-
గొర్రెల కోసం వెళ్లి.. బందీలుగా మారి..
సాక్షి, జనగామ: సబ్సిడీ గొర్రెల కొనుగోలు నిమిత్తం కర్ణాటకకు వెళ్లినవారు ఊహించని షాక్కు గురయ్యారు. జనగామ జిల్లాలోని చిల్పూర్ మండలం లింగంపల్లికి చెందిన 12 మంది, చిల్పూర్కి చెందిన 20 మంది గొర్రెల కాపరులు వెటర్నరీ అధికారుల సహకారంతో ఈ నెల 15న కర్ణాటకకు వెళ్లారు. చిల్పూర్కు చెందిన 20 మంది గొర్రెలను కొనుగోలు చేసి తిరిగొచ్చారు. లింగంపల్లి గొర్రెల కాపరులు శుక్రవారం రాత్రి యాద్గిర్ జిల్లా వడిగర్ల తాలుకా ఖానాపురం ప్రభుత్వ పాఠశాలలో బస చేశారు. వారితో ఉన్న వెటర్నరీ డాక్టర్ కిరణ్ తన బాధ్యతలను గుండాల వెటర్నరీ డాక్టర్ జాటోత్ యాకూబ్కు అప్పగించారు. అయితే, యాకూబ్ తిరిగి యాద్గిర్ జిల్లా కేంద్రానికి వచ్చారు. ఇటీవల ఆ చుట్టుపక్కల గ్రామాలైన వడిగర్ల, ఖానాపురం ప్రాంతాల్లో చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే ముఠా సంచరిస్తోందనే వదంతులున్నాయి. అంతకు ముందు దొంగలు చోరీలకు వచ్చి ఇద్దరిని హత్య చేసిన∙ఉదంతాలున్నాయి. దీంతో రాత్రిపూట ఆ ప్రాంతవాసులు గస్తీ కాస్తున్నారు. ఈ క్రమంలో పాఠశాల ఆవరణలోకి దొంగల ముఠా వచ్చిందని సమాచారం అందడంతో గ్రామస్తులు అక్కడకు పెద్ద సంఖ్యలో చేరారు. గొర్రెల కాపరులకు కన్నడ భాష రాకపోవడంతో స్థానికులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక పోయారు. దీంతో దొంగలుగా భావించి వారిపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. వారిని బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రాత్రంతా స్టేషన్లోనే భయంతో కాలం వెళ్లదీశారు. బాధితుడి సెల్ ద్వారా వెలుగులోకి.. పోలీసుల అదుపులో ఉన్న బాధితుడు ఒకరు తన సెల్ఫోన్ ద్వారా తమ కష్టాలను వాట్సాప్లో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీస్ స్టేషన్లో తాము కూర్చున్న విధానం, గ్రామస్తుల చేతిలో గాయపడిన ఫొటోలు పోస్టు చేశాడు. దీంతో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు సిద్ధిరాజ్ యాదవ్ స్పందించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. యాదవ నాయకులు, అధికారుల ప్రయత్నాలతో పోలీసులు వారిని విడుదల చేశారు. శనివారం గొర్రెలకాపరులు లింగంపల్లికి తిరుగుపయనమ య్యారు. గొర్రెలకాపరుల వెంట వెటర్నరీ అధికారులుండకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని యాదవ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మైనారిటీల సంక్షేమానికి ప్రాధాన్యత
► మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ► సబ్సిడీ గొర్రెల పంపిణీ ► మొక్కలు నాటాలని పిలుపు తమ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. రుద్రూర్లో మంగళవారం టీఆర్ఎస్ మైనారిటీ సెల్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. కోటగిరి మండలం పోతంగల్ గ్రామంలో మంగళవారం 15 మంది లబ్ధిదారులకు సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేశారు.ఈ ఏడాది జిల్లాలో 9,600 యూనిట్లను పంపిణి చేస్తామని పేర్కొన్నారు. వర్ని(బాన్సువాడ): మైనారిటీల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. రుద్రూర్లో మంగళవారం టీఆర్ఎస్ మైనారిటీ సెల్ మండల కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మైనారిటీ సంక్షేమానికి, అభివృద్ధి కోసం బడ్జెట్లో ప్రభుత్వం రూ. 1250 కోట్లు కేటాయించిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మైనారిటీ బాల బాలికల కోసం 206 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించామని తెలిపారు. షాదీముబారక్ పథకం ద్వారా మూడేళ్లలో 70 వేల మంది లబ్ధిపొందారని పేర్కొన్నారు. రుద్రూర్లో త్వరలోనే వ్యవసాయ, ట్రాన్స్కో ఏడీఏ కార్యాలయాలను ఏర్పాటవుతాయని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, మైనారిటీ సెల్ మండల కన్వీనర్ సయ్యద్ ముల్తానీ, ఏఎంసీ చైర్మన్ నరోజి గంగారాం, వైస్ ఎంపీపీ సంజీవరెడ్డి, విండో చైర్మన్ పత్తిరాము, ఎంపీటీసీ సభ్యురాలు తోట విజయలక్ష్మి, ఏఎంసీ డైరెక్టర్ అహ్మద్ హుస్సేన్, నాయకులు కోడె శంకర్, బొట్టె గజేందర్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి రుద్రూర్ చెరువు కట్టపై మంగళవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో మంత్రి పోచారం ఈత మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, ఉపాధిహామీ, అటవీశాఖ సిబ్బంది, గౌడ సంఘం అధ్యక్షుడు సత్యాగౌడ్, సభ్యులు పాల్గొన్నారు. గొల్ల, కుర్మలు అ«ర్థికంగా బలపడాలి టీఆర్ఎస్ ప్రభుత్వం అ«ందిస్తున్న గొర్రెల పంపిణీ పథకాన్ని సద్వినియోగం చేసుకుని గొల్ల, కుర్మ, యాదవులు అర్థికంగా అభివృద్ధి చెందాలని మంత్రి పోచారం సూచించారు. కోటగిరి మండలం పోతంగల్ గ్రామంలో మంగళవారం 15 మంది లబ్ధిదారులకు సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేశారు. పోతంగల్ గ్రామంలో రూ.38లక్షలతో నిర్మించే సీసీ రోడ్డుకు, రూ.15లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ డ్ర యిన్స్కు శంకుస్థాపన చేశారు. 67 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి మా ట్లాడుతూ రాష్ట్రంలో 7లక్షల 17వేల మంది గొల్ల, కు ర్మలు గొర్రెలు కోసం నమోదు చేసుకున్నారని, వీరి లో ఈ ఏడాది సగం మందికి, వచ్చే ఏడాది మరో స గం మందికి 75 శాతం సబ్సిడీపై గొర్రెలను అందజేస్తామన్నారు. ఈ ఏడాది జిల్లాలో 9,600 యూని ట్లను పంపిణి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం కోటగిరి మండలం పోతంగల్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో జిల్లా పశసంవర్థక శాఖ అధికారి ఎల్లన్న, ఎంపీపీ సులోచన, జెడ్పీటీసీ శంకర్, సర్పంచ్ గంగామణి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎజాజ్ ఖాన్, మండల వెటర్నరి వైద్యాధికారి కిరణ్ దేశ్పాండే పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య
హీరోగా జబర్దస్త్ కమెడియన్.. ఆసక్తిగా ట్రైలర్!
‘రాహుల్ గాంధీపై పాక్ ప్రేమ ఆందోళన కలిగించింది’
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
కొత్త పగటివేషగాడు వచ్చాడు
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
మహిళల టీ20 వరల్డ్కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
తప్పక చదవండి
- కొత్త పగటివేషగాడు వచ్చాడు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement