-
వ్యాపార ఆశావాదం జూమ్
హైదారాబాద్: వ్యాపార ఆశావాదం మెరుగుపడినట్టు టీఆర్ఏ మార్కెటింగ్ డెసిషన్ ఇండెక్స్ ప్రకటించింది. 2023 మూడో త్రైమాసికం (జూలై–సెప్టెంబర్) విషయంలో వ్యాపార ఆశావహం ఎంతో ఎక్కువగా ఉంటుందని తాజా నివేదికలో వెల్లడించింది. వరుసగా మూడో త్రైమాసికంలోనూ అధిక సానుకూలత వ్యక్తమైనట్టు తెలిపింది. టీఆర్ఏ మార్కెటింగ్ డెసిషన్ ఇండెక్స్ (ఎండీఐ) 2023 క్యూ2లో 89.37గా ఉంటే క్యూ3 అంచనాలు 92.68 పాయింట్లకు చేరింది. 50కిపైన సానుకూలంగా, 50కి దిగువ ప్రతికూలంగా పరిగణిస్తుంటారు. ఈ ప్రకారం మూడో త్రైమాసికానికి వ్యాపార ఆశావహం ఎంతో మెరుగ్గా ఉంటుందని ఎండీఐ తెలిపింది. నివేదికలోని అంశాలు.. ► కంపెనీలకు సంబంధించి మార్కెటింగ్ బడ్జెట్ గణనీయంగా పెరగొచ్చు. ఇందుకు సంబంధించి సూచీ 8.8 శాతం పెరిగి 85.1 నుంచి 92.6 పాయింట్లకు క్యూ3లో చేరుకోవచ్చు. ► ప్రాంతీయ ప్రింట్ ప్రకటనల వాటా మార్కెటింగ్ బడ్జెట్లో అధికంగా ఉంటుంది. అవుట్ ఆఫ్ హోమ్ అడ్వర్టైజింగ్ (ఓఓహెచ్) వాటా 11 శాతం, జాతీయ టీవీల ప్రకటనలు, రేడియో ప్రకటనలు చెరో 10 శాతం వాటా ఆక్రమించనున్నాయి. ► లోకల్ టీవీ ప్రకటనలు, ఇంగ్లిష్ ప్రింట్ ప్రకటనల వాటా 9 శాతం, సోషల్ మీడియా ప్రకటనల వాటా 7 శాతం మేర ఉండనుంది. డిజిటల్ సెర్చ్, డిజిటల్ యాడ్ 6 శాతం ఉండొచ్చని ఎండీఐ నివేదిక అంచనా వేసింది. -
ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు : రూ.1.6 లక్షల కోట్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 36.8 శాతం వృద్ధితో రూ.1.6 లక్షల కోట్లు దాటతాయని ఇండియా సెల్యులార్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) అంచనా వేస్తోంది. ఇందులో మొబైల్స్ వాటా దాదాపు సగ భాగం ఉంటుందని భావిస్తోంది. ‘దేశం నుంచి 2021-22లో రూ.1,16,937 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ పలు దేశాలకు సరఫరా అయ్యాయి. ఇందులో మొబైల్స్ వాటా రూ.45,000 కోట్లు. 2022-23లో ఇది రూ.76,000 కోట్లు దాటుతుంది. 2022 ఏప్రిల్-డిసెంబర్లో భారత్ నుంచి ఎగుమతి అయిన ఎలక్ట్రానిక్స్ విలువ రూ.1,33,313 కోట్లు. ఇందులో మొబైల్స్ వాటా రూ.60,000 కోట్లు ఉంటుందని అంచనా. 2021 ఏప్రిల్-డిసెంబర్లో మొబైల్స్ ఎగుమతులు రూ.27,288 కోట్లు. యూఏఈ, యూఎస్, నెదర్లాండ్స్, యూకే, ఇటలీకి అధికంగా మొబైల్స్ సరఫరా అయ్యాయి’ అని ఐసీఈఏ వివరించింది. -
ఢిల్లీలో రేపు అత్యవసర కరోనా సమీక్ష సమావేశం
న్యూఢిల్లీ: పలు దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం అత్యవసర సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం కరోనా పరిస్థితిపై గట్టి నిఘా ఉంచాలని, ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురైతే తగిన చర్యలు తీసుకునేలా సంసిద్ధం కావాలని అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య శాఖను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్, యూఎస్లలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొత్త వేరియంట్లను ట్రాక్ చేసేలా తగిన చర్యలను తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మంగళవారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష భూషణ్ రాష్ట్రాలకు కేంద్ర పాలితన ప్రాంతాలకు కరోనా విషయమై అప్రమత్తంగా ఉండాలంటూ లేఖ రాశారు. ఆ లేఖలో దేశంలో కరోనాకి సంబంధించిన కొత్త వేరియంట్ని గుర్తించగలిగేలా అవసరమైన ప్రజారోగ్య చర్యలను చేపట్టడం ద్వారా సులభంగా బయటపడేలా మార్గం సుగమం అవుతుందని చెప్పారు. (చదవండి: మొబైల్ ఫోన్ కోసం కన్నతల్లినే దారుణంగా కొట్టిన కసాయి కొడుకు) -
ద్రవ్యోల్బణం కట్టడి ఇప్పట్లో సాధ్యమేనా? ఆర్బీఐ కీలక ఆర్టికల్
ముంబై: ద్రవ్యోల్బణంపై పోరాటం చాలా కాలంపాటు కొనసాగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అక్టోబర్ బులిటెన్లో ప్రచురితమైన ఒక ఆర్టికల్ ఒకటి పేర్కొంది. దీర్ఘకాల ద్రవ్య విధానంసహా, పలు చర్యలు ధరల కట్టడికి పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేసింది. ‘‘మనం ద్రవ్యోల్బణంపై విజయం సాధిస్తే, ప్రపంచంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్ ఆర్థికాభివృద్ధి అవకాశాలు మరింత సుస్థిరమవుతాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ద్రవ్యోల్బణం సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో భారత్ తగిన స్థాయిలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసినట్లవుతుంది. అలాగే ఈ హర్షణీయమైన పరిణామం విదేశీ పెట్టుబడిదారులను పునరుజ్జీవింపజేస్తుంది. మార్కెట్లను స్థిరీకరించి, శాశ్వత ప్రాతిపదికన భారత్ ఆర్థిక స్థిరత్వాన్ని పొందేలా చేస్తుంది’ అని డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం రాసిన కథనం పేర్కొంది. బులిటన్లో పబ్లిష్ అయిన ఆర్టికల్ అంశాలను ఆర్బీఐ అంగీకరించాల్సిన అవసరం లేకపోవడం గమనార్హం. 2022 సెప్టెంబర్ వరకూ గడచిన తొమ్మిది నెలల నుంచి ఆర్బీఐ పాలసీకి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం కేంద్రం సెంట్రల్ బ్యాంక్కు నిర్దేశిస్తున్న స్థాయి 6 శాతానికి మించి నమోదవుతున్న నేథ్యంలో ఈ ఆర్టికల్ వెలువడింది. కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం హద్దు మీరి పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి వరుసగా నాలుగుసార్లు ఆర్బీఐ రెపోరేటు పెంచింది. మేలో 4 శాతంగా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) ఈ నాలుగు దఫాల్లో 190 బేసిస్ పాయింట్లు పెరిగి, ఏకంగా 5.9 శాతానికి (2019 ఏప్రిల్ తర్వాత) చేరింది. మరింత పెరగవచ్చనీ ఆర్బీఐ సంకేతాలు ఇచ్చింది. రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు అంచనా 6.7 శాతంకాగా, క్యూ2 , క్యూ3, క్యూ4ల్లో వరుసగా 7.1 శాతం, 6.5 శాతం, 5.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ రేటు 5.1 శాతానికి దిగివస్తుందని అంచనా వేసింది. అక్టోబర్, నవంబర్ల్లోనూ ద్రవ్యోల్బణం ఎగువబాటనే పయనిస్తే, తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 5 నుంచి 7 సమయంలో ఆర్బీఐ రెపో రేటును మరో అరశాతం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడచిన తొమ్మిది నెలలుగా ద్రవ్యోల్బణం కట్టడిలో ఎందుకు లేదన్న అంశంపై కేంద్రానికి ఆర్బీఐ త్వరలో ఒక నివేదిక సమర్పిస్తుందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఆర్బీఐ పాలసీ నిర్ణయాల్లో కీలకమైన రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్లో ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయిని నమోదుచేసుకుంది. రేటు పెంపు ప్రభావానికి ఆరు క్వార్టర్లు ఆగాలి: వర్మ ద్రవ్యోల్బణం కట్టడికిగాను ఆర్బీఐ గడచిన మే నుంచి పెంచిన 190 బేసిస్ పాయింట్ల రెపో రేటు ప్రభావం వ్యవస్థలో కనబడ్డానికి 5 నుంచి 6 త్రైమాసికాలు (సంవత్సన్నర వరకూ) పడుతుందని ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యుడు జయంత్ ఆర్ వర్మ పేర్కొన్నారు. ‘‘కఠిన ద్రవ్య పరపతి విధానాన్ని అవలంభిస్తున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణం తప్పనిసరిగా దిగొస్తుంది’’ అని ఒక టెలిఫోనిక్ ఇంటర్వూలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (అహ్మదాబాద్) ప్రొఫెసర్గా ఉన్న వర్మ, మాంద్యం భయాలు లేనప్పటికీ, భారత్ ఆర్థిక వృద్ధి వాస్తవానికి చాలా సంవత్సరాలుగా అనుకున్న స్థాయిలో లేదని ఈ సందర్భంగా వర్మ వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణం కట్టడి-వృద్ధి ప్రస్తుతం పరపతి విధానానికి సవాళ్లు విసురుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ద్రవ్యోల్బణం కట్టడికే ఆర్బీఐ ఎంపీసీ తొలి ప్రాధాన్యతని వివరించారు. భారత్ రూపాయి చరిత్రాత్మక కనిష్టానికి పడిన విషయాన్ని ప్రస్తావిస్తూ, దాదాపు ప్రతి కరెన్సీపై డాలర్ ఇటీవల బలపడిందన్నారు. అమెరికా వాస్తవ ఎకానమీ పటిష్టత, ఫెడ్ అనుసరిస్తున్న కఠిన ద్రవ్య విధానం డాలర్ బలపడ్డానికి కారణమని విశ్లేషించారు. అయితే ఇది ఆర్థిక వ్యవస్థకు ప్రతికూల అంశమేనని పేర్కొన్నారు. -
ఆగస్టు నెలలోనే కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం: ఎస్బీఐ రిపోర్ట్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే. ఫోటోలు వైరల్
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement