవడంతో ఈ కాలంలో దాదాపు 20,000 వాహనాల ఉత్పత్తి నిలిచిపోయినట్లు సమాచారం. అంతే కాకుండా వచ్చే వారం జరగాల్సిన వార్షిక సరఫరాదారుల సమావేశాన్ని కూడా సంస్థ వాయిదా వేసింది. దీని గురించి సుజుకి మోటార్సైకిల్ ఇండియా ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే సంబంధిత ప్రభుత్వ విభాగానికి నివేదించామని, ప్రస్తుతం దీనిపైనా విచారణ జరుగుతోంది, భద్రతా ప్రయోజనాల దృష్ట్యా దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అందించలేమని అన్నారు. అయితే మళ్ళీ ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయం కూడా ప్రస్తావించలేదు. కానీ త్వరలోనే ఉత్పత్తి ప్రారంభమవుతుందని భావిస్తున్నాము. (ఇదీ చదవండి: ఉద్యోగం పోతుందని భయమా? ఈ టిప్స్ మీకోసమే..!) భారతదేశంలో అతిపెద్ద వాహన తయారీ సంస్థగా కీర్తి పొందిన సుజుకి మోటార్సైకిల్ ఇప్పటికే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మిలియన్ యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. అంతే కాకుండా కంపెనీకి భారత్ మాత్రమే కాకుండా జపాన్ కూడా అతిపెద్ద మార్కెట్ కావడం విశేషం. సుజుకి మోటార్ కార్పొరేషన్ గ్లోబల్ అవుట్పుట్లో భారతదేశం 50% వాటాను కలిగి ఉంది. అంతే కాకుండా గత ఆర్థిక సంవత్సరం కూడా అమ్మకాల్లో మంచి వృద్ధిని సాధించగలిగింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
సుజుకి హయబుసా -2019 ఎడిషన్ లాంచ్
సాక్షి,న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీదారుమారుతి సుజుకి అనుబంధ సంస్థ సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఎంఐపీఎల్) తన పాపులర్ బైక్లో కొత్త ఎడిషన్ను విడుదల చేసింది. ఖరీదైన స్పోర్ట్స్ బైక్ హయబుసా 2019 ఎడిషన్ను గురువారం ప్రారంభించింది. భారతీయ పరిస్థితులకు అనుగుణంగా, అప్డేటెడ్ గ్రాఫిక్స్తో మెటాలిక్ ఓర్ట్ గ్రే , గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ రెండు కొత్త రంగులలో హయాబూసా 2019 ఎడిషన్ను సుజుకి తీసుకొచ్చింది. దీని ధరను రూ. 13.74 లక్షలుగా (ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ) నిర్ణయించింది. తమ అన్ని డీలర్షిప్ల ద్వారా ఈ బైక్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. దాదాపు రెండు దశాబ్దాలుగా స్పోర్ట్స్ బైక్లలో సుజుకి హయాబూసాకు భారతదేశంలో అద్భుతమైన స్పందన లభించిందనీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సతోషి ఉచిడా వెల్లడించారు. ఇండియాలోని బైక్ లవర్స్కోసం 2019 ఎడిషన్ను రెండు కొత్త రంగుల్లో,మరింత ఆకర్షణీయంగా తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. -
సుజుకీ విక్రయాల్లో 6% వృద్ధి
హైదరాబాద్: సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా కంపెనీ మార్చి నెల టూవీలర్ల అమ్మకాలు 6 శాతం వృద్ధిని సాధించాయి. గత ఏడాది మార్చిలో 30,594 టూవీలర్లను విక్రయించగా, ఈ ఏడాది మార్చిలో 32,431 టూవీలర్లను అమ్మామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గత రెండు సంవత్సరాలుగా అమ్మకాల్లో నిలకడైన వృద్ధిని సాధిస్తున్నామని సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ గుప్తా పేర్కొన్నారు.