breaking news
sriram project
-
ప్రచారాస్త్రంగా పునరుజ్జీవం
మోర్తాడ్(బాల్కొండ): శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకం పూర్తయిన తరువాత కలిగే ప్రయోజనాలను వివరి స్తూ రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందాలని అధికార పార్టీ టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా కదులుతోంది. పునరుజ్జీవన పథకానికి కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలను రైతులకు తెలియజేప్పే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ అ భ్యర్థులు రైతులను, యువ నాయకులను కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు స్టడీ టూర్ కోసం ఆదివారం పంపించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ భా గంలో గోదావరి నదిపై మహారాష్ట్ర ప్ర భుత్వం బాబ్లీ ప్రాజెక్టును నిర్మించడంతో వరద నీటికి అడ్డుకట్ట పడింది. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకముందు వరద నీరు గోదావరి నదిలోకి చేరి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం ఆశిం చిన విధంగానే పెరిగేది. బాబ్లీ ప్రా జెక్టు నిర్మాణం తరువాత వరదలు అధికంగా వస్తేనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ భాగం నుంచి నీరు తరలివస్తోంది. ఈ నేథ్యంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు పునరుజ్జీవన పథకానికి శ్రీకా రం చుట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వరద కాలువను ఉపయోగించుకుని రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని మళ్లించడానికి పునరుజ్జీవన పథకాన్ని అమలు చేస్తున్న విషయం విదితమే. రూ.1,064 కోట్ల వ్యయంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకానికి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగానే పునరుజ్జీవన పథ కం పనులు సాగుతున్నాయి. ముప్కాల్ వద్ద పంప్హౌజ్ నిర్మాణం పనులు సా గుతుండగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు కూడా వేగంగానే కొనసాగుతున్నాయని స్టడీ టూర్కు వెళ్లిన నియోజకవర్గం రైతులు, యువకులు తెలిపారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలించేది ఇలా... కాళేశ్వరం పరిసరాల్లో భారీ వర్షం కురిస్తే అనేక టీఎంసీల నీరు గోదావరి నది ద్వారా సముద్రంపాలవుతుంది. భారీ వర్షాలు కురిసిన సమయంలో దాదాపు వెయ్యి టీఎంసీల నీరు సముద్రం పాలైన సందర్భాలు ఉన్నాయి. ఆనీటిని సద్వినియోగం చేసుకోవడానికే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. కాళేశ్వరం నుంచి అన్నారం, సుందిల్లల వద్ద నిర్మించిన పంప్హౌజ్ల నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు అక్కడి నుంచి మిడ్మానేర్ డ్యామ్కు ఎగువ భాగంలో ఉన్న వరద కాలువలోకి నీటిని వదులుతారు. వరద కాలువలోకి చేరిన నీరు 40 మీటర్ల ఎత్తున ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి రివర్స్ పంపింగ్ ద్వారా రోజుకో టీఎంసీ చొప్పున నీటిని మళ్లించాలని డిజైనింగ్ చేశారు. అయితే ఆశించిన విధంగా నీటిని తరలించడానికి వీలు ఉంటే రోజుకు ఒక టీఎంసీ కాకుండా రెండు టీఎంసీల నీటిని తరలించవచ్చని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. వరద కాలువ రివర్స్ పంపింగ్ ద్వారా రూ.500 కోట్ల ఆదా... కాళేశ్వరం నీటిని మిడ్మానేరు నుంచి మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు అక్కడి నుంచి హల్దీవాగు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టుకు తరలించాలని ముందుగా నిర్ణయించారు. నిజాంసాగర్ ప్రాజెక్టును నింపిన తరువాత మంజీర నదిలోకి మిగులు జలాలను విడిచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు తరలించాలని ప్రతిపాదించారు. ఇలా చేయడం వల్ల రోజుకు అర టీఎంసీ నీటిని మాత్రమే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు తరలించవచ్చు. ఈ విధానం వల్ల ఒక ఏడాదికి రూ.600 కోట్ల విద్యుత్ బిల్లును ప్రభుత్వం భరించాల్సి ఉంది. అయితే వరద కాలువ ద్వారా రివర్స్పంపింగ్ చేయడం వల్ల రోజుకు ఒకటి నుంచి రెండు టీఎంసీల నీటిని తరలించడమే కాకుండా రూ.100 కోట్ల విద్యుత్ బిల్లును మాత్రమే ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. నీటిపారుదల శాఖలో పని చేసిన ఒక రిటైర్డ్ ఇంజినీర్ ఇచ్చిన సలహా ప్రకారం తాజా మాజీ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి చొరవ చూపడంతో సీఎం కేసీఆర్ వరద కాలువ రివర్స్ పంపింగ్కు ఆమోదం తెలిపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వరద కాలువ, కాకతీయ కాలువలలో నిరంతరం నీరు... పునరుజ్జీవన పథకం పూర్తి అయితే వరద కాలువ, కాకతీయ కాలువలలో నిరంతరం నీటిని ప్రవహించేలా చేసే అవకాశం ఉంది. వరద కాలువ రివర్స్ పంపింగ్ కోసం వినియోగించడం వల్ల ఈ కాలువలో నీరు ఉంటుంది. అలాగే కాకతీయ కాలువ ద్వారా దిగువ భాగానికి నీటిని విడుదల చేయనుండటంతో నిరంతరం నీరు నిలువ ఉండే అవకాశం ఉంటుంది. ఫలితంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద జల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యానికి మించి జరుగుతుంది. రెండు కాలువల్లో నీరు నిలిచి ఉంటే చెరువులను నింపుకోవడంతో పాటు, పంపు సెట్ల ద్వారా పంట పొలాలకు సాగునీటిని తరలించడానికి అవకాశం ఉంది. వరద కాలువలో నీరు నిలువ ఉంటే కాలువకు సిమెంట్ లైనింగ్ లేక పోవడంతో భూగర్భ జలాలు ఎంతో వృద్ధి చెందుతాయని రైతులు భావిస్తున్నారు. వరద కాలువకు ఎడమవైపున ఏర్పాటు చేసిన తూమ్లు ఆరు మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఈ తూమ్ గేట్లను ఇంకా కిందికి దించితే తక్కువ సమయంలోనే చెరువులను నింపడానికి పరిస్థితులు అనుకూలిస్తాయి. వరద కాలువలో నీటిని నిలువ ఉంచడం వల్ల బాల్కొండ నియోజకవర్గంలోని మరో పదివేల ఎకరాలకు సాగునీటిని అందించడానికి అవకాశం కలుగుతుంది. ఒక్క పునరుజ్జీవన పథకం పూర్తి జరిగితే ఎన్నో ప్రయోజనాలను రైతులకు అందించవచ్చని టీఆర్ఎస్ నాయకులు తమ ప్రచారంలో వివరించాలని భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఎంతో మేలు... కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి జరిగితే ఎంతో మేలు కలుగనుంది. ఈ రోజు రైతులం ప్రాజెక్టును సందర్శించాం. కాళేశ్వరం నీరు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చేరితే రైతులకు మూడు పంటలకు సాగునీరు అందుతుంది. ఎంతో విలువైన పంటలను పండించడానికి అవకాశం ఉంది. – కౌడ భూమన్న, రైతు, తొర్తి మాకు అవగాహన కలిగింది కాళేశ్వరం ప్రాజెక్టు ను సందర్శించడం వల్ల వరద కాలువ రివర్స్ పంపింగ్పై అవగాహన కలిగింది. వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్ చేసి నీటిని ప్రాజెక్టుకు తరలిస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. రాజకీయాలు ముఖ్యం కాదు. ప్రజలకు సాగునీరు అందడం ముఖ్యమని గుర్తించాలి. – తక్కూరి సతీష్, మోర్తాడ్ సాగునీటి సమస్యలు తీరనున్నాయి వరద కాలువ రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీరు చేరితే సాగునీటి సమస్యలు ఎన్నో తీరనున్నాయి. రైతుల కష్టాలు తీరి నాణ్యమైన పంటలను పండించవచ్చు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టు గురించి అందరు తెలుసుకోవాలి. – భోగ సుమన్, చౌట్పల్లి -
ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న ఇన్ఫ్లో
బాల్కొండ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. స్థానిక ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వలన 25 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతుంది. దీంతో ప్రాజెక్ట్ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(90 టీఎంసీలు) అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి ప్రాజెక్ట్లో 1077.60(46.20 టీఎంసీల) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రారంభమైన విద్యుదుత్పత్తి.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వార నీటి విడుదల చేపట్టడంతో ప్రాజెక్ట్ దిగువ భాగన ఉన్న జల విద్యుదుత్పత్తి కేంద్రంలో ఒక్క టర్బయిన్ ద్వారా విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. 9 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోందని జెన్కో అధికారులు తెలిపారు. -
ఆయన ఎందుకు వచ్చారో?
బాల్కొండ, న్యూస్లైన్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్ర గైక్వాడ్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ జోగ్దండ్ శుక్రవారం ఎస్ఆర్ఎస్పీని సందర్శించడం ప్రాజెక్టు అధికారులు, రైతులను కలవరపరుస్తోంది. ప్రాజెక్టు నిర్మించిన 50 ఏళ్లలో గైక్వాడ్ ప్రాజెక్టు సీఈ ఇక్కడికి రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. సమాచారం ఉన్నప్పటికీ ఎస్ఆర్ఎస్పీ ముఖ్య అధికారులు హాజరుకాకపోవడం వెనక మతలబు ఏమిటో అర్థం కావడం లేదు. బాబ్లీ ప్రాజెక్టుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత గైక్వాడ్ సీఈ ఎస్ఆర్ఎస్పీ వద్దకు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాబ్లీ నిర్మాణంపై సుప్రీం కోర్టు గతేడాది ఫిబ్రవరి 28న మహారాష్ట్ర సర్కారుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అనంతరం మహా సర్కారు అక్టోబర్లో బాబ్లీ గేట్లను దించింది. జూన్లో గేట్లను ఎత్తివేయాలి. ఏపీ, మహారాష్ట్ర మధ్య జలవివాదం తలెత్తకుండా త్రిసభ్య కమిటీ పర్యవేక్షిస్తుందని సుప్రీం తీర్పులో పేర్కొంది. ఈ కమిటీలో గైక్వాడ్ సీఈ సభ్యుడు కానున్నారా, అందుకోసమే ఎస్ ఆర్ఎస్పీని సందర్శించారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలే ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు బాబ్లీ ప్రాజెక్టు ముప్పుగా పరిణమించింది. దీనికితోడు మహారాష్ట్ర ప్రాజెక్టుల సీఈలు ఈ ప్రాజెక్టు నీటి నిల్వ, ఇన్ఫ్లో, అవుట్ఫ్లో వివరాలను తెలుసుకునిపోవడం అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది. గైక్వాడ్ ప్రాజెక్టు నుంచి ఇన్ఫ్లో నిల్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ భాగాన ఉన్న గైక్వాడ్ ప్రాజెక్టు నుంచి గడిచిన పదేళ్లలో ఎలాంటి ఇన్ప్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి రాలేదని రికార్డులు తెలుపుతున్నాయి. గైక్వాడ్ ప్రాజెక్టు కింద ఉన్న సిద్ధేశ్వర, ఎల్దరి, మజ్గావ్ ప్రాజెక్టు నుంచి ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. గైక్వాడ్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 102 టీఎంసీలు. ఇప్పటికి ప్రాజెక్టు ఖాళీగానే ఉందని సమాచారం. అలాంటప్పుడు గైక్వాడ్ సీఈ ఎస్ఆర్ఎస్పీ ఇన్ఫ్లో వివరాలను అడగడం వెనుక మతలబు ఏమిటో తెలియడం లేదు. -
జనవరి 16 నుంచి ‘కడెం’ నీటి విడుదల
కడెం, న్యూస్లైన్ : కడెం ప్రాజెక్టు ఆయకట్టు కిందనున్న వేలాది ఎకరాల పంట పొలాలకు వచ్చే నెల 16వ తేదీ నుంచి రబీ నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఈఈ వెంకటేశ్వర్రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజుల క్రితం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో వారు ఈ నిర్ణయం తీస్కున్నారని ఈఈ వివరించారు. కాగా, తొలుత కడెంలో జరిగిన నీటి సంఘాల సమావేశంలో జనవరి 8వ తేదీ నుంచే నీటి విడుదలకు నిర్ణయించారు. కానీ ఈ తేదీని అధికారులు తాజా సమావేశంలో మార్చారు. అయితే జనవరి 16వ తేదీ నుంచి ఎడమ, కుడి కాలువల ద్వారా నీటి విడుదల పద్ధతి ఈ విధంగా ఉంటుందని ఆయన వివరించారు. జనవరి 16 నుంచి 25వ తేదీ వరకు ఫిబ్రవరి 1 నుంచి 14 వరకు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6 వరకు మార్చి 17 నుంచి 26 వరకు ఏప్రిల్ 6 నుంచి 15వ తేదీ వరకు.. మిగతా రోజుల్లో కాలువలు మూసి ఉంటాయ ని ఈఈ తెలిపారు. ఈ పద్ధతిన డి-01 నుంచి డి-40 వరకు నీరిస్తామని, డి-42 పరిధిలో చెరువులను నింపుతామని పేర్కొన్నారు. ఆయకట్టు రైతులు ఈ విషయాన్ని గమనించి ఉన్న నీటిని పొదుపుగా వాడుకొని పంటల సాగు చేసుకోవాలని ఆయన సూచించారు.