-
మహిళకు బీజేపీ ఎమ్మెల్యే బెదిరింపులు.. వీడియో వైరల్!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబవళి తన ప్రవర్తనతో మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. తమ నిర్మాణాలను కూలగొట్టటాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన ఓ మహిళను ఎమ్మెల్యే బెదిరిస్తూ, తీవ్రంగా దూషించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎమ్మెల్యేను ప్రశ్నించిన మహిళను పోలీస్ స్టేషన్కు తరలించారు. కొద్ది సమయం తర్వాత తిరిగి ఇంటికి పంపించేశారు. అధికారిక పనులకు అడ్డుపడిన కారణంగా మహిళపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఏం జరిగిందంటే? ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బెంగళూరు మొత్తం నీట మునిగింది. ఈ క్రమంలో అక్రమ కట్టడాలను కూల్చే పనిలో పడ్డారు బెంగళూరు నీటి సరఫరా, మురుగు నిర్వహణ విభాగం అధికారులు. మురుగు నీటి కాలువపై నిర్మించారనే కారణంగా నల్లురహళ్లి ప్రాంతంలోని ఓ కమెర్షియల్ భవనం ప్రహరీ గోడను కూల్చేందుకు వచ్చారు. అయితే, ఆ భవనం యజమాని రత్ సగాయ్ మ్యారీ అమీలా అనే మహిళ దానిని వ్యతిరేకించారు. ప్రభుత్వ సర్వేయర్ సర్వే చేసిన తర్వాత, ప్రభుత్వ అనుమతులతోనే నిర్మించామని సూచించారు. అప్పటికే సగం ప్రహరీ గోడను అధికారులు కూల్చారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే లింబవళి.. అక్కడికి చేరుకున్నారు. కూల్చివేతలను ఆపాలని మహిళ వివరించే ప్రయత్నం చేశారు. పలు పత్రాలను చూపించారు. వాటిని ఆమె నుంచి లాక్కునేందుకు యత్నించారు ఎమ్మెల్యే. జైళ్లో పెట్టిస్తానని ఆమెను బెదిరించారు. అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. మహిళను అక్కడి నుంచి లాక్కెళ్లి చితకబాదాలని పోలీసులతో అంటున్నట్లు కెమెరాలో నమోదయ్యాయి. కాంగ్రెస్ ఆగ్రహం.. ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్దీప్ సుర్జేవాలా. మహిళల భద్రత కోసం కట్టుబడి ఉంటామన్న బీజేపీ కపటత్వం బయటపడిందన్నారు. ‘మీ పార్టీకి చెందిన అరవింద్ లింబవళి ప్రజాప్రతినిధిగా మహిళతో అనుచితంగా ప్రవర్తించిన తీరు క్షమించరానిది. బీజేపీ నేత క్షమాపణ చెప్పాలి.’ అని కన్నడలో రాసుకొచ్చారు. ಸ್ತ್ರೀ ಉದ್ಧಾರಕರಂತೆ ಕೇವಲ ಬೂಟಾಟಿಕೆಯ ಮಾತಾಡುವ ಬಿಜೆಪಿಗರೇ, ನಿಮ್ಮ ಪಕ್ಷದ ಅರವಿಂದ ಲಿಂಬಾವಳಿಯವರು ಒಬ್ಬ ಜನಪ್ರತಿನಿಧಿಯಾಗಿ ಮಹಿಳೆಯೊಂದಿಗೆ ಅನುಚಿತವಾಗಿ ನಡೆದುಕೊಂಡ ರೀತಿ ಅಕ್ಷಮ್ಯ. ಇಂಥ ಮಹಿಳಾ ವಿರೋಧಿ ನಡೆಯ ವಿರುದ್ಧ ಮಾತಾಡುವ ಧೈರ್ಯ ತೋರುತ್ತೀರಾ? ಅರವಿಂದ ಲಿಂಬಾವಳಿಯವರು ಆ ಹೆಣ್ಣಿನ ಕ್ಷಮೆ ಕೇಳುತ್ತಾರ?#MahilavirodhiBJP pic.twitter.com/SqRDKXsyif — Randeep Singh Surjewala (@rssurjewala) September 3, 2022 సుర్జేవాలా ట్వీట్కు స్పందిస్తూ తాను క్షమాపణ చెప్పేందుకు సిద్ధమేనని, అయితే, ఆ మహిళ కాంగ్రెస్ కార్యకర్త అని సూచించారు లింబవళి. ‘నేను క్షమాపణ చెప్పేందుకు సిద్ధమే. కానీ, మీ పార్టీ కార్యకర్త రత్ సగాయ్ మ్యారీ.. మురికి కాలువును చాలా ఏళ్లుగా ఆక్రమించారు. ప్రజలకు సమస్యలు సృష్టించారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయమని ఆమెను కోరండి. మొండితనంగా వ్యవహరించటం మాను కోవాలని సూచించండి.’ అంటూ ట్వీట్ చేశారు లింబవళి. వరదలకు సంబంధించిన చిత్రాలను పోస్ట్ చేశారు. ಈ ಬಗ್ಗೆ ನಾನು ಕ್ಷಮೆ ಕೇಳಲು ಸಿದ್ಧನಿದ್ದೇನೆ. ಆದರೆ ನಿಮ್ಮ ಪಕ್ಷದ ಇದೇ ಕಾರ್ಯಕರ್ತೆ ರೂತ್ ಸಗಾಯ್ ಮೇರಿ ಎಷ್ಟೋ ವರ್ಷಗಳಿಂದ ರಾಜಕಾಲುವೆ ಒತ್ತುವರಿ ಮಾಡಿ, ಜನರಿಗೆ ಸಮಸ್ಯೆಯುಂಟು ಮಾಡಿದ್ದಾರಲ್ಲ, ಅದನ್ನು ಖಾಲಿ ಮಾಡಲು ಹೇಳಿ. ನಿಮ್ಮ ಕಾರ್ಯಕರ್ತೆಯ ಮೊಂಡುತನವನ್ನು ಇಲ್ಲಿಗೇ ನಿಲ್ಲಿಸಲು ಹೇಳಿ. https://t.co/xveoqmXQK1 pic.twitter.com/18AdaTS0ta — Aravind Limbavali (@ArvindLBJP) September 3, 2022 ఇదీ చదవండి: ‘బీజేపీలో ఉంటూనే ‘ఆప్’ కోసం పని చేయండి’.. కార్యకర్తలకు కేజ్రీవాల్ పిలుపు! -
