‘శతాబ్ది’టికెట్ ధరలు తగించాలి
అనంతపురం న్యూసిటీ: శతాబ్ది ఎక్స్ప్రెస్లో డైనమిక్ పేరుతో చార్జీలు అధికంగా వసూలు చేస్తున్నారని తక్షణం ఆ టికెట్ ధరలు తగ్గించాలని ఎస్యూసీఐ(సీ) నగర కార్యదర్శి రాఘవేంద్ర డిమాండ్ చేశారు. శుక్రవారం అనంతపురం రైల్వే స్టేషన్ మేనేజర్ తిప్పానాయక్కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎస్యూసీఐ నాయకులు సుబ్రమణ్యం, తబ్రేజ్, నాగేంద్ర తదితరులున్నారు.