breaking news
Sunil Mishra
-
భారతీయుల సంపద.. 257 లక్షల కోట్లు
వ్యక్తిగత సంపద విలువ 5 ఏళ్లలో 84% వృద్ధి.. ⇒గతేడాదితో పోలిస్తే 27% అప్ ⇒నాలుగేళ్లలో రెట్టింపు అయ్యే చాన్స్ డివూండ్ ⇒వ్యక్తిగత ఆస్తుల్లో బంగారానిదే తొలి స్థానం ⇒2015లో ఈక్విటీలే అధిక రాబడిని ఇస్తారుు ⇒2020కి సెన్సెక్స్ లక్ష్యం 1,00,000 ⇒కార్వీ ఇండియూ వెల్త్ రిపోర్ట్ ⇒ఐదవ ఎడిషన్ విడుదల హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటంతో వచ్చే ఐదేళ్లలో భారతీయుుల వ్యక్తిగత సంపద రెట్టింపు అవుతుందని కార్వీ ఇండియా వెల్త్ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం రూ.257.4 లక్షల కోట్లుగా ఉన్న దేశ వ్యక్తిగత సంపద వచ్చే ఐదేళ్లు ఏటా 15 శాతం వృద్ధితో రూ. 500 లక్షల కోట్లు దాటుతుందని అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే వ్యక్తిగత సంపద 27.5 శాతం వృద్ధి చెందితే, గడిచిన ఐదేళ్లలో 84 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. కార్వీ ప్రైవేట్ వెల్త్ సంస్థ విడుదల చేసిన ఐదవ భారతీయ సంపద వివరాల ప్రకారం భారతీయుల వ్యక్తిగత చరాస్తుల (నగదు, బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, ఈక్విటీ ఆధారిత పెట్టుబడులు) విలువ రూ. 134.7 లక్షల కోట్లు (52.3%), స్థిరాస్తుల (రియుల్ ఎస్టేట్, గోల్డ్, డైమండ్, సిల్వర్, ప్లాటినమ్) విలువ రూ. 122.7 లక్షల కోట్లు (47.7%)గా ఉంది. భారతీయుుల వ్యక్తిగత సంపద వృద్ధిపై ఆర్థికమాంద్య ఛాయలు కనిపించలేదని, ఇప్పుడు ఆర్థిక వృద్ధిరేటు పుంజుకుంటుండటంతో వచ్చే ఐదేళ్లలో ఈ సంపద రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నట్లు కార్వీ ప్రైవేట్ వెల్త్ సీఈవో సునీల్ మిశ్రా పేర్కొన్నారు. జీడీపీ 7.5 శాతానికి... 2018 నాటికి దేశ జీడీపీ వృద్ధిరేటు 7.5 శాతానికి చేరుతుందని నివేదిక అంచనా వేసింది. వచ్చే ఐదేళ్లు ఈక్విటీల పనితీరు బాగుంటుందని, ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధనాలతో పోలిస్తే ఈక్విటీలే అధిక రాబడిని అందిస్తాయని కార్వీ పేర్కొంది. వచ్చే ఐదేళ్లు ఈక్విటీలు 25 శాతం వృద్ధి చెందడం ద్వారా 2020 నాటికి సెన్సెక్స్ 1,00,000 పాయింట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. బంగారానికి తగ్గిన డివూండ్ ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెరిగినప్పటికీ ఇండియూలో తగ్గినట్లు కార్వీ పేర్కొంది. 2012-13లో ఇండియా 918 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటే 2013-14లో ఈ విలువ 5.6 శాతం క్షీణించి 867 టన్నులకు పడిపోయింది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ 16 శాతం వృద్ధితో 3,237 టన్నుల నుంచి 3,745 టన్నులకు పెరిగింది. కానీ ఇప్పటికీ భారతీయుల వ్యక్తిగత సంపదలో బంగారానిదే మొదటి స్థానం. సుమారు రూ. 62.53 లక్షల కోట్ల విలువైన బంగారాన్ని భారతీయులు కలిగి ఉన్నారు. బంగారం తర్వాత రియల్ ఎస్టేట్, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఈక్విటీలు వరుస స్థానాల్లో ఉన్నారు. రియల్ ఎస్టేట్లో రూ. 50.38 లక్షల పెట్టుబడులు, ఫిక్స్డ్ డిపాజిట్లు బాండ్స్లో రూ. 29.39 లక్షల కోట్లు, ప్రత్యక్ష ఈక్విటీల్లో రూ. 26.66 లక్షల కోట్లు, బీమాలో రూ. 22.12 లక్షల కోట్లు కలిగి ఉన్నారు. -
భారతీయుల సంపద ఐదేళ్ళలో రూ.411లక్షల కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే ఐదేళ్ళలో భారతీయుల వ్యక్తిగత సంపద విలువ రెట్టింపై రూ.411 లక్షల కోట్లకు చేరుకుంటుందని కార్వీ ప్రైవేట్ వెల్త్ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం భారతీయులు వ్యక్తిగత సంపద రూ.202 లక్షల కోట్లుగా ఉన్నట్లు కార్వీ ‘ఇండియా వెల్త్ రిపోర్ట్- 2013’ పేర్కొంది. ఆర్థిక సంస్కరణల పేరుతో దేశం ముందుకుపోతున్నా ఇప్పటికీ భారతీయులు ఈక్విటీల కంటే బంగారం, స్థిరాస్తి రంగాలనే ఎక్కువగా నమ్ముకుంటున్నారు. ఈ మొత్తం సంపదలోనే అత్యధికంగా రూ.60.61 లక్షల కోట్లు (30 శాతం) ఒక్క బంగారానికే కేటాయించారంటే భారతీయులు బంగారంపై ఎంత ప్రేమ పెంచుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాతి స్థానంలో స్థిరాదాయాన్నిచ్చే బ్యాంకు డిపాజిట్లు, బాండ్లలో రూ.35 లక్షల కోట్లు (17%), రియల్ ఎస్టేట్లో రూ.31.43 లక్షల కోట్లు (16%) ఇన్వెస్ట్ చేశారంట. వీటన్నింటితో పోలిస్తే భారతీయులు కేవలం రూ.24.31 లక్షల కోట్ల(12%) విలువైన ఈక్విటీ సంపదను మాత్రమే కలిగి ఉన్నారు. ఇతర పెట్టుబడి సాధనాలన్నింటికీ కలిపి 54 శాతం కేటాయిస్తే కేవలం బంగారం, స్థిరాస్తి రంగాలకే 46 శాతం కేటాయించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఫైనాన్షియల్ పెట్టుబడి సాధనాలు, ఫిజికల్ అసెట్స్ పెట్టుబడుల నిష్పత్తి 55:45 వద్ద స్థిరంగానే ఉందని కార్వీ ప్రైవేట్ వెల్త్ సీఈవో సునీల్ మిశ్రా తెలిపారు. కాని రానున్న కాలంలో ఆర్థిక వ్యవస్థ గాడిలో పడటంతో బంగారం నుంచి ఈక్విటీల్లోకి పెట్టుబడులు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సంపదలో 30 శాతం వాటా ఉన్న బంగారం వాటా 22 శాతానికి పడిపోతుందని ఈ మొత్తం అత్యధికంగా ఈక్విటీల్లోకి వస్తుందన్నారు. అలాగే వచ్చే మూడేళ్లలో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కూడా బాగా పెరుగుతాయన్నారు. ప్రస్తుతం ఫిజికల్ అసెట్స్లో బంగారం, స్థిరాస్తి నిష్పత్తి 65:35గా ఉందని, అదే వచ్చే ఐదేళ్ళలో 52:48గా మారుతుందన్నారు.