వినూత్న నిరసన.. ఇళ్ల ముందు 31న డప్పులు కొడుతూ బెల్స్ మోగించండి..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పెట్రో ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడి తర్వాత వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతీరోజు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్ తీరును ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ వినూత్న నిరసనలకు పిలుపునిచ్చింది. దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న ధరలు, ద్రవ్యోల్బణంపై కాంగ్రెస్ పార్టీ పోరుకు రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు దశల వారీగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా పెరుగుతున్న ధరలకు నిరసనగా.. మార్చి 31వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రజలందరూ తమ ఇళ్లు ముందు, బహిరంగ ప్రదేశాల్లో గ్యాస్ సిలిండర్లు ముందు పెట్టుకొని, డప్పులు కొడుతూ బెల్స్ మోగించాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సూర్జేవాలా మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం గత రెండేళ్లలో లీటరు పెట్రోల్ ధర రూ.29లు, డీజిల్ ధర రూ.28.58లు పెంచారని స్సష్టం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఐదు రోజుల్లోనే లీటరు పెట్రోల్పై రూ.3.20 పెంచారని మండిపడ్డారు. మరోవైపు.. ఎనిమిదేళ్లలో మోదీ సర్కార్ డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని 531శాతం, పెట్రోల్పై 203 శాతం పెంచినట్టు ఆరోపించారు. -
నోట్ల కష్టాలతో 70 మంది మృతి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సర్కారు అనాలోచితంగా పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్య ప్రజలు కష్టాలు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. దేశవ్యాప్తంగా నోట్ల కష్టాలతో 13 రోజుల్లో 70 మంది ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సూర్జివాలా తెలిపారు. బ్యాంకులు, పోస్టాఫీసులు, ఏటీఎంల ముందు క్యూలో నిలబడి సామాన్యులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశాన్ని ఎన్డీఏ ప్రభుత్వం తిరోగమనంలోకి తీసుకెళుతోందా, ముందుకు తీసుకెళుతోందా అని ప్రశ్నించారు. కేంద్రం పలాయనవాదం అవలంభిస్తోందని మండిపడ్డారు. తప్పించుకునే ధోరణి సరికాదని అన్నారు. దేశంలో 86 శాతం నగదు నల్లధనం రూపంలో ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించినట్టు వార్తలు వస్తున్నాయని, నిజంగా మోదీ ఈ మాట అనుంటే అంతకన్నా అవమానకర ప్రకటన మరోటి ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ అన్నారు. చట్టబద్దంగా దాచుకున్న నగదుపై నియంత్రణలు విధించడం సమంజసం కాదన్నారు. నోట్ల కష్టాలతో సామాన్యులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement