breaking news
Surprising Elements
-
భారత్లో అలాంటి నిషేధం వద్దా?
స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగాక.. సోషల్ మీడియా మత్తులో జనం మునిగిపోతున్నారు. చిన్నా పెద్దా తేడాలేకుండా.. గంటల తరబడి కాలం గడిపేస్తున్నారు. యూట్యూబ్-ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని, మీమ్స్ అని.. ఇలా రాత్రి, పగలు తేడా లేకుండా సోషల్ మీడియా సైట్లలోనే గడిపేస్తున్నారు. ఈ విషయంలో పిల్లలనూ తల్లిదండ్రులు కట్టడి చేయలేకపోతున్నారు. అందుకే విప్లవాత్మక మార్పులో భాగంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ వాడకంపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇదే బాటలో.. యూరోపియన్ యూనియన్తో మలేషియాలోనూ బ్యాన్పై చర్చ జరుగుతోంది. అయితే పూర్తి స్థాయి నిషేధం కాకపోయినా.. ఫ్రాన్స్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో నియంత్రణకు చట్టాల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ స్పూర్తితో భారత్లోనూ అలాంటి నిర్ణయం జరగాలన్న అభిప్రాయాల్ని ఓ సర్వే తోసిపుచ్చింది. భారత్లో అలాంటి నిషేధం వద్దనే చాలామంది తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారట!!..పిల్లల విషయంలో సోషల్ మీడియా వాడకంపై అభిప్రాయం కోరుతూ Ipsos, Statista సంయుక్తంగా ‘గ్లోబల్’ సర్వే నిర్వహించాయి. ఇందులో 30 దేశాలకు చెందిన వేల మంది తల్లిదండ్రులు ఫీడ్ ఇచ్చారు. ఇందులో పాల్గొన్న 70 శాతం మంది నియంత్రణ సబబేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అత్యధికంగా ఇండోనేషియా ఆ తర్వాత ఫ్రాన్స్, ఆస్ట్రేలియా నుంచి ఈ ఒపీనియన్ వెల్లడైంది. అయితే.. భారత్ నుంచి మాత్రం మిశ్రమ స్పందన లభింaచింది. వందలో 68 మంది మాత్రమే చిన్నారులకు సోషల్ మీడియా కట్టడిని సమర్థించారు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే.. కిందటి ఏడాది ఇది 73 శాతం ఉంది. అంటే.. ఇప్పుడు 5 శాతానికి తగ్గిపోయిందన్నమాట.ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నప్పటికీ.. పూర్తి నిషేధం సబబు కాదనే అభిప్రాయం తాజా సర్వేలో ఇండియన్ పేరెంట్స్ నుంచి వ్యక్తమైంది. బ్యాన్కి బదులు మార్గదర్శకత్వం అవసరం అనే అభిప్రాయం కూడా పెరుగుతోంది. సోషల్ మీడియా వల్ల పిల్లలు ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్నారు. అలాగే మా నుంచి కూడా పరిమితులు ఉండాల్సిన అవసరం ఉంది.:హైదరాబాద్కు చెందిన ఓ తల్లినిషేధం సబబు కాదు. దాని కంటే సరైన గైడ్లైన్స్ మీద దృష్టి పెట్టాలి: బెంగళూరుకు చెందిన ఓ తండ్రిభద్రతా సమస్యలు ఉన్నా సో.మీ.ను పూర్తిగా నిషేధించడం సమర్థనీయం కాదు: ఢిల్లీకి చెందిన తల్లిదండ్రులుసోషల్ మీడియా వినియోగం అనేది పిల్లల వికాసం, అవగాహన కోసం ఉపయోగపడుతుందని కొంతమంది తల్లిదండ్రుల అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. భారత్కు డిజిటల్ వాతావరణానికి బాగా అలవాటు పడిపోయింది. విద్యా, వ్యాపార అభివృద్ధి, కమ్యూనిటీ నిర్మాణం లాంటి రంగాల్లో ఎక్కువగా సోషల్ మీడియా వినియోగం ఉంటోంది. మరీ ముఖ్యంగా.. యూత్ కల్చర్లో లోతుగా కలిసిపోయింది. అందుకే ఎక్కువ మంది తల్లిదండ్రులు కఠిన నియంత్రణలు అవసరమని భావిస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికితోడు ఇక్కడి ప్రభుత్వాలు కూడా.. నిషేధం కంటే నియంత్రణ మీదే(వయస్సు ధృవీకరణ, డిజిటల్ విద్యా అవగాహన, తల్లిదండ్రుల పర్యవేక్షణ లాంటి అంశాలు) ఎక్కువ దృష్టిసారిస్తున్నాయనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మరోవైపు.. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు కూడా పిల్లల విషయంలో హానికరమైన కంటెంట్, అల్గోరిథం విషయంలో నియంత్రణలకు సిద్ధంగానే ఉన్నట్లు సూచన ప్రాయంగా చెబుతున్నాయి. జర్మనీలో.. భారత్కు విరుద్ధమైన పరిస్థితి కనిపించింది. సోషల్ మీడియా నిషేధానికి మద్దతు ఇచ్చిన వారి శాతం అత్యల్పంగా 53% ఉన్నప్పటికీ, గత సంవత్సరం కంటే మద్దతు 13% పెరిగింది. ఇది పెరుగుతున్న అక్కడి తల్లిదండ్రుల ఆందోళనను, మారుతున్న పిల్లల ఆలోచనా ధోరణిని సూచిస్తోంది. -
బ్లాక్ హోల్.. 8వ ఖండం.. కొత్త దేశం..
ప్రపంచంలో ప్రతి ఏటా ఎన్నో వింతలు, విశేషాలు, అద్భుతాలు, ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటాయి. మనం రోజు చూసే పరిసరాలు కూడా ఒక్కోసారి వింతగా కనిపిస్తూ ఉంటాయి. ఓ సినీ రచయిత చెప్పినట్టు అద్భుతం జరిగే ముందు ఎవరూ గుర్తించరు.. జరిగిన తరువాత గుర్తించాల్సిన పని లేదన్నది అక్షర సత్యం అనిపిస్తుంది. అది ఈ ఏడాది కూడా రుజువైంది. కాలానుగుణంగా ఎన్నో అద్భుతాలు 2019లో చోటుచేసుకున్నాయి. అలాంటి కొన్ని విశేషాలను ఓ సారి గమనిస్తే.. 14 కోట్ల ఏళ్ల కిందట అమెరికా నుంచి విడిపోయి.. నెదర్లాండ్ శాస్త్రవేత్తలు 8వ ఖండాన్ని కనిపెట్టారు. గ్రేటర్ ఆడ్రియా అని దీనికి పేరు పెట్టిన శాస్త్రవేత్తలు.. 14 కోట్ల ఏళ్ల కిందట ఇది అమెరికా నుంచి విడిపోయి దక్షిణ ఐరోపా కిందకు చేరిపోయిందన్నారు. మధ్యధరా ప్రాంతంలోని భౌగోళిక శాస్త్ర పరిణామక్రమాన్ని శోధిస్తుండగా.. ఈ ఖండం కనిపించగా, ఆడ్రియాటిక్ సముద్రం నుంచి ఇటలీ వరకూ విస్తరించి ఉండగా, ఈ ప్రాంతాన్ని భూగర్భశాస్త్రవేత్తలు ఆడ్రియగా పిలుస్తున్నారు. అకలి ఎంత పనైనా చేయిస్తుంది.. అకలి ఎంత పనైనా చేయిస్తోందంటారు. అందుకు నిదర్శనంగా ఓ ఆర్కిటిక్ నక్క.. మంచుగడ్డల్లో ఆహారం కోసం 3500 కి.మీ దూరాన్ని 76 రోజుల్లో ప్రయాణించి రికార్డు సాధించింది. నార్వే లోని స్వాల్బార్డ్ అనే ద్వీప సమూహం నుంచి బయలుదేరి కెనడా లోని ఉత్తర నునవట్ ద్వీపాల్లో ఒక దానికి చేరుకోడంతో దాని ప్రయాణం ముగిసింది. ఈ పరిణామం 2018లో జరిగినప్పటికీ.. ఈ ఏడాది శాస్త్రవేత్తలు అధికార ప్రకటనతో వెలుగులోకి వచ్చింది. నెల రోజుల్లోనే రెండు కాన్పులు.. ఓ మహిళ నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. బంగ్లాదేశ్కు చెందిన అరీఫా సుల్తానా ఫిబ్రవరి నెలలు నిండని మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే తల్లీబిడ్డ క్షేమంగా ఉండటంతో వైద్యులు ఇంటికి పంపారు. అయితే 26 రోజుల తర్వాత అరీఫా మళ్లీ నొప్పులు రావడంతో.. కుటుంబ సభ్యులు ఆమెను ఇంకొక హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడ అరీఫాను పరీక్షించిన వైద్యులు.. ఆమె గర్భంలో ఇద్దరు కవలలు ఉన్నట్టు గుర్తించి ఆమె సిజేరియన్ చేశారు. ఆ పిల్లలు ఎలాంటి సమస్యలు లేకుండా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు వైద్యులు తెలిపారు. చంద్రయాన్-2 విఫలమైనప్పటికీ.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) పత్రిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ జాబిల్లి ఉపరితలంపై దిగుతుండగా చివరి క్షణాల్లో కుప్పకూలిపోయింది. అయితే ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో విజయవంతం కాకపోయినప్పటికీ మంచి ఫలితాల్నే ఇచ్చిందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా, విక్రమ్ ల్యాండర్ జాడ కోసం అంతరిక్ష శాస్త్రవేత్తలు, సంస్థలు శోధనలు జరిపినప్పటికీ.. నాసా ఎల్ఆర్వో పంపిన ఫోటోల ఆధారంగా చెన్నైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ షణ్ముగం సుబ్రమణ్యం (33) జాబిల్లిపై దాని శకలాలను విశేషం. పండటి బిడ్డలకు జన్మనిచ్చిన వృద్ధురాళ్లు.. 70 ఏళ్లలో పండంటి బిడ్డలకు జన్మనివ్వడం ద్వారా భారత్కు చెందిన ఇద్దరు భామ్మలు అందరి దృష్టిని ఆకర్షించారు. 75 ఏళ్ల వయసులో రాజస్తాన్కు చెందిన ప్రభాదేవి అనే బామ్మ గర్భం దాల్చి పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఓ వృద్ధురాలు మంగాయమ్మ 73 ఏళ్ల వయసులో కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఐవిఎఫ్ ప్రక్రియ ద్వారా వీరు పిల్లలకు జన్మనిచ్చారు. ఫొటోకు చిక్కిన బ్లాక్ హోల్ ఖగోళ చరిత్రలో సంచలన ఆవిష్కరణ చోటుచేసుకుంది. శాస్త్రవేత్తలు తొలిసారిగా ఓ కృష్ణ బిలాన్ని(బ్లాక్ హోల్ని) ఫొటో తీశారు. భూమికి 5.5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఎమ్87 గెలాక్సీలో ఈ కృష్ణ బిలం ఉంది. బ్రిడ్జి కింద చిక్కుకున్న విమానం.. చైనాలోని హార్బిన్లో ట్రక్కుపై తరలిస్తున్న ఓ విమానం బ్రిడ్జి కింద చిక్కుకుపోయింది. రోడ్డుపై ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకుండా విమానం రెక్కలు తొలగించినప్పటికీ.. దురదృష్టవశాత్తూ ఆ వాహనం వంతెన కింద ఇరుక్కుపోయింది. ఆ తర్వాత ట్రక్కు టైర్లలో గాలిని తగ్గించి.. ఆ తర్వాత నెమ్మదిగా వాహనాన్ని ముందుకు కదిలించారు. దీంతో విమానం బ్రిడ్జి కింది నుంచి బయటికి వచ్చింది. ఉత్తర కొరియా గడ్డపై ట్రంప్.. ఉత్తర, దక్షిణ కొరియా దేశాల రిహద్దుల మధ్య ఉన్న నిస్సైనిక మండలం(డీఎంజెడ్)లోని పన్మున్జొమ్ గ్రామంలో ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్తో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమావేశమయ్యారు. పదవిలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ఉత్తర కొరియా రావడం ఇదే మొదటిసారి. కొత్త దేశంగా బౌగెన్విల్లే! ప్రపంచ పటంలో కొత్త దేశం ఏర్పడనుంది. దక్షిణ పసిఫిక్ రీజియన్లోని బోగన్విల్లె ద్వీపం త్వరలోనే స్వతంత్ర దేశంగా అవిర్భనుంచనుంది. పపువా న్యూ న్యూగినియా నుంచి స్వాతంత్య్రం కోరుతూ ఈ ఏడాది డిసెంబర్లో నిర్వహించిన రిఫరెండంలో 98 శాతం మంది స్వతంత్ర దేశానికే ఓటు వేశారు. కర్తార్పూర్ కారిడార్ ప్రారంభం పంజాబ్లోని డేరా బాబా నానక్ను పాకిస్తాన్లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాతో కలిపే కర్తార్పూర్ కారిడార్ నవంబర్ 9న ప్రారంభమైంది. సిక్కులు పవిత్ర పుణ్యక్షేత్రంగా భావించే కర్తార్పూర్ మందిరం.. 1947లో భారత్ను రెండు విభజించిన సమయంలో పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లిపోయింది. ఒకే కాన్పులో ఏడుగురు జననం ఓ మహిళ ఒకే కాన్పులో ఏడుగురు శిశువులకు జన్మనిచ్చారు. ఈ అరుదైన ఘటన తూర్పు ఇరాక్లో చోటుచేసుకుంది. వారిలో ఆరుగురు ఆడపిల్లలు కాగా, ఒక మగ పిల్లాడు ఉన్నారు. ఇరాక్లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇదే తొలిసారి అని అక్కడి వైద్యులు తెలిపారు. టెస్లా సైబర్ ట్రక్.. ప్రముఖ కార్ల కంపెనీ టెస్లా.. సైబర్ట్రక్ పేరుతో ఎలక్ట్రిక్ పికప్ట్రక్ను పరిచయం చేసింది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ వాహనానికి కేవలం నాలుగు రోజుల్లోనే 1.87 లక్షల ఆర్డర్లు వచ్చాయి. సైబర్ట్రక్ లాంఛ్ సందర్భంగా పనితీరును పరీక్షిస్తున్న సమయంలో రాయి వెహికల్ గ్లాస్ అద్దాలు బద్దలైనా రికార్డుస్ధాయిలో ఆర్డర్లు వెల్లువెత్తాయి. ఈ ట్రక్ త్వరలోనే త్వరలోనే దుబాయ్ పోలీసుల వాహన శ్రేణిలో చేరనుంది. -కనుకుల సుమంత్, సాక్షి వెబ్డెస్క్ -
సర్ప్రైజింగ్ స్టోరీ
మరో ఛాయాగ్రాహకుడు మెగాఫోన్ పట్టారు. ‘కార్తికేయ’ చిత్రానికి ఛాయాగ్రహణం సమకూర్చిన కార్తీక్ ఘట్టమనేనిని దర్శకునిగా పరిచయం చేస్తూ నిఖిల్ హీరోగా ‘సూర్య వర్సెస్ సూర్య’ రూపొందుతోంది. బేబీ త్రిష సమర్పణలో మల్కాపురం శివకుమార్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకుంది. స్వామి రారా, కార్తికేయ చిత్రాల తరహాలో విభిన్నమైన ఇతివృత్తంతో వినోదాత్మకంగా ఈ సినిమా రూపొందుతోందని నిర్మాత తెలిపారు. ఇందులో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయని దర్శకుడు చెప్పారు. త్రిదా చౌదరి నాయికగా నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: సత్యమహవీర్, మాటలు: చందు మొండేటి